India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☛ తిథి: బహుళ ద్వాదశి, ఉ.10.32 వరకు
☛ నక్షత్రం: ఉత్తరాషాడ, సా.5.07 వరకు
☛ శుభ సమయం: సా.7.07-7.31 వరకు
☛ రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
☛ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, రా.10.48-11.36 వరకు
☛ వర్జ్యం: రా.9.01 నుంచి 10.35 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.10.37-12.13 వరకు, రా.8.22-9.54 వరకు

ఫజర్: తెల్లవారుజామున 5.25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
ఇష: రాత్రి 7.34 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

* వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు: చంద్రబాబు
* ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మార్పు రాలేదు: రేవంత్
* 2028లో మేమే అధికారంలోకి వస్తాం: జగన్
* AP: ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా
* AP మిర్చికి కేంద్రం మద్దతు ధర
* 3రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ
* లక్ష ఉద్యోగాల భర్తీకి సిద్ధం: TPCC చీఫ్
* ఆపరేషన్ SLBC: రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్
* బంగ్లాపై NZ విజయం.. సెమీస్కు భారత్, పాక్ ఔట్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో జరిగిన తొలి సూపర్ ఓవర్ మ్యాచ్లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 9 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీని ఆ జట్టు 4 పరుగులకే కట్టడి చేసింది. యూపీ బౌలర్ సోఫీ ఎకిల్స్టన్ సూపర్ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటింగ్లోనూ అదరగొట్టిన సోఫీ 19 బంతుల్లో 33 రన్స్ చేసి మ్యాచ్ను సూపర్ ఓవర్కు తీసుకొచ్చారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో సంచలనం నమోదైంది. బెంగళూరు, యూపీ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. తొలుత RCB 180 రన్స్ చేసింది. ఛేదనలో యూపీ కూడా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ జరగనుంది.

ఏ వయసు వారైనా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయని, ఆయాసం నుంచి ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుందని పేర్కొంటున్నారు. శారీరక నొప్పులు రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కుడి వైపు, వెల్లకిలా పడుకోవాలని సూచిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవర్లలోనే ఛేదించింది. రచిన్ రవీంద్ర (112) సెంచరీతో విజృంభించారు. 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం చేశారు. ఒక దశలో 72/3తో కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర ఆదుకున్నారు. కాగా ఈ ఫలితంతో పాక్, బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమించగా, భారత్, కివీస్ సెమీస్కు దూసుకెళ్లాయి.

భారతీయులను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 40 మంది ట్రావెల్ ఏజెంట్ల లైసెన్సులను పంజాబ్ సర్కార్ రద్దు చేసింది. 271 మంది ఏజెంట్లకు నోటీసులు జారీ చేసింది. అన్ని ట్రావెల్ కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు నిర్వహించింది. ప్రయాణికుల రికార్డులు కచ్చితంగా ఉండాలని హెచ్చరించింది. కాగా కొందరు ఏజెంట్లు పలువురు భారతీయులను డంకీ రూట్ ద్వారా US చేర్చారు. ఇటీవల వారిని అమెరికా బంధించి తిరిగి ఇండియాకు పంపింది.

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున భారీగా ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు ఖాళీలకుగానూ టీడీపీ నుంచి కేఎస్ జవహర్, వంగవీటి రాధా, ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 3న నోటిఫికేషన్ రానుండగా 20న ఎన్నికలు జరగనున్నాయి.

AP: భవిష్యత్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఉంచాలి. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.