India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాటికన్సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రంప్, మెక్రాన్, స్టార్మర్, జెలెన్స్కీ, ద్రౌపదీ ముర్ము సహా 164 మంది దేశాల ప్రతినిధులు, అధినేతలు పాల్గొననున్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 21న ఫ్రాన్సిస్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 2.50 లక్షల మంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు.
AP: తమిళనాడులో ప్రఖ్యాత కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఏపీ అన్నవరానికి చెందిన 27 ఏళ్ల పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న ఆయనకు సన్యాస దీక్షను ఇవ్వనున్నారు. ధన్వంతరి, మంగాదేవిల పెద్ద కుమారుడైన గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించారు. వేదాలు, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించారు. ఈయన కొన్ని రోజులు తెలంగాణ బాసరలోనూ సేవలందించారు.
ఏపీలోని పాకిస్థానీలందరూ వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రేపటి తర్వాత ఆ దేశస్థులు రాష్ట్రంలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు <<16214062>>తెలంగాణ డీజీపీ జితేందర్<<>> కూడా పాకిస్థానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ‘తమ సోదర దేశాలు ఇండియా, పాక్తో సంబంధాలను మేము ఎప్పుడూ ఆస్వాదిస్తాము. ఇలాంటి క్లిష్ట సమయంలో ఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య మంచి సంబంధాలు ఏర్పరచేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉంది’ అని ఇరాన్ విదేశాంగశాఖ ట్వీట్ చేసింది. దీనిపై ఇటు భారత్ కానీ, అటు పాక్ కానీ ఇంకా స్పందించలేదు.
కోలీవుడ్ నిర్వహించిన గోల్డెన్ క్వీన్ అవార్డుల్లో సమంత గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో తన అనుబంధాన్ని ఆమె తెలిపారు. ‘నేను ఆస్పత్రిపాలైనప్పుడు నా వెంటే ఉన్నాడు. రోజంతా అక్కడే ఉండి నా బాగోగులు చూసుకున్నాడు. అతడు నాకు ప్రత్యేకం. నా ఫ్రెండ్, బ్రదర్, ఫ్యామిలీ మెంబర్, బంధువా అని చెప్పలేకపోతున్నా. మా అనుబంధానికి పేరు పెట్టలేకపోతున్నా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీరీ పండిట్లతోపాటు అక్కడ పనిచేసే స్థానికేతరులు, రైల్వే ఆస్తులను టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అంచనా వేశాయి. పాక్ ISI ఆదేశాలతో దాడులు చేయొచ్చని గుర్తించాయి. ఈ మేరకు ఆయా వర్గాలను, భద్రతా సిబ్బందిని, RPFను అప్రమత్తం చేశాయి. దీంతో రైల్వే సిబ్బంది మార్కెట్లకు వెళ్లొద్దని, తమ బ్యారక్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఈ నెల 27న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 – 12 గంటల వరకు 6వ తరగతి, మధ్యాహ్నం 2 – 4గంటల వరకు 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని మోడల్ స్కూళ్ల డైరెక్టర్ శ్రీనివాసచారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 40,332 మంది దరఖాస్తు చేసుకున్నారని, హాల్ టికెట్లు ఇప్పటికే విడుదల అయ్యాయని ఆయన వివరించారు.
✒ 1762: కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్యామశాస్త్రి జననం
✒ 1920: భారతీయ గణితవేత్త శ్రీనివాస రామానుజన్ మరణం(ఫొటోలో)
✒ 1931: ప్రఖ్యాత వాస్తుశిల్పి గణపతి స్థపతి జననం
✒ 1942: ప్రముఖ కథా రచయిత కాకాని చక్రపాణి జననం
✒ 1973: నటుడు సముద్ర ఖని జననం
✒ 1986: చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం
✒ ఇవాళ ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
ఇటీవల సివిల్స్-2024 అభ్యర్థుల ర్యాంకులను విడుదల చేసిన UPSC తాజాగా వారు సాధించిన మార్కులను వెబ్సైట్లో ఉంచింది. సివిల్స్ మెయిన్స్కు 1,750, ఇంటర్వ్యూకు 275 మార్కులు(మొత్తం 2,025) ఉంటాయి. టాప్-5 ర్యాంకర్ల మార్కులు ఇలా.. 1. శక్తి దూబే- 1,043; 2. హర్షిత గోయల్- 1,038 3. డోంగ్రే అర్చిత్ పరాగ్- 1,038 4. షా మార్గి చిరాగ్- 1,035 5. ఆకాశ్ గార్గ్- 1,032
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.