India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: నిర్మల్ జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసు భవనాల స్వాధీనానికి స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. SRSP, గడ్డెన్న వాగు పరిహారం చెల్లింపులో జాప్యం జరగడంతో ఈ భవనాలు స్వాధీనం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసుల్లో కోర్టు సిబ్బంది నోటీసులు అందించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచులో టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీనితో విరాట్ ఖాతాలో అన్ని ఫార్మాట్లలో కలిపి 82 సెంచరీలు చేరాయి. కోహ్లీ సెంచరీలు చేసిన 82 సార్లు నాన్ స్ట్రైకర్గా ఎవరో ఉన్నారనే లిస్టును ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. తొలి సెంచరీ చేసినప్పుడు గౌతమ్ గంభీర్ తనకు నాన్ స్ట్రైకర్గా ఉండగా 82వ టన్కు అక్షర్ పటేల్ ఉన్నారు.

టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు. ఆయన దుబాయ్లో చనిపోయినట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం..గం.. గణేశా’ సినిమాకు కేదార్ నిర్మాతగా పనిచేశారు. బన్నీ వాసు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు ఈయన సన్నిహితుడు.

1. గూగుల్ – 9.6 బిలియన్
2. యూట్యూబ్ – 5.1B
3. ఇన్స్టాగ్రామ్ – 919మిలియన్లు
4. ఫేస్బుక్ – 681M
5. వాట్సాప్ – 511M
6. chatgpt – 452M
7. అమెజాన్ – 388M
8. Bing – 294M
9. వికీపీడియా – 279M

AP: వీసీలను బెదిరించి రాజీనామా చేయించారని మండలిలో YCP నేతలు ఆరోపించారు. ఆధారాలుంటే చూపాలని మంత్రి లోకేశ్ సవాల్ విసరగా YCP స్పందించింది. ఛైర్మన్ మౌఖికంగా ఆదేశించడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు సింహపురి వర్సిటీ VC సుందరవల్లి రాసిన లేఖను Xలో పోస్టు చేసింది. ‘ఇదిగో ఆధారాలు బయటపెట్టాం. నిజాయితీ ఉంటే VCల రిజైన్పై న్యాయబద్ధ విచారణ చేయించాలి. లేదంటే లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది.

తమ మాతృ భాష ‘కోయ’పై ఉన్న ప్రేమను ఓ జంట వినూత్నంగా చాటింది. పెళ్లి శుభలేఖను కోయ భాషలో ముద్రించిన ఫొటో వైరలవుతోంది. పెళ్లి పిలుపును జోడ, వరుడిని పేకల్, వధువును కోకాడ్, భోజనాన్ని పెళ్లి బంతి అని అందులో పేర్కొన్నారు. అలాగే ప్రాంతాల, వ్యక్తుల పేర్లు మినహా పత్రిక అంతా కోయ భాషలోనే ఉండటం విశేషం.

215 టెక్నికల్, ట్రేడ్స్మెన్ ఉద్యోగాల భర్తీకి అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. MAR 22 వరకు అప్లై చేసుకోవచ్చు. APR 4వ వారంలో ర్యాలీ ఉంటుంది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు పోస్టులను బట్టి వేర్వేరు అర్హతలుండగా, పోస్టుల వారీగా 18-30 ఏళ్లలోపు వారు అర్హులు. PST, PET, రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్టుల తర్వాత ఎంపిక ఉంటుంది. ఫీజు OC, OBC, EWSలకు ₹100. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పాయింట్స్ టేబుల్లో SA తొలి స్థానంలో, AUS రెండో స్థానంలో ఉన్నాయి. ఒకవేళ AFGపై AUS, ENGపై SA గెలిస్తే ENG, AFG ఎలిమినేట్ అవుతాయి. AUS, SA సెమీస్ చేరతాయి.

బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరేందుకు తహతహలాడుతున్నాయి. నేడు మోస్తరుగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.88,090 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 ఎగిసి రూ.80,750 వద్ద ఉంది. వెండి ధరల్లో మార్పులేదు. కిలో రూ.1,08,000 వద్ద ట్రేడవుతోంది. ట్రేడ్వార్స్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3000 టచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

TG: సీఎం రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై విజ్ఞప్తులు చేసే అవకాశముంది. పీఎంతో భేటీ అనంతరం ఆయన కుంభమేళాకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం గతంలోనే సీఎం రేవంత్ను ఆహ్వానించింది.
Sorry, no posts matched your criteria.