News September 3, 2024

PGECET షెడ్యూల్ వాయిదా

image

TG: PGECET వెబ్ ఆప్షన్ల నమోదు ఈ నెల 2 నుంచి 4వ తేదీకి వాయిదా పడింది. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఇంటర్నెట్ సెంటర్లు మూతపడ్డాయని అభ్యర్థులు ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈ నెల 4, 5 తేదీల్లో అవకాశం కల్పించనుంది. 6న ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 9న ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది.

News September 3, 2024

AP, TGకి ‘భారతీయ రైల్వే కవచం’

image

ప్రమాదాల నివారణ కోసం భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. AP, TG సహా 12 రాష్ట్రాల్లో 5000 KM మేర కవచ్ ఇన్‌స్టలేషన్ కోసం ఆగస్టులో టెండర్లు ఇచ్చినట్టు తెలిసింది. రూ.2700 కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియ అక్టోబర్లో ముగుస్తుంది. ఇన్‌స్టలేషన్‌కు 12-18 నెలలు పట్టనుంది. ట్రాక్ మీద కవచ్ అమర్చేందుకు KMకు రూ.50 లక్షలు, ఒక్కో లోకోమోటివ్‌కు రూ.70 లక్షలు ఖర్చవుతుంది. 2022 DEC తర్వాత టెండర్లు ఇవ్వడం ఇదే తొలిసారి.

News September 3, 2024

వరద బాధితుల ఆకలి తీర్చేందుకు..

image

AP: విజయవాడ వరద బాధితుల కడుపు నింపేందుకు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఏకమవుతున్నారు. హోటల్ యజమానులు నిన్న ఉదయం లక్ష మందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి లక్ష చొప్పున ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. బస్సులు, వివిధ వాహనాల్లో వాటిని తరలిస్తున్నారు. మరోవైపు తూర్పుగోదావరి, ఒంగోలు నుంచి పలావ్, పులిహోర, పాలు, తాగునీరు, రొట్టెలు, బిస్కెట్ ప్యాకెట్లు విజయవాడకు పంపారు.

News September 3, 2024

పండగలొస్తున్నాయ్.. భారీ డిస్కౌంట్లే తెస్తున్నాయ్!

image

వినాయకచవితితో మొదలయ్యే పండగల సీజన్ క్రిస్మస్‌తో ముగుస్తుంది. అటు వ్యాపారులు ఇటు కస్టమర్లు ఎంతగానో ఎదురుచూసే సమయమిదే. దుస్తుల నుంచి అప్లయన్సెస్ వరకు కొనుగోళ్లు, అమ్మకాలకు ఇదే మంచి తరుణం. కంపెనీలు తమ వ్యాపార లక్ష్యాల్లో 20-30% సాధించేది ఇప్పుడే. అందుకే దీన్ని సద్వినియోగం చేసుకొనేందుకు భారీ రాయితీలు ఇవ్వడానికి అవి సిద్ధమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కార్లు, బైకులపై డిస్కౌంట్లు మొదలైపోయాయి.

News September 3, 2024

విజయవాడ వరదలు: రూ.కోటి విరాళం

image

AP: విజయవాడలో వరద సహాయక చర్యల కోసం ఎన్నారై, పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. నిన్న సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితుల సమస్యలు తననెంతో కలచివేస్తున్నాయని చెప్పారు. మరోవైపు విజయవాడకు చెందిన అక్కాచెల్లెళ్లు విజయలక్ష్మి, నిర్మలాదేవి, రాణి రూ.50వేల చొప్పున రూ.1.50 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. వరదలతో బెజవాడ తీవ్రంగా నష్టపోయిందన్నారు.

News September 3, 2024

నిర్లక్ష్యమే విజయవాడను ముంచేసిందా?

image

AP: ఎన్నడూ లేనంత వర్షాలు విజయవాడను కుదిపేయగా, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం నిండా ముంచేసిందనే విమర్శలు వస్తున్నాయి. కృష్ణా, బుడమేరు వరదపై అంచనా లేకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. హెచ్చరికలు జారీ చేసి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదని నగరవాసులు చెబుతున్నారు. వరద ముంచెత్తిన తర్వాత చర్యలు చేపట్టినా అందరికీ సాయం అందలేదంటున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం కనిపించిందని పేర్కొంటున్నారు.

News September 3, 2024

‘ఉచిత ఇసుక’పై ప్రభుత్వం GOOD NEWS

image

AP:ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌పై అవగాహన లేనివాళ్లు గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకోవచ్చు. ఏ రీచ్, ఏ స్టాక్ నుంచి ఎప్పుడు ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్ కేటాయిస్తారు. వాగులు, వంకలు, నదుల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లలో ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని థర్డ్ పార్టీతో అధికారులు పరిశీలిస్తారు.

News September 3, 2024

వినాయక చవితి పూజలో వాడే 21 పత్రాలు

image

1.మాచీ పత్రం 2.బృహతీ పత్రం 3. బిల్వ పత్రం 4.దూర్వాయుగ్మం 5.దత్తూర పత్రం 6.బదరీపత్రం 7.అపామార్గ పత్రం 8.తులసీ పత్రం 9.చూత పత్రం 10.కరవీర పత్రం 11.విష్ణుక్రాంత పత్రం 12.దాడిమీ పత్రం 13.దేవదారు పత్రం 14.మరువక పత్రం 15.సింధువార పత్రం 16.జాజి పత్రం 17.గండకీ పత్రం 18.శమీ పత్రం 19.అశ్వత్థ పత్రం 20.అర్జున పత్రం 21.అర్క పత్రం.
> ఈ నెల 7వ తేదీన వినాయక చవితి పర్వదినం. ఈ సమాచారం SHARE చేయండి.

News September 3, 2024

హైకోర్టు ప్రాంగణంలోనూ కల్తీ ఆహారం

image

కల్తీ ఆహారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఏకంగా హైకోర్టు ప్రాంగణంలోనే ఫుడ్ లైసెన్సులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సంగతి రాజస్థాన్‌లో బయటపడింది. కుళ్లిన ఆలు, ఉల్లి, ఇతర ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, ఫ్రిజ్‌లో ఫంగస్, పాడైపోయిన గిన్నెలు, స్టౌవ్‌లు, గడువు ముగిసిన ఉత్పత్తులను అధికారులు గుర్తించారు. లైసైన్స్ పొందేవరకు ఆహారం అమ్మకుండా క్యాంటీన్ ఓనర్లపై చర్యలు తీసుకున్నారు.

News September 3, 2024

పొంచి ఉన్న మరో తీవ్ర ప్రమాదం.. జాగ్రత్త

image

AP, TGలో భారీ వర్షాలు, వరదలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు సొంతిళ్లకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. వరదలు తెచ్చిన బురద, చెత్తాచెదారంతో దోమలు విజృంభించనున్నాయి. వీటి వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు పెరగనున్నాయి. వీటిని అరికట్టడంపై ప్రభుత్వ విభాగాలు దృష్టిసారించాల్సి ఉంది. లేదంటే ఆరోగ్య విపత్తు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.