India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నీటిలో ఫేకల్ బ్యాక్టీరియా ఉందన్న CPCB రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ నివేదికను యూపీ సీఎం యోగి <<15514963>>ఖండించారు.<<>> ఆ నీరు తాగొచ్చని కూడా ప్రకటించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీఎంకు సవాల్ విసిరారు. ‘యోగి, ఆయన మంత్రివర్గానికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మహా కుంభమేళాలో ఓ గ్లాస్ నీటిని తాగి చూపించండి’ అని ఛాలెంజ్ చేశారు.

23వ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో దీప్తి జీవాంజి మెరిశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగును 57.82 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఆమెకు పలువురు క్రీడాకారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్లో కాంస్య పతక విజేత అయిన దీప్తి ఇటీవల అర్జున అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీప్తి జీవాంజిది TGలోని వరంగల్ జిల్లా పర్వతగిరి (M) కల్లెడ.

TG: కరీంనగర్కు చెందిన 26ఏళ్ల యువకుడు 5ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి మలం ద్వారా క్యాప్ వెళ్లి ఉంటుందని, ఏ ఇబ్బంది లేదన్నారు. ఇటీవల 10రోజులుగా అతను అనారోగ్యంతో HYDలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. CT స్కాన్ చేసిన డాక్టర్లు ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఉండటం గుర్తించి వెలికితీశారు. 21 ఏళ్లుగా క్యాప్ ఉండటం వల్ల ఊపిరితిత్తుల కండరాలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు.

TG: లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆలోగా క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వనుంది. LRSపై మంత్రులు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 4 ఏళ్లలో ప్లాట్లు కొన్నవారికి, 10% ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకూ అవకాశం కల్పించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

ఢిల్లీకి నాలుగో సారి మహిళ సీఎంగా ఉండనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశీ (ఆప్) సీఎంలుగా పని చేశారు. తాజాగా రేఖా గుప్తా (బీజేపీ) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశంలోని 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, అందరూ పురుష సీఎంలే ఉన్నారు. వ్యూహంలో భాగంగానే ఢిల్లీ పీఠం మహిళకు అప్పగించినట్లు తెలుస్తోంది.

TG: బీఆర్ఎస్ రజతోత్సవాలను ఒక సంవత్సరం పాటు పండుగలా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇందు కోసం ఉద్యమ సహచరులతో, పార్టీ ముఖ్యులతో పలు కమిటీలను వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో అన్ని వర్గాల వారిని ఇందులో భాగం చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా 4,000 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న వర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వారు అర్హులు. మూడు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://www.bankofbaroda.in/సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

AP: రాష్ట్రంలో మరో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) మరణం చోటుచేసుకుంది. జీబీఎస్ లక్షణాలతో షేక్ గౌహర్ ఖాన్ అనే మహిళ ఈ నెల 2న గుంటూరు జీజీహెచ్లో చేరారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. గౌహర్ ఖాన్ మరణంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు భీతిల్లిపోతున్నారు. వైద్యులు ఈ వైరస్ ఏమీ చేయదని చెబుతున్నా రోగులకు గుబులు పుడుతోంది.

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా బినోయ్ సామాజిక వర్గానికి చెందిన నేత. విద్యార్థి దశ నుంచే ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1996-97 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా పని చేశారు. సౌత్ ఢిల్లీ మేయర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో షాలిమార్ బాగ్ (నార్త్ వెస్ట్) నుంచి 29595 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

తెలంగాణకు ఏనాటికైనా BRS పార్టీయే రక్షణ కవచం అని KTR అన్నారు. BRS విస్తృతస్థాయి సమావేశం అనంతరం మాట్లాడుతూ ‘KCR గారు ఒకటే మాట చెప్పారు. పార్టీలు ఓడిపోతుంటాయి. గెలుస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు, తెలంగాణ సమాజం గెలవాలి. అదే మా ఆలోచన’ అని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఫైరయ్యారు.
Sorry, no posts matched your criteria.