News February 24, 2025

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది: గవర్నర్

image

AP: ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. ‘ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాలతో మేలు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. మెగా DSC దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం’ అని గవర్నర్ చెప్పారు.

News February 24, 2025

టన్నెల్ ఘటన.. ‘నీరో చక్రవర్తి’లా రేవంత్ వ్యవహారం: కేటీఆర్

image

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది ఆచూకీ తెలియని స్థితిలో MLC ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నిమగ్నమవ్వడం దిగజారుడు రాజకీయమేనని కేటీఆర్ విమర్శించారు. ఈ ఘటనపై సీఎంకే సీరియస్‌నెస్ లేకపోతే అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని నిలదీశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.

News February 24, 2025

గంటల్లో కొడుకు పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

image

TG: కొన్ని గంటల్లో కొడుకు పెళ్లి చూసి మురిసిపోవాల్సిన తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. RTC రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్‌కు సిరిసిల్ల(D)యువతితో ఆదివారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే తె.జా 3గంటలకు ఆయన హార్ట్ అటాక్‌తో కుప్పకూలాడు. ఇటీవల కామారెడ్డిలో <<15537771>>పెళ్లి మండపంలోనే<<>> వధువు తండ్రి గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.

News February 24, 2025

క్షమాపణలు చెప్పిన ఐఐటీ బాబా

image

ఇండియాపై పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ ఫొటోలను Xలో షేర్ చేశారు. ఇది పార్టీ టైమ్ అని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. కాగా మహాకుంభమేళాలో ఈ బాబా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

News February 24, 2025

మా కుటుంబ గొడవలకు ముగింపు రావాలి: మంచు విష్ణు

image

తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని హీరో మంచు విష్ణు చెప్పారు. అలాంటి వాతావరణంలో పిల్లలు పెరగాలనేది తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన ఫ్యామిలీలో గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే ఎన్ని జన్మలైనా తండ్రిగా మోహన్‌బాబే ఉండాలని కోరుకుంటానని పేర్కొన్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో వివాదాలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

News February 24, 2025

తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(రూ.300)ను టీటీడీ విడుదల చేసింది. అలాగే, మధ్యాహ్నం 3 నుంచి తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను అధికారిక సైట్‌లోనే బుక్ చేసుకోవాలని <>టీటీడీ<<>> తెలిపింది. ఫేక్ వెబ్ సైట్లు, దళారుల వద్ద మోసపోవద్దని సూచించింది.

News February 24, 2025

అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్

image

AP: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరయ్యారు. కాసేపట్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చాలా రోజుల తర్వాత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది.

News February 24, 2025

కోహ్లీ రికార్డుకు ముడిపెడుతూ కేసీఆర్‌పై మంత్రి సెటైర్లు

image

TG: భారత క్రికెటర్ కోహ్లీ రికార్డుకు, BRS చీఫ్ కేసీఆర్‌కు ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర ట్వీట్ చేశారు. 14వేల పరుగులతో కోహ్లీ రికార్డు బద్దలు కొడితే.. ప్రతిపక్ష నేతగా 14 నెలల్లో 14 రోజులు కూడా సభకు రాకుండా KCR రికార్డు నెలకొల్పారని సెటైర్లు వేశారు. పరుగులతో విరాట్ వార్తల్లో నిలిస్తే 14 నెలలుగా విరాట పర్వం వీడని గులాబీ బాస్ వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా అని ప్రశ్నించారు.

News February 24, 2025

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 74,768 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 156 పాయింట్లు తగ్గి 22,639 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీలు HCL, టెక్ మహీంద్రా, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతుండగా, రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, సుజుకీ, బజాజ్ ఫిన్ లాభాల్లో దూసుకుపోతున్నాయి.

News February 24, 2025

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 78,892 మంది దర్శించుకోగా 25,930 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే, నేడు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను టీటీడీ రిలీజ్ చేయనుంది.