India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న కల్కి పార్ట్-2పై భారీ అంచనాలున్నాయి. FEB చివరి వారం నుంచి ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్న కమల్ హాసన్ పాత్ర పార్ట్-2లో 90 నిమిషాల పాటు ఉంటుందట. అలాగే 2 వెరైటీ లుక్స్లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. దీనికి తోడు ఈ మూవీలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

వరదల వంటి విపత్తుల టైంలో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా లోన్లు వసూలు చేయొద్దని RBI సూచించింది. కొత్త డ్రాఫ్ట్ ప్రకారం.. ‘బాధిత రైతులకు EMIల రీ-షెడ్యూలింగ్, మారటోరియం, డాక్యుమెంట్స్ లేకుండా టాపప్ లోన్ల వంటి సదుపాయాలు కల్పించాలి. ఎక్స్ట్రా ఛార్జీలు ఏడాది వరకు రద్దు చేయాలి. విపత్తుకు ముందు 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్ అయి ఉండొద్దు’ పేర్కొంది. వీటికి ఆమోదం లభిస్తే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

TG: వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి రికార్డు ధర పలికింది. క్వింటా మిర్చి రూ.41,200కు అమ్ముడుపోయింది. గత మూడేళ్లలో దేశీ మిర్చికి ఇదే రికార్డు ధర అని మార్కెట్ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల దేశీ మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.

లిబియా నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ(53)ని దుండగులు హత్య చేశారు. జింటాన్లోని ఇంటిపై నలుగురు సాయుధులు దాడి చేసి హతమార్చినట్లు ఆయన అడ్వైజర్ అబ్దుల్లా వెల్లడించారు. తన తండ్రి హయాంలో ఇస్లాం ఎలాంటి పదవి చేపట్టకపోయినా మితవాది, సంస్కర్త అనే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. 2011 తిరుగుబాటులో గడాఫీ హతమైన తర్వాత 2021లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి ఎక్కువైంది. ప్రధానంగా వరిలో మానిపండు తెగులు, పాముపొడ(మాగుడు) తెగులు, రెల్లరాల్చు పురుగు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

IPLలో అత్యంత విజయవంతమైన CSK ఫ్రాంచైజీ త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ CEO కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ఇది భవిష్యత్తు ప్రణాళికలో భాగమని, మహిళల క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లోనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత WPL 2026 సీజన్ ముగింపు దశకు వచ్చింది. రేపు వడోదరలో జరిగే ఫైనల్లో ఢిల్లీ టీమ్ RCBతో తలపడనుంది. ప్రస్తుతం WPLలో 5 జట్లు పాల్గొంటున్నాయి.

తల పైభాగంలో ఉండే ఈ చక్రం ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం. ఇది సమతుల్యంగా ఉంటే విశ్వంతో సంబంధం ఏర్పడి, అపారమైన జ్ఞానం, ఆనందం కలుగుతాయి. అస్థిరత ఏర్పడితే మానసిక ఒత్తిడి, జీవితంపై విరక్తి, ఒంటరితనం వేధిస్తాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి మౌన ధ్యానం శ్రేష్ఠమైనది. తల పైభాగంలో వెలుగు ఉన్నట్లు ఊహిస్తూ ధ్యానం చేయడం ఓంకారాన్ని పలకడం ద్వారా ఈ చక్రాన్ని సమతుల్యం చేయవచ్చు. ఇది మనిషిని దైవత్వానికి చేరువ చేస్తుంది.

కొన్నిచోట్ల వరి పంటలో మానిపండు తెగులు కనిపిస్తోంది. దీన్ని కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్& ఇండస్ట్రియల్ రీసెర్చ్(<

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతల భేటీ కొనసాగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.