India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. అవసరమైన వారందరికీ టెస్టులు చేసి, మందులు అందజేయాలన్నారు. వరదల తర్వాత జ్వరాలు, డయేరియా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫీవర్ సర్వే పకడ్బందీగా చేయాలని, బాధితుల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాలని సూచించారు.
TG: రెసిడెన్సీ హోటళ్లలో 3 నెలల సీసీటీవీ ఫుటేజీల బ్యాకప్ను తప్పనిసరిగా భద్రపరచాలని రాష్ట్ర మహిళా భద్రత విభాగం సూచించింది. ఓయో, ట్రీబూ, ఫ్యాబ్ తదితర హోటళ్ల అగ్రిగేటర్లతో డీజీపీ శిఖాగోయల్ నిన్న చర్చలు జరిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలో కస్టమర్లకు తెలిసేలా స్టిక్కర్లు, పోస్టర్లు అతికించాలని సూచించారు. రూమ్ బుకింగ్ టైమ్లోనే ఈ వివరాలన్నీ వారికి మెసేజ్ వెళ్లేలా చేయాలని పేర్కొన్నారు.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం రూ.14,000 కోట్లతో 7 పథకాల అమలుకు కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన భేటీలో రూ.2,817కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, రూ.3,979కోట్లతో క్రాప్ సైన్స్ ప్రోగ్రామ్, ముంబై-ఇండోర్ మధ్య 309కి.మీ రైల్వే లైన్, గుజరాత్లో సెమీ కండక్టర్ల ప్లాంటు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా తమిళ డైరెక్టర్ అట్లీ ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నాయని, హీరోలిద్దరూ ఇందులో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపాయి. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
TG: హైడ్రా కమిషన్ రంగనాథ్ను HMDA పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్గా నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ORR వరకు ఉన్న జలవనరుల FTL, బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువులను పరిరక్షించే బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
AP: వరద బాధితులందరికీ సాయం అందే వరకూ విజయవాడ కలెక్టర్ ఆఫీసునే సీఎం కార్యాలయంగా చేసుకుని పని చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. మంగళవారం మరో 6 హెలికాప్టర్లు పని చేస్తాయని, బాధితులకు ఆహారం, నీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారి పరిస్థితి అర్థం చేసుకుని, వారితో సహనంతో వ్యవహరించాలని అధికారులు, సహాయక బృందాలకు సూచించారు.
ఉదయం నిద్ర నుంచి లేచాక ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే శరీర జీవక్రియ రేటు సాధారణం కంటే 30% పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికలు ఆరోగ్యంగా మారతాయని, అలాగే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 4 లీటర్ల నీరు తాగాలని సూచిస్తున్నారు.
సినిమాల రిలీజ్ డేట్కు ముందు రోజే వేసే పెయిడ్ ప్రీమియర్లతో లాభాల కంటే నష్టాలొచ్చే అవకాశాలే ఎక్కువని నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘ప్రీమియర్లు వేయడం అనేది ప్రమోషనల్ స్ట్రాటజీ. పాజిటివ్ టాక్ వస్తే మంచిదే. కానీ నెగటివ్ టాక్ వస్తే తర్వాతి రోజు థియేటర్లకు ఎవరూ రారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలకు ప్రీమియర్ షోలు హెల్ప్ అవుతాయి’ అని ఓ మూవీ ప్రెస్మీట్లో తెలిపారు.
TG: సీఎం <<14005171>>రేవంత్<<>> నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. ‘సీఎం స్థాయిని దిగజార్చి, విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరం. తాను చీప్ మినిస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఆలస్యంగా మొద్దు నిద్ర లేచి ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి గిల్, సర్ఫరాజ్ను ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నారు. సీనియర్లు పుజారా, రహానె స్థానంలో వీరిద్దరూ ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో వీరు రాణించారని గుర్తుచేశారు. సీనియర్ల ప్లేస్ను భర్తీ చేయడం కష్టమని, కానీ యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇస్తే వారు ఫ్యూచర్లో మెరుగ్గా ఆడగలుగుతారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.