News November 19, 2024

పౌరసత్వాన్ని వదులుకొని..!

image

మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఏటా చాలా మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే, వారు వెళ్లిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటంటే.. స్వచ్ఛమైన గాలి & నీరు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, హైక్లాస్ ప్రజా రవాణా అని నిపుణులు చెబుతున్నారు. 2023లో 2.16 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడం గమనార్హం.

News November 19, 2024

దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు: భట్టి

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.

News November 19, 2024

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: పవన్

image

AP: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 15వ ఫైనాన్స్ నిధులు కేటాయించామని చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం మా బాధ్యత. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తాం. ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News November 19, 2024

కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్

image

ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News November 19, 2024

బుల్స్ బ్యాటింగ్: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 300, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు తగ్గడం, FIIలు తిరిగొస్తుండటమే ఇందుకు కారణాలు. బ్యాంకింగ్, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ పెరిగింది. 200DEMA లెవల్ నుంచి నిఫ్టీ బౌన్స్‌బ్యాక్ అయింది.

News November 19, 2024

తిరుమల వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి!

image

శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారికి రూమ్స్ దొరక్కపోతే లాకర్స్‌ అందుబాటులో ఉంటాయి. వాటిలో వస్తువులను భద్రపరిచి సేదతీరేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఉచిత మండపాలున్నాయి. తిరుమల బస్‌స్టాండుకు ఎదురుగా ఉన్న యాత్రి సదన్, యాత్రి సదన్-3 & పక్కనే ఉన్న పద్మనాభ నిలయం, ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మాధవ నిలయంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. వసతి కౌంటర్లు ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉంటాయి.

News November 19, 2024

పట్నం నరేందర్ రెడ్డికి జైలులో స్పెషల్ బ్యారక్

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు తోటి ఖైదీలతో కాకుండా ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని జైలు అధికారులను ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం కూడా అనుమతించాలని పేర్కొంది. కాగా లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో ఉంటున్నారు.

News November 19, 2024

NEXT STEPS: చైనా ఫారిన్‌ మినిస్టర్‌తో జైశంకర్ మీటింగ్

image

చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ‌తో EAM జైశంకర్ సమావేశమయ్యారు. జీ20 సమ్మిట్ జరుగుతున్న బ్రెజిల్ రాజధాని రియోలో ప్రత్యేకంగా కలిశారు. లద్దాక్‌లో సైనిక ఉపసంహరణ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు తీసుకోవాల్సిన తర్వాతి చర్యలపై వీరు చర్చించారు. అలాగే ప్రపంచ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. కొన్ని రోజుల క్రితమే రష్యాలో బ్రిక్స్ సమావేశాల్లో చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ను PM మోదీ ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.

News November 19, 2024

వివేకా హత్య కేసు.. అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు

image

AP: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న YCP ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని డా.చైతన్య రెడ్డి జైలులో బెదిరించాడని సునీత తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ప్రతివాదులైన అవినాశ్ రెడ్డి, చైతన్య రెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

News November 19, 2024

ఫ్రీబీస్‌తో హిమాచల్ దివాలా: నెక్ట్స్ AP, TG?

image

విద్యుత్ కంపెనీల బకాయిలు తీర్చేందుకు భవనాలను వేలం వేస్తున్న హిమాచల్ ప్రదేశ్ దుస్థితి TG, AP, కర్ణాటక, కేరళను భయపెడుతోంది. అక్కడిలాగే ఇక్కడా ఉచితాలు అమలు చేయడం తెలిసిందే. పరిమితికి మించి అప్పులు చేయడమే కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసేలా పథకాల పెట్టాయి. కొత్త ఆదాయం లేకపోవడంతో సెస్సుల రూపంలో పన్నులు వేస్తున్నాయి. పరిస్థితి మారకుంటే కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీరేమంటారు?