News October 30, 2025

చూడి పశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

మిగిలిన పశువుల కంటే చూడి పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. శుభ్రమైన మేత, తాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, ఎక్కువ దూరం నడిపించడం చేయకూడదు.

News October 30, 2025

పెరిగిన బంగారం ధరలు

image

కొంతకాలంగా రోజులో రెండుసార్లు బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ <<18146766>>ఉదయం<<>> 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,910 తగ్గగా ఇప్పుడు రూ.990 పెరిగి రూ.1,21,480కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ రేట్ ఉదయంతో పోల్చితే రూ.900 ఎగబాకి రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 30, 2025

రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.

News October 30, 2025

అది వారి ‘రేటు జాబితా’.. ప్రతిపక్షాల మ్యానిఫెస్టోపై మోదీ సెటైర్లు

image

బిహార్‌లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ‘జంగిల్ రాజ్ నాయకులు ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నారు. మ్యానిఫెస్టో పేరుతో ఆర్జేడీ, కాంగ్రెస్ తమ రేటు జాబితాను రివీల్ చేశాయి. వారి ప్రతి డిక్లరేషన్ వెనుక ప్రధాన ఉద్దేశం అవినీతి, దోపిడీ’ అని ఆరోపించారు. బిహార్‌ను RJD, కాంగ్రెస్ డెవలప్ చేయలేవని, గతంలో తమ పాలనలో ప్రజలను మోసం చేశాయని అన్నారు.

News October 30, 2025

ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

థైరాయిడ్ పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి ఉండదు. అలాగే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి వంటివి వస్తాయంటున్నారు నిపుణులు. పాలు, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

శరీరానికి ఎంత అయోడిన్ అవసరమంటే

image

శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అయోడిన్ ఉంటే సరిపోతుంది. రోజుకు కేవలం 150mg తీసుకుంటే చాలు. పిల్లలకు 50mg, గర్భిణులకు 200mg అయోడిన్ సరిపోతుంది. ఒక వ్యక్తి జీవితకాలంలో కేవలం అర టీస్పూన్ అయోడిన్ మాత్రమే అవసరమవుతుంది. మన శరీరంలో 25mg అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలాగని అతిగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

News October 30, 2025

KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్

image

IPL: KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. జట్టుకు గత 3 సీజన్లుగా హెడ్ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను ఈ ఏడాది JULYలో తొలగించిన విషయం తెలిసిందే. వారం క్రితమే కోచ్‌ పదవిపై నాయర్‌తో KKR సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పండిట్‌ శిక్షణలో జట్టు 2024లో విజేతగా నిలిచినప్పుడు నాయర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నారు. అటు ఈ ఏడాది మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో UP వారియర్స్‌ జట్టుకు చీఫ్‌ కోచ్‌గా పనిచేశారు.

News October 30, 2025

భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

image

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>

News October 30, 2025

నీలి రంగులోకి మారిపోయిన కుక్కలు.. కారణం అదేనా?

image

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్ ప్లాంట్‌ సమీపంలో కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇవి 1986 నాటి అణు ప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన శునకాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్లే ఇలా మారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని మూలాన్ని గుర్తించడానికి వాటి వెంట్రుకలు, రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.

News October 30, 2025

తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు

image

AP: ‘మొంథా’ తుఫాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. ముందస్తు చర్యలతో నీటిపారుదల శాఖకు తక్కువ నష్టమే వాటిల్లిందని తెలిపారు.