News September 3, 2024

కళ్లను రక్షించే 20-20-20 ఆరోగ్య సూత్రం

image

సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రస్తుతం కంప్యూటర్లు, మొబైళ్లు చూడకుండా క్షణం గడవని పరిస్థితి. స్క్రీన్ టైమ్‌తో ఒత్తిడి పెరిగి కళ్లు అలసిపోతాయి. దీంతో తలనొప్పి, కంటిచూపు తగ్గడం, పొడిబారడం, ఎరుపెక్కడం, దురద వంటి సమస్యలు వేధిస్తాయి. అందుకే 20-20-20 సూత్రం అనురించాలని వైద్యులు చెబుతున్నారు. 20ని. స్క్రీన్ చూశాక ముఖం తిప్పుకొని 20 ఫీట్ల దూరం 20 సెకన్లు చూస్తే నేత్రాలపై ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.

News September 3, 2024

‘దేవర’ రిలీజ్ రోజే OTTలోకి ‘సరిపోదా శనివారం’?

image

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. అయితే, థియేటర్లలో అదరగొడుతోన్న ఈ సినిమా మరో నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న ‘దేవర’ విడుదల రోజే ఈనెల 27న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News September 3, 2024

ఈత రాదని చెప్పినా స్విమ్మింగ్ పూల్‌లో తోసి చంపేశారు

image

TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో పుట్టినరోజు వేడుకలు విషాదంతో ముగిశాయి. ఐటీ సంస్థలో మేనేజర్ శ్రీకాంత్ తన బర్త్ డే సందర్భంగా 20 ఉద్యోగులతో ఓ విల్లాలో పార్టీ ఏర్పాటు చేశాడు. మద్యం మత్తులో అజయ్ అనే ఉద్యోగిని సహచరులు స్విమ్మింగ్‌పూల్‌లో తోసేశారు. అతను ఈత రాదని అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో నీటమునిగి అతను ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 3, 2024

బోలా, శంకర్.. టెర్రరిస్టుల అసలు పేర్లు ఇవే

image

‘IC-814 కాందహార్ హైజాక్’ వెబ్ సిరీసులో నెట్‌ఫ్లిక్స్ వాడిన బోలా, శంకర్ పేర్లు కోడ్‌వర్డ్స్ అని సమాచారం. విమానంలోని ప్రయాణికులకు తెలియకుండా టెర్రరిస్టులు మారు పేర్లు వాడినట్టు తెలిసింది. చీఫ్‌గా సున్నీ అహ్మద్ ఖాజీ, డాక్టర్‌గా షకీర్, బర్గర్‌గా మిస్త్రీ జహూర్, బోలాగా షాహిద్ అక్తర్, శంకర్‌గా ఇబ్రహీం అథర్ మార్చి పెట్టుకున్నారు. అసలు పేర్లను నాటి హోంమంత్రి LK అద్వానీ 2000, జనవరి 6న ప్రకటించడం గమనార్హం.

News September 3, 2024

ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా?: సీఎం

image

AP: రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని CM చంద్రబాబు ఆరోపించారు. ‘వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు ఘటనను రైజ్ చేస్తారా? బుద్ధి, జ్ఞానం ఉందా? ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపైనా విచారణ చేస్తాం. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటాం. బాబాయిని చంపి నారాసుర రక్తచరిత్ర అని రాసినవారు ఉన్నప్పుడు అనుమానాలొస్తాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై అధికారులు జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పారు.

News September 3, 2024

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ-బీజాపుర్‌ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News September 3, 2024

విపక్ష నేత ఒక్కరినైనా పరామర్శించారా?: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘విపక్ష నేత నిన్న 5 నిమిషాలు షో చేసి వెళ్లారు. ఆయన ఒక్కరికైనా భోజనం సరఫరా చేశారా? ఒక్కరినన్నా పరామర్శించారా? సపోర్ట్ చేశారా? అందుకే ఆయన్ను ఎస్కోబార్ అంటున్నా’ అని మండిపడ్డారు.

News September 3, 2024

టెర్రరిస్టులకు శివుడి పేరు: MIBని కలిసిన నెట్‌ఫ్లిక్స్ హెడ్

image

ప్రజల సెంటిమెంటును అనుసరించి ఇకపై కంటెంటును జాగ్రత్తగా సమీక్షిస్తామని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. MIB అధికారులతో ఆ సంస్థ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ సమావేశం ముగిసింది. ‘<<14001258>>IC 814: కాందహార్ హైజాక్<<>>’ వెబ్ సిరీస్‌లో టెర్రరిస్టులకు శివుడి పేర్లు బోలా, శంకర్ అని వాడటంపై ఆమెకు మినిస్ట్రీ నోటీసులు ఇచ్చింది. భారత సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, తప్పుడు కోణంలో చూపొద్దని సీరియస్ అయింది.

News September 3, 2024

బాధితులు సంయమనం వహించాలి: సీఎం చంద్రబాబు

image

AP: విజయవాడలో ప్రతి ఏరియాకు ఆహారం, నీళ్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అర్ధగంట ఆలస్యమైందని ఆవేశపడితే అది నాలుగైదు గంటలు అయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల వ్యవస్థలు నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం 3 బాధిత కుటుంబాలను ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో ముందుకు రావాలని కోరారు.

News September 3, 2024

రూ.కోటి, ఆ పైన జీతంతో 22 మందికి ఉద్యోగాలు

image

2023-24లో ఐఐటీ బాంబేలో 1,475 మంది ఉద్యోగాలు సాధించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీరు సగటున రూ.23.50 లక్షల వార్షిక వేతన పొందుతున్నట్లు తెలిపింది. రూ.కోటి, ఆపైన వార్షిక వేతనంతో 22 మంది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొంది. బీటెక్‌లో 83.39 శాతం, ఎమ్‌టెక్‌లో 83.5, ఎమ్ఎస్ రీసెర్చ్‌లో 93.33 శాతం ప్లేస్‌మెంట్లు జరిగినట్లు ప్రకటించింది.