India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో అదరగొడుతోంది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 7లక్షల టికెట్స్ బుకింగ్ అయినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.70 కోట్లు వచ్చాయని, ఫస్ట్ డే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ‘వార్-2’ మూవీకి మాత్రం ఇప్పటివరకూ 60వేల టికెట్సే బుక్ అయ్యాయని, ఇవాళ్టి నుంచి పెరిగే ఛాన్స్ ఉందంటున్నాయి.
ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన వీధికుక్కల దాడులను సుమోటాగా తీసుకొని SC విచారణ చేపట్టింది. ఎవరైనా దీనికి అడ్డుచెబితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వాటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి పర్యవేక్షణతో కూడిన షెల్లర్టను ఏర్పాటు చేయాలని సూచించింది. రేబిస్తో మరణించిన వారిని వెనక్కితీసుకొస్తారా అని జంతు ప్రేమికులను ప్రశ్నించింది.
AP: చాక్లెట్ల తయారీకి వాడే ‘కోకో’ పంట మద్దతు ధర పడిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ ఆఖరు వరకు KG ధర రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.350కి పడిపోయింది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్ ధర రూ.720గా ఉంది. గతంలో ఆ ధరకు అనుగుణంగా మద్దతు ధర కల్పించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో సాగు ఉండగా ఏలూరులోనే 50% పైగా రైతులు కోకో పంటను పండిస్తున్నారు.
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(స్త్రీ శక్తి పథకం) ఈ నెల 15నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు మహిళా కండక్టర్లు ధరించే దుస్తులకు కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేస్తామని వెల్లడించింది.
బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్లో రెండో షోరూమ్ ఓపెనింగ్కు సిద్ధమైంది. గత నెల 15న ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభించిన టెస్లా ఢిల్లీ ఎయిరోసిటీలో ఇవాళ 2PMకు రెండో స్టోర్ స్టార్ట్ చేయనుంది. షోరూమ్ ముందు <<17074330>>మోడల్ Y<<>> కార్లను ప్రదర్శించింది. V4 సూపర్ఛార్జింగ్ యూనిట్స్నూ అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా త్వరలో మరిన్ని సిటీలకు షోరూంలను విస్తరించే అవకాశముంది.
TG: హైదరాబాద్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ చేశారు. మ.3 గంటలకే దశలవారీగా లాగ్ ఔట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలని అన్ని కంపెనీలు, ఉద్యోగులకు సూచించారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సురక్షితంగా ఇళ్లకు చేరుకోవచ్చని, ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం ఉండదన్నారు. కొన్ని రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
AP: ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 డిఫెన్స్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. నాగాయలంక గొల్లలమొద వద్ద మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం నెలకొల్పుతామని PM ప్రకటించడం తెలిసిందే. అటు బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం కోసం జగ్గయ్యపేట జయంతిపురం ప్రాంతాన్ని డిఫెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ NHకు దగ్గర్లో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో అనుకూలమని భావిస్తున్నారు. ఇవి పట్టాలెక్కితే వేల మందికి ఉపాధి లభిస్తుంది.
AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఎక్కడ ఉన్నారో క్లారిటీ ఇవ్వాలని శివసేన MP సంజయ్ రౌత్ హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. ‘JUL 21న రాజీనామా చేసినప్పటి నుంచి ధన్ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఆరోగ్యం తదితర పూర్తి వివరాలను నిజాయితీగా వెల్లడించాలి. కొందరు ఎంపీలు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. కానీ ముందు మిమ్మల్ని అడగాలని నేను డిసైడ్ అయ్యా’ అని రాసుకొచ్చారు.
ఆసియా కప్లో గిల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్య స్థానంలో ఈ యంగ్ ప్లేయర్ను VCగా నియమిస్తారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయనకు వైస్ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పాయి. ENGతో టెస్టు సిరీస్లో గిల్ కెప్టెన్గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకుంటున్న T20 కెప్టెన్ సూర్య టోర్నీ ప్రారంభంలోపు ఫిట్ అవుతారని తెలిపాయి.
Sorry, no posts matched your criteria.