India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంగ్లండ్ వన్డే, టీ20 హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. వచ్చే ఏడాది జనవరిలో భారత్తో జరిగే సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయన ఆ జట్టు టెస్టు కోచ్గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. కాగా మెక్కల్లమ్ను అన్ని జట్లకు కోచ్గా నియమించడంతో ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ విధానానికి ఇంగ్లండ్ స్వస్తి పలికినట్లైంది.
TG: ఇటీవల సంభవించిన వరదలకు రాష్ట్రంలో 31 మంది మరణించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు వారి వివరాలతో కూడిన జాబితాను ఆయన Xలో పోస్ట్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైనట్లు కనిపిస్తోందన్నారు. చావుని అబద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవ్వరూ క్షమించరన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజైన ‘గబ్బర్ సింగ్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఒక్కరోజులోనే ఈ సినిమాకు రూ.7.2 కోట్లు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఓ రీరిలీజ్ మూవీ ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం ఇదే తొలిసారని చెబుతున్నాయి. ఇప్పటివరకూ సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన ‘మురారి’ సినిమా తొలిరోజు రూ.5.45 కోట్లు కలెక్ట్ చేయగా దీనిని బీట్ చేసిందని తెలిపాయి.
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో క్లీన్స్వీప్కు గురైన పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు WTC ఫైనల్కు చేరడం కష్టంగా మారింది. బంగ్లాపై పేలవ ప్రదర్శన కారణంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఎనిమిదో స్థానానికి దిగజారింది. జరగబోయే టెస్టుల్లో విజయం సాధించినా టాప్-2లోకి చేరడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ జట్టు WTC ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లేనని అంటున్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపులు ఇటీవల కలకలం రేపాయి. తాజాగా ఓ నటి హీరో నివిన్ పౌలి తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నివిన్తో పాటు మరో ఐదుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈ ‘ప్రేమమ్’ హీరో కొట్టిపారేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
AP: పలు జిల్లాలకు వైసీపీ అధిష్ఠానం అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతపురం-అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి-ఉషాశ్రీ చరణ్, తూర్పుగోదావరి-చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మార్గాని భరత్ రామ్ని నియమించింది.
AP: వరద బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 193 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో 42,707 మందికి షెల్టర్ కల్పించనుంది. అలాగే 194 మెడికల్ క్యాంపుల ద్వారా ఆరోగ్య సేవలు అందించనుంది. కాగా వరదల ధాటికి రాష్ట్రంలోని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. 2,851 కి.మీ ఆర్అండ్బీ, 221 కి.మీ పంచాయతీరాజ్, 308 కి.మీ మున్సిపల్ రోడ్లు ధ్వంసమయ్యాయి.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో పొత్తుకు సిద్ధపడిన కాంగ్రెస్ ఆ పార్టీకి 6 సీట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. పొత్తు విషయమై రాహుల్ గాంధీ సుముఖంగా ఉండడంతో ఈ విషయమై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా 90 అసెంబ్లీ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లు కోరగా, కాంగ్రెస్ 6 సీట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు దిగువ ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం డ్యామ్ నుంచి 50 వేల క్కూసెక్కులకు పైగా నీటిని కిందికి రిలీజ్ చేస్తామన్నారు. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.
AP: భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం కాగా, వరద బాధితులకు విరాళాలు ఇచ్చే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం సహాయనిధికి ఆన్లైన్లో విరాళాలు పంపవచ్చని పేర్కొంది. వెలగపూడి SBI బ్రాంచ్ 38588079208, యూనియన్ బ్యాంక్ 110310100029039 నంబర్లకు ఆన్లైన్లో సాయం చేయవచ్చని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.