India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సీఎం చంద్రబాబు రేపు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తమపక్కన తిరిగే వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసే వారిని నామినేటెడ్ పదవులకు సూచించాలని MLAలను CM ఆదేశించిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన షామా మహమ్మద్పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మండిపడ్డారు. ‘దేశానికి గర్వకారణమైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లు సిగ్గుపడాలి. వారికి మన దేశంలో బతికే హక్కు లేదు. క్రికెట్ మా మతం. ఇలాంటి మాటల్ని సహించేది లేదు. నేనే ప్రధానమంత్రినైతే ఆమెను వెంటనే బ్యాగ్ సర్దుకుని దేశం విడిచిపొమ్మని ఆదేశించి ఉండేవాడిని’ అని పేర్కొన్నారు.

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు మరోసారి మూడు రోజుల పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఇటీవల ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్కూ మెరుగవ్వాలని చూస్తుంటారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘సాధించిన దాని గురించి కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు. భారత్కు ఆడటాన్ని అదృష్టంగా భావిస్తారు. రికార్డుల్ని మాత్రమే కాదు. మైదానంలో ఆయన నిబద్ధత చూడండి. జట్టు కోసం ఏం చేయాలన్నా చేస్తారు. అందుకే భారత క్రికెట్ అనే విద్యాలయంలో విద్యార్థి స్థాయి నుంచి ఛాన్సలర్ స్థాయికి చేరుకున్నారు’ అని ప్రశంసించారు.

తెలుగువారికి బ్రేక్ఫాస్ట్లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.

AP: అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి 3రాజధానులు అవసరమని అధికారంలో ఉన్నప్పుడు YCP బలంగా వాదించింది. విశాఖ, అమరావతి, కర్నూలును రాజధానులు చేస్తామని తేల్చి చెప్పింది. అయితే 3 రాజధానులు కార్యరూపం దాల్చలేదు. కాగా, 3 రాజధానులు అప్పటి మాట అని, ప్రస్తుతం తమ విధానం ఏంటో చర్చించుకొని చెప్తామని బొత్స అన్నారు. దీంతో YCP యూటర్న్ తీసుకుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. దీనిపై మీ COMMENT.

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ <<15636715>>వ్యాఖ్యలను<<>> కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్పైనా ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పవన్ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. వారం రోజుల్లో ఆయన JSP తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడంతో దొరబాబు AUGలో వైసీపీకి రాజీనామా చేశారు.

గతంలోని ‘కాదేదీ కవితకనర్హం’ అనే నానుడిలోకి ఇప్పుడు ‘కాదేదీ సినిమా కథకు అనర్హం’ చేరింది. గతంలో కోతి, పాము, ఏనుగు, కొండచిలువ, పులి, సింహం, కుక్క వంటి జంతువుల నేపథ్యంగా సినిమాలు వచ్చాయి. ఇటీవల ట్రెండ్ కాకులకు మారింది. మన బంధు పక్షి కోర్ టాపిక్గా ‘విరూపాక్ష’, కాకి ముట్టడం అనే స్టోరీ లైన్తో ‘దసరా, బలగం’, వస్తే ఇప్పుడు కాకుల విక్టరీ అంటూ శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ తెరకెక్కిస్తున్నారు.

షెహజాదీ అనే భారత మహిళకు UAEలో ఈ నెల 15న మరణ శిక్ష అమలైంది. UPకి చెందిన ఆమెను విదేశాలకు తీసుకెళ్తానని నమ్మించిన ఓ బ్రోకర్ ఓ ముస్లిం జంటకు అమ్మేశాడు. వారు ఆమెను తమతో UAE తీసుకెళ్లి తమ బిడ్డ ఆలనాపాలనల్ని అప్పగించారు. ఆ బిడ్డ హఠాత్తుగా చనిపోవడంతో షెహజాదీపై హత్యారోపణలు మోపారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆమె వాదించినా ఆలకించని కోర్టు మరణ శిక్ష విధించింది.
Sorry, no posts matched your criteria.