India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NEEPCO) 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు GATE-2025 అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గేట్ స్కోరు , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://neepco.co.in

కొందరు రైతులు పొలం దగ్గర గినీ కోళ్లను పెంచుతుంటారు. ఇవి చాలా చురుగ్గా ఉండి చిన్న అలికిడి అయినా వెంటనే స్పందిస్తాయి. కొత్త వ్యక్తులు, జంతువులు వస్తే ఇవి గట్టిగా అరుస్తూ రైతులను అలర్ట్ చేస్తాయి. ఇవి బాగా పరిగెత్తగలవు. పొలం చుట్టుపక్కల ఉన్న పాములను గుర్తించి చంపుతాయి. ఈ కారణంగానే పొలాలు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పాములు, పురుగులు, ఇతర చిన్న కీటకాల నివారణకు ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతుంటారు.

లైఫ్&హెల్త్ ఇన్సూరెన్స్పై GSTని ఎత్తేయడంతో ఆయా పాలసీల కోసం డిమాండ్ 38% వరకు పెరిగిందని పాలసీబజార్ రిపోర్టు వెల్లడించింది. ‘₹15L-₹25L కవరేజీపై 45శాతం, ₹15L-₹25L ప్లాన్లపై 24 శాతం, ₹10L కంటే తక్కువ ప్లాన్లపై 18 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా సగటు హెల్త్ కవరేజ్ ₹13L నుంచి ₹18Lకు పెరిగింది. 61+ ఏళ్ల కేటగిరీలో ఇన్సూరెన్సులు 11.5 శాతం పెరిగాయి’ అని పేర్కొంది.

ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. BPCL మాజీ CFO శివకుమార్ కూతురు ఇటీవల మరణించారు. అయితే అంబులెన్స్ మొదలుకుని FIR, పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు, డెత్ సర్టిఫికెట్ వరకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను SMలో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. సిస్టమ్లోని కరప్షన్పై నెటిజన్లు ఫైరవుతున్నారు.

పాదాల సంరక్షణ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ కాలస్ రిమూవర్. ఈ మల్టీఫంక్షనల్ పెడిక్యూర్ కిట్లో డెడ్ స్కిన్ రిమూవల్ హెడ్తో పాటు, నెయిల్ బఫర్ హెడ్, పాలిషింగ్ హెడ్ వస్తాయి. దీనికి ముందువైపు పవర్ బటన్ ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్తో పెడిక్యూర్ చేసుకోవడం చాలా సులభం. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.

TG: రాష్ట్రంలోని 12 నేషనల్ హైవేస్పై ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. PM e-డ్రైవ్ పథకం కింద NHA 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా కేంద్రం 12 స్టేషన్లను ఆమోదించింది. NH44(ఆదిలాబాద్-మహబూబ్ నగర్), NH65 (జహీరాబాద్-కోదాడ), NH163 (వికారాబాద్-ములుగు), NH765 (హైదరాబాద్-దిండి) ఇందులో ఉన్నాయి. NH150 (సంగారెడ్డి)ని మినహాయించారు. స్టేషన్లు ఏర్పాటుపై రాయితీలు ఇస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం తగ్గలేదు. దీంతో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

నేడు కార్తీక శుద్ధ నవమి. విష్ణువు కూష్మాండుడు అనే రాక్షసుడిని ఇదే రోజు సంహరించాడని పురాణాల వాక్కు. అందుకే కూష్మాండ నవమి అని కూడా అంటారు. ఈ రోజున లక్ష్మీనారాయణులను ఉసిరి చెట్టు వద్ద ఆవాహన చేసి పూజిస్తారు. ఉసిరి చెట్టు కింద జగద్ధాత్రి పూజ చేసి, విష్ణు సహస్ర నామం, కనకధారా స్తోత్రం వంటివి పఠించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. దీని వలన కీర్తి, జ్ఞానం, సంపదలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.

హైదరాబాద్లోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో 7 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్డీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iict.res.in/

వర్షాల వల్ల మినుము, పెసర పంటలు మంపునకు గురయ్యాయి. ఇవి మొలక నుంచి శాఖీయ, పూత నుంచి కాయ, కోత దశలో ఉన్నాయి. ఒకవేళ పంట మొలక నుంచి శాఖీయ దశలో ఉంటే పొలాల్లో వర్షపు నీటిని తొలగించాలి. ఇనుము ధాతు లోప సవరణకు 10 లీటర్ల నీటికి అన్నభేది 50 గ్రా.+నిమ్మఉప్పు 5 గ్రా.+100-150గ్రా. యూరియా కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక వారం తర్వాత 1 శాతం 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.
Sorry, no posts matched your criteria.