News April 5, 2026

ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద ‘క్యాష్’ బంద్: కొత్త రూల్స్ ఇవే!

image

ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కానున్నాయి. FASTag లేదా UPI ద్వారానే పేమెంట్స్ చేయాలి. UPIతో చేస్తే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు పని చేయకపోతే వాహనదారుడికి ‘ఈ-నోటీస్’ వస్తుంది. 72 గంటల్లోపు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే అదనపు ఫీజు ఉండదు. ఆ తర్వాత అయితే డబుల్ టోల్ కట్టాలి. 15 రోజులు దాటితే VAHAN సిస్టమ్ ద్వారా కఠిన చర్యలు తప్పవు.

News April 5, 2026

కరెంట్ అఫైర్స్ (05-04-2026)

image

⋆ బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత ఆర్చర్ పాయల్ నాగ్‌కు గోల్డ్ మెడల్
⋆ ఆరో తరగతి నుంచి 3 భాషల విధానం.. 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు: CBSE
⋆ నాసా ఆర్టెమిస్-2 ప్రయోగం.. 1972 తర్వాత తొలిసారిగా చంద్రుడి కక్ష్యలోకి మనుషులు
⋆ ప్రపంచంలో అత్యంత బరువైన (7 టన్నులు) కార్గో డ్రోన్(Changying-8 లేదా CY-8)ను పరీక్షించిన చైనా.. దీని రేంజ్ 1,850మైళ్లు (2,977kms)

News April 5, 2026

న్యూక్లియర్ ముప్పు.. ఐరాసకు ఇరాన్ లెటర్

image

ఇరాన్‌లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం ‘బుషెహర్’ సమీపంలో జరుగుతున్న వరుస దాడులపై ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఐరాసకు లేఖ రాశారు. ఈ అటాక్స్ వల్ల రేడియోధార్మికత వెలువడే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల కేవలం ఇరాన్‌కే కాకుండా పొరుగు దేశాలకూ తీరని నష్టం కలుగుతుందని హెచ్చరించారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. తాజాగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఈ కేంద్రంపై నాలుగోసారి దాడి చేశాయి.

News April 5, 2026

కారుణ్య నియామకానికి ఏడాదిలోపే అప్లై చేయాలి: HC

image

TG: ఉద్యోగి మరణించిన ఏడాదిలోపే కుటుంబ సభ్యులు కారుణ్య నియామకం కోసం అప్లై చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఏడాది తర్వాత దరఖాస్తు చేస్తే ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉంటేనే నియామకం వర్తిస్తుందని చెప్పింది. ఉద్యోగి భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, కుటుంబం ఆర్థికంగా బాగున్నా కారుణ్య నియామకానికి అర్హులు కారని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా పేర్కొంది.

News April 5, 2026

IPL: ఇప్పటి వరకు వీళ్లే టాప్!

image

IPL-19లో ఇప్పటి వరకు 9మ్యాచులు జరగ్గా పలువురు యంగ్ క్రికెటర్లు సత్తా చాటారు. DC ప్లేయర్ సమీర్ రిజ్వీ ఆడిన 2 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో 160పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత లిస్టులో రోహిత్(113), కూపర్(108), రఘువంశీ(103) ఉన్నారు. ఇక రవి బిష్ణోయ్(RR) 5 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ దక్కించుకున్నారు. వైశాఖ్ విజయ్ కుమార్ సైతం 5 వికెట్లు పడగొట్టినా ఎకానమీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు.

News April 5, 2026

విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదు: హైకోర్టు

image

AP: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై గతంలో దేవదాయ శాఖ, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నారని, వారు గర్భాలయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన అమలు కావడం లేదంటూ ఓ అర్చకుడు కోర్టులో పిటిషన్ వేశారు.

News April 5, 2026

ఒకే కథ.. 3 ప్రాజెక్టులు!

image

‘కుమారస్వామి’ కథతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ కథాంశంతోనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. కాగా ‘కుమారస్వామి’పై తానూ ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్లు కిశోర్ తిరుమల కూడా గతంలో వెల్లడించారు. మరి వీటిలో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

News April 5, 2026

రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

image

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>

News April 5, 2026

TG EAPCETకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

image

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల (లేట్ ఫీజు లేకుండా) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 53.34% మంది అమ్మాయిలు, 46.66% మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్‌కు 2,03,167 అప్లికేషన్లు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు EAPCET <>వెబ్‌సైట్<<>> చూడండి.

News April 5, 2026

బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దంతాల ఆరోగ్యం కోసం రోజూ రెండు సార్లు బ్రష్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ వాడాలి. గట్టిగా ఉండేవి వాడితే దంతాలపై ఎనామెల్ పొరను అరిగిపోయేలా చేస్తాయి. కనీసం 2min నోటిలోని అన్ని వైపులా తోమాలి. నాలుకను క్లీన్ చేసుకోవాలి. తిన్న తర్వాత బ్రష్ చేయాలనుకుంటే వెంటనే చేయవద్దు. 30-60min తర్వాతే చేయాలి. 3 నెలలకోసారి బ్రష్‌ను మార్చాలి’ అని సూచిస్తున్నారు.