India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాత్రి 7 గంటల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలు ఇవే.. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్, ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నాగర్కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి.
ఎవరైనా గుండెనొప్పితో కుప్పకూలినప్పుడు ఏం చేయాలో పాలుపోదు. అలాంటి సమయంలో వారిని రక్షించాలన్న టెన్షన్లో కొంతమంది పలు రకాల ప్రయత్నాలు చేస్తారు. అలాంటివేమీ చేయకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది. ‘బాధితుడిని ఊపడం, కదల్చడం వంటివి చేయకూడదు. ముఖంమీద కొట్టి లేదా మెడను కదిపి లేపేందుకు యత్నించొద్దు. సరైన సీపీఆర్ ఒకటే గుండె ఆగినవారికి అవసరం’ అని వివరించింది.
TG: హైదరాబాద్లో నివసించే శ్రీవారి భక్తులకు TTD శుభవార్త చెప్పింది. హిమాయత్నగర్, జూబ్లీహిల్స్లోని TTD ఆలయంలో ఇకపై ప్రతిరోజూ లడ్డూలు అందించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కో లడ్డూను రూ.50కే విక్రయించనున్నట్లు పేర్కొంది. దళారీలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD తెలిపింది. కాగా ఇప్పటివరకు హైదరాబాద్లో శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు.
మహిళలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు గర్వంగా ఉందని మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పేర్కొన్నారు. బజరంగ్ పునియాతో కలిసి ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. ‘మేం రోడ్లపైకి వచ్చినప్పుడు బీజేపీ తప్ప అన్ని పార్టీలు మాకు మద్దతుగా నిలిచాయి. మా కన్నీళ్లను, బాధను అర్థం చేసుకున్నాయి. బీజేపీ నేతలు మాత్రం మాపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేశారు. కాంగ్రెస్కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
హిట్ సినిమాల గురించి అందరికీ తెలుసు. వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఏంటో తెలుసా? అదే 1999లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘The 13th Warrior’. ₹1,300కోట్ల బడ్జెట్తో తీస్తే ₹511కోట్లే వచ్చాయి. జాన్ మెక్టైర్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాగ్దాదీ యాత్రికుడు అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ పాత్రలో ఆంటోనియో బాండెరాస్ నటించారు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మరెవరూ ముస్లింను హీరోగా చూపించే సాహసం చేయరని విమర్శకులు అన్నారు.
వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్లో చేరడం వాళ్ల వ్యక్తిగతమని రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నారు. తనకు కూడా రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయని, కానీ వాటిని తిరస్కరించినట్లు చెప్పారు. రెజ్లింగ్లో మహిళల కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రాబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫునా తాను ప్రచారం చేయనని సాక్షి తేల్చి చెప్పారు.
కాంగ్రెస్లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మరో రెజ్లర్ బజరంగ్ పునియా బాద్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. జులానా నియోజకవర్గం సంప్రదాయ మల్లయోధులకు పెట్టింది పేరు. బాద్లీ ఢిల్లీ-గురుగ్రామ్కు దగ్గరగా ఉండి అన్ని రంగాల్లో వృద్ధి చెందుతున్న కీలక పట్టణం.
ఏ కార్యమైనా మొదట పూజలందుకునేది గణనాథుడే. చవితి సందర్భంగా ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసే భక్తులకు పురోహితులు ఓ సూచన చేశారు. ఇంట్లో ప్రతిష్ఠించే గణపయ్య ప్రతిమ తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. దీనిని పూజిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండుతుందంట. కుడివైపు తొండం ఉన్న విగ్రహం వల్ల కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని చెబుతున్నారు. దీన్ని ‘సిద్ధి వినాయకుడు’ అంటారు.
బిహార్లో CM నితీశ్ కుమార్ మళ్లీ పక్కచూపులు చూస్తున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. విపక్ష RJD నేత తేజస్వీ యాదవ్తో నితీశ్ భేటీ వార్తలు ఈ ప్రచారానికి బలంచేకూర్చాయి. ఈ ఊహాగానాల మధ్య BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా 2 రోజులు బిహార్లో పర్యటిస్తుండడంతో రాజకీయాలు మరింత వేడెక్కించాయి. అయితే, నితీశ్-తేజస్వీల భేటీ కేవలం సమాచార కమిషనర్ నియామకంపైనే అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
TG: వైద్యారోగ్య శాఖలో 282 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలను అందించారు. అంతకుముందు కోఠి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ.121కోట్ల నిధులతో నిర్మించే హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 1,284 ల్యాబ్ టెక్నీషియన్లను నియమించడానికి నోటిఫికేషన్ వేశామని, ఏడాదిలో ఇంకో 1,300 మందిని రిక్రూట్ చేస్తామని దామోదర అన్నారు.
Sorry, no posts matched your criteria.