News February 24, 2025

అసెంబ్లీ సమావేశాలు.. ఆంక్షల విధింపు

image

AP: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ఆవరణలో నినాదాలు చేయడం, ప్లకార్డుల ప్రదర్శన, కరపత్రాల పంపిణీకి అనుమతి లేదని స్పీకర్ స్పష్టం చేశారు. పరిసరాల్లో సమావేశాలు, ధర్నాలను పూర్తిగా నిషేధించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ఇతరులకు ప్రవేశం లేదు, సభ్యుల పీఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాస్‌లు రద్దు చేశారు.

News February 24, 2025

నేడు KRMB ప్రత్యేక భేటీ

image

ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు(KRMB) ప్రత్యేక సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలుగు రాష్ట్రాల నీటి వాటాలు, ఇతర అంశాలపై అధికారులు KRMB ఛైర్మన్ అతుల్ జైన్‌తో చర్చించనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ అక్రమంగా జలాలను తరలిస్తోందని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. ఈ నెల 21నే సమావేశం జరగాల్సి ఉండగా ఏపీ విజ్ఞప్తితో నేటికి వాయిదా పడింది.

News February 24, 2025

పరీక్ష లేకుండానే ఉద్యోగాలు

image

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. బీపీఎం శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, డాక్ సేవక్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3.
వెబ్ సైట్: indiapostgdsonline.gov.in

News February 24, 2025

కివీస్ గెలిస్తే పాకిస్థాన్ ఔట్!

image

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఎలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. కివీస్ ఇప్పటికే ఒక మ్యాచ్ గెలవగా, బంగ్లా ఒకటి ఓడిపోయింది. న్యూజిలాండ్ ఈ గేమ్ గెలిస్తే సెమీస్ బెర్తులు తేలిపోనున్నాయి. ఆ జట్టుతో పాటు ఇండియా చెరో 4 పాయింట్లతో సెమీస్ చేరుకుంటాయి. పాకిస్థాన్, బంగ్లా ఇంటిదారి పడతాయి. కివీస్ ఓడితే ఆ రెండు జట్లు సెమీస్ రేసులో నిలుస్తాయి.

News February 24, 2025

ఆ మందులపై నిషేధం విధించిన డీసీజీఐ

image

పెయిన్ కిల్లర్లుగా ఉపయోగించే టపెంటడాల్, కారిసొప్రాడల్ మందుల మిశ్రమ ఉత్పత్తి, ఎగుమతులను నిషేధిస్తూ డీసీజీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైకి చెందిన ఓ సంస్థ ఆమోదం లేని మందుల్ని తయారు చేసి పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేస్తోందనే కథనాల ఆధారంగా తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కాంబినేషన్లో ఉత్పత్తి చేసేందుకు ఇచ్చిన లైసెన్స్‌లు, NOCని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

News February 24, 2025

రేపు పులివెందులకు YS జగన్

image

AP: మాజీ సీఎం, YCP అధినేత వైఎస్ జగన్ రేపు పులివెందుల వెళ్లనున్నారు. బుధవారం అక్కడ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. గురువారం పులివెందులలో జరిగే LV ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్లే అవకాశం ఉందని YCP వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని YCP నిర్ణయం తీసుకోగా, జగన్ వెళ్లే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

News February 24, 2025

చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో చెలరేగి POTM పొందిన విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ICC ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక(5) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఛేజ్ మాస్టర్ 2012 T20WC, 2015 ODI WC, 2016 T20WC, 2022 T20WC, 2025 CTలో దాయాదిపై POTM పొందారు. మరే ఇతర ప్లేయర్ ప్రత్యర్థి జట్టుపై 3 కంటే ఎక్కువ అవార్డులు సాధించకపోవడం గమనార్హం.

News February 24, 2025

పాపం ఆ 8 మంది.. ఎలా ఉన్నారో?

image

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎలా ఉన్నారో? అని సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారు అందులో చిక్కుకొని సుమారు 48 గంటలవుతోంది. ప్రమాదం జరిగిన 14వ కి.మీ వద్ద భీతావహ పరిస్థితిని చూసి రెస్క్యూ సిబ్బంది ఒకింత భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కానీ ఆశలు వదులుకోకుండా శిథిలాల తొలగింపు చేపట్టారు. అయితే వాటిని తొలగిస్తే పైకప్పు మళ్లీ కూలొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News February 24, 2025

RC16 షూటింగ్ ఢిల్లీకి షిఫ్ట్?

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీ షెడ్యూల్ HYDలో పూర్తయినట్లు తెలుస్తోంది. చెర్రీ-దివ్యేందులపై క్రికెట్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు సమాచారం. మార్చి ఫస్ట్ వీక్‌లో ఢిల్లీలో కుస్తీ నేపథ్య సీన్లను చిత్రీకరిస్తారని, కీలక నటీనటులంతా పాల్గొంటారని టాక్. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా MAR 27న చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.

News February 24, 2025

నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల

image

ప్రధాని మోదీ నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన 19వ విడత కింద దేశంలోని రైతులకు రూ.22వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో రూ.2వేలు చొప్పున 3 విడతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18 విడతల్లో రూ.3.46లక్షల కోట్లు చెల్లించారు.