India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APకి 30 ESI ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భూకేటాయింపులు పూర్తైన వెంటనే వీటి నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ESI ఆస్పత్రి రాబోతోందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారుగా వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని, ఆయా శాఖలతో సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు.
తనతో సంబంధం వల్లే నటుడు జయం రవి ఆయన భార్యకు విడాకులు ఇచ్చారన్న <<14159198>>ప్రచారంపై<<>> సింగర్ కెనీషా మరోసారి స్పందించారు. ‘ఆయనకు నాకు మధ్య శారీరక సంబంధం లేదు. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు మంచి మిత్రుడు. రవి విడాకుల నిర్ణయానికి నేను కారణం కాదు. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు’ అని ఓ ఇంటర్వ్యూలో కోరారు.
TG: రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 1న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. క్వాలిఫై అయిన వారు సంబంధిత జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.inను చూడండి.
నాన్వెజ్ ప్రియులకు బ్యాడ్న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర మళ్లీ పెరుగుతోంది. ఈనెల మొదట్లో కేజీ చికెన్ స్కిన్లెస్ రేట్ రూ.160-180 మధ్య పలికింది. 2 వారాల కిందట అది రూ.200 దాటగా గత వారం రూ.236కు చేరింది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్లెస్ రేట్ రూ.243గా ఉంది. దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చికెన్ రేట్ మీ ప్రాంతంలో ఎంత ఉంది?
హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్ ‘లెక్క సరి’ చేసిందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. నస్రల్లా మరణం అనంతరం ఆయన మొదటిసారి ప్రకటన ఇచ్చారు. ఎందరో ఇజ్రాయెలీలు, అమెరికన్లు, ఫ్రెంచ్ పౌరుల హత్యలకు కారణమైన సామూహిక హంతకుడిని అంతం చేసి ఇజ్రాయెల్ లెక్క సరి చేసిందన్నారు. తమ లక్ష్య సాధనకు నస్రల్లా మరణం అవసరమని పేర్కొన్న నెతన్యాహు ఇదొక చారిత్రక మలుపుగా అభివర్ణించారు.
అరవింద్ స్వామి, కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ’96’ మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కొన్ని వారాల తర్వాత అందులో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించగా, సూర్య-జ్యోతిక నిర్మించారు.
ఐపీఎల్ వేలం కోసం రిజస్టర్ చేసుకుని, సెలక్ట్ అయిన ప్లేయర్లు కచ్చితంగా టోర్నీలో ఆడాలని <<14222929>>ఐపీఎల్<<>> గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ ఆటగాళ్లపై రెండు సీజన్ల పాటు నిషేధం విధించనున్నట్లు పేర్కొంది. అలాగే ఓవర్సీస్ ప్లేయర్లు బిగ్ ఆక్షన్ కోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, లేదంటే వచ్చే ఏడాది వేలానికి వారు అర్హులు కారని తెలిపింది.
TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదయింది. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా, అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీంతో 16063/IN/224 కింద రంగనాథ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది. కాగా బుచ్చమ్మ మరణానికి, హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు.
TG: రాష్ట్రంలోని ఆరు డిపోల నుంచి (KNR 2, WGL, NZB, NLG, సూర్యాపేట, HYD2) RTC ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను నడపనుంది. తొలుత ఇవాళ కరీంనగర్-2 డిపో నుంచి 35 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, RTC MD సజ్జనార్ ప్రారంభిస్తారు. కరీంనగర్ నుంచి JBS, మంథని, GDK, JGL, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్దతిలో ఇవి నడవనున్నాయి.
తాను లండన్లో ‘దేవర’ సినిమా చూసినట్లు సీనియర్ నటి కుష్బూ ట్వీట్ చేశారు. ‘ఇతనే నా హీరో. సూపర్బ్ మాస్. దీనిని నేను ఎలా మిస్ అవుతాను? దేవరగా అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని పేర్కొన్నారు. దీనికి Jr.NTR ‘థాంక్యూ మేడమ్. మీకు నచ్చినందుకు సంతోషం’ అని రిప్లై ఇచ్చారు. తారక్ తన ఫేవరెట్ యాక్టర్ అని కుష్బూ గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.
Sorry, no posts matched your criteria.