India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో ఒకరి పాత్రకు భార్యగా మరాఠీ బ్యూటీ శృతి మరాఠే నటించారు. 37 ఏళ్ల శృతి తొలుత మోడల్గా తన జర్నీని ప్రారంభించారు. 2008లో సినిమాల్లోకి వచ్చి, తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చారు. మరాఠీలో రామ మాధవ్, తప్తాపడి, బంద్ నైలోంచేతో పాటు తమిళంలో అరవన్, నాంగ రొంబ మూవీలు చేశారు. 2016లో ఈమె మరాఠీ నటుడు గౌరవ్ ఘటనేకర్ను పెళ్లి చేసుకున్నారు.
హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లా మృతితో అతని వారసుడిగా హషేమ్ సఫీద్దీన్ నియమితులయ్యే అవకాశం ఉందని స్థానిక మీడియా చెబుతోంది. నస్రుల్లా బంధువైన సఫీద్దీన్ ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలను, సైనిక చర్యలను పర్యవేక్షించే జిహాద్ కౌన్సిల్లో చురుగ్గా ఉన్నాడు. 2017లో US ఇతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. హెజ్బొల్లా కీలక నేతల మృతిపై ప్రతీకారం తప్పదని గతంలోనే సఫీద్దీన్ హెచ్చరించాడు.
1908లో ఇదే రోజు (సెప్టెంబర్ 28) మూసీ నదికి వరదలు వచ్చి హైదరాబాద్లో 15,000 మంది మరణించారు. కొన్ని గంటల్లోనే 48 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో మూసీ ఉప్పొంగింది. వందల చెరువుల కట్టలు తెగి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు నగరంలో ప్రవహించింది. అయితే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని చింత చెట్టును ఎక్కి 150 మంది ప్రాణాలను కాపాడుకున్నారు. 2 రోజులు దానిపైనే ఉండిపోయారు. ఇప్పటికీ ఆ చెట్టు బతికే ఉంది.
AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని వారు సీఎంకు తెలిపారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
TG: ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒకే కార్డులో రేషన్, హెల్త్, ఇతర పథకాల వివరాలన్నీ ఉంటాయని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హులను గుర్తిస్తామని చెప్పారు.
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు డ్రాగా ముగిస్తే భారత్ WTC ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. డ్రాగా ముగిస్తే టీమ్ ఇండియా పట్టికలో కొన్ని పాయింట్లు కోల్పోతుంది. మిగిలిన 8 టెస్టుల్లో ఐదింట్లో గెలవాల్సి ఉంటుంది. త్వరలో ఆసీస్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఒకవేళ అక్కడ సిరీస్ కోల్పోతే మూడో స్థానానికి దిగజారే ప్రమాదం ఉంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు చేజారిపోతాయి.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతున్న వేళ కార్మికులకు భారీ షాక్ తగిలింది. ఏకంగా 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్లు సమాచారం. వారి గేట్పాస్లను వెనక్కి తీసుకోవాలని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కార్మికులు ఆందోళనకు దిగారు. తొలగింపు ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై బెంగళూరు సిటీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు <<14214492>>ఆదేశానుసారం<<>> పోలీసులు చర్యలు ప్రారంభించారు. ED అధికారులు, కర్ణాటక BJP ప్రస్తుత, మాజీ అధ్యక్షులు విజయేంద్ర, నలీన్ కుమార్ తదితరులపై కూడా కేసు నమోదు చేశారు.
భూగోళం మినీ మూన్ని అనుభూతి చెందనుంది. ఆస్టరాయిడ్ 2024 PT5 Sep 29 నుంచి Nov 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల కక్ష్య నుంచి వీడిపోతుంది. ఇది నేరుగా కంటికి కనిపించకపోయినా టెలిస్కోప్తో చూడవచ్చు. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన ఈ గ్రహశకలం 33 అడుగులు ఉంటుంది. వీటి రాక సహజమేనని, ఇలాంటివి అనేకం భూకక్ష్యలోకి వచ్చిపోతుంటాయన్నది నిపుణుల అభిప్రాయం.
భారతదేశ U17 ఫుట్బాల్ జట్టు ‘SAFF U17 ఛాంపియన్షిప్స్ 2024’ ఫైనల్స్కు చేరుకుంది. సెమీ ఫైనల్స్లో నేపాల్ను 4-2 తేడాతో ఓడించి సత్తా చాటింది. జట్టు తరఫున విశాల్ యాదవ్ రెండు గోల్స్ చేయగా, రిషి సింగ్ & హేమ్నీచుంగ్ లుంకిమ్ ఒక్కో గోల్ సాధించారు. ఈరోజు జరిగే రెండో సెమీస్లో బంగ్లాదేశ్తో పాకిస్థాన్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టుతో సోమవారం జరిగే ఫైనల్స్లో ఇండియా తలపడనుంది.
Sorry, no posts matched your criteria.