India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కేంద్రం ప్రారంభించిన <<12768799>>పీఎం సూర్యఘర్<<>> పథకాన్ని ఏపీలో అమలుకు పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిస్కంలను ఆదేశించింది. 3 కి.వా ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు రూ.1.45లక్షల ఖర్చయితే అందులో కేంద్రం <<12768833>>రూ.78వేలు<<>> సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని రుణంగా సమకూరుస్తుంది.

AP: తీవ్ర ఆందోళనలు, సంచలన నిర్ణయాలు, నాటకీయ పరిణామాల మధ్య నేడు గ్రూప్-2 మెయిన్స్ యథావిధిగా జరగనుంది. పరీక్ష వాయిదా వేశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని APPSC మరోసారి తేల్చి చెప్పింది. 175 కేంద్రాల్లో 92,250 మంది మెయిన్స్ రాయనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పేపర్-1, మ.3 గంటల నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. అభ్యర్థులు ఉ.9.30 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలి.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్పై విజయం సాధించి ఆస్ట్రేలియా రికార్డ్ సృష్టించింది. ఐసీసీ వన్డే టోర్నీల్లో హయ్యెస్ట్ రన్ ఛేజ్ చేసిన టీమ్గా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్లో AUS 352 టార్గెట్ను ఛేదించింది. గతంలో ఈ రికార్డ్ పాకిస్థాన్ పేరిట ఉండేది. 2023 WCలో శ్రీలంక నిర్దేశించిన 345 లక్ష్యాన్ని పాక్ ఛేజ్ చేసింది. ఇక CTలో హయ్యెస్ట్ రన్ ఛేజ్ జట్టుగా శ్రీలంక(322) ఉండగా తాజాగా ఆసీస్ దాన్ని అధిగమించింది.

తన ప్రాణ స్నేహితుడు మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ హీరో సుహాస్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అసలేమైందో నాకు కరెక్ట్గా తెలియదు. కానీ వాడు చాలా సంతోషంగా ఉండేవాడు. ధైర్యవంతుడు కూడా. కానీ ఇప్పుడు ఇలా.. ఎంత పని చేశావ్రా నా కొడకా’ అని రాసుకొచ్చి బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. తన ఫ్రెండ్తో సరదాగా దిగిన ఫొటోలను షేర్ చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ ప్రభుత్వం 22 మంది భారత జాలర్లను విడుదల చేయడం గమనార్హం. 2021-22లో తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ వారిని అరెస్ట్ చేసింది. 22 మందిలో 18 మంది గుజరాత్, ముగ్గురు డయ్యూ, ఒకరు యూపీకి చెందినవారు ఉన్నారు. కాగా ఇటీవల విడుదలైన నాగచైతన్య ‘థండేల్’ స్టోరీ కూడా ఇలాంటి వాస్తవిక సంఘటన ఆధారంగా తెరకెక్కించిందే.

బర్డ్ ఫ్లూ భయంతో కొందరు చికెన్కు దూరంగా ఉంటున్నారు. చికెన్కు ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల గింజలు తింటే ఎక్కువ బలాన్ని పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం తింటే కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. శనగలు తింటే పోషకాలు అందుతాయి. వాల్ నట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రాజ్మా, జనపనార గింజలు తింటే ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

* వరల్డ్ మెజీషియన్స్(ఇంద్రజాలికులు) డే
* 1483- మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం
* 1503- తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య మరణం(ఫొటోలో)
* 1913- ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం
* 1957- మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జననం
* 2009- రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏఆర్ రెహ్మాన్

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

తేది: ఫిబ్రవరి 23, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు అసర్: సాయంత్రం 4.43 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.