News April 24, 2025

పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల

image

AP: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) పాలిసెట్-2025 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://polycetap.nic.in సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే అందుబాటులో ఉంటాయని, పోస్ట్ లేదా ఇతర ఆఫ్‌లైన్ పద్ధతుల్లో పంపబోమని అధికారులు స్పష్టం చేశారు.

News April 24, 2025

కశ్మీరీలు మౌనం వీడాలి: ప్రకాశ్ రాజ్

image

పహల్‌గామ్ దాడి అమాయకులపై జరిగింది కాదని, మొత్తం కశ్మీర్‌పై జరిగిన దాడి అని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కశ్మీరీలు మౌనం వీడి, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని ఆయన ఎక్స్‌లో పిలుపునిచ్చారు. ‘పహల్‌గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడి నా హృదయాన్ని మెలిపెట్టింది. ఈ దుశ్చర్య చూసి రక్తం మరిగిపోతోంది. ఇలాంటి చర్యలను అస్సలు క్షమించకూడదు. ఇదో పిరికిపంద చర్య’ అని ఆయన సుదీర్ఘ నోట్ రాశారు.

News April 24, 2025

రాష్ట్రపతితో షా, జైశంకర్ భేటీ

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చర్యలను రాష్ట్రపతికి వివరించారు. దేశ భద్రత, పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలపై చర్చించారు.

News April 24, 2025

భారత జవానును బంధించిన పాక్

image

పహల్గామ్ దాడిపై భారతావని కంటతడి ఆగకముందే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. ఏప్రిల్ 23న డ్యూటీ చేస్తూ పొరపాటున సరిహద్దు దాటిన BSF జవానును పాకిస్థాన్ రేంజర్లు బంధించారు. ఫిరోజ్‌పూర్ (పంజాబ్) వద్ద సైనికుడు తమ భూభాగంలోకి ప్రవేశించడంతోనే అరెస్టు చేశామని పాక్ సైన్యం చెబుతోంది.

News April 24, 2025

భారత్ ఆంక్షలు.. పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

image

పహల్‌గామ్ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉందని ప్రకటించిన కేంద్రం ఆ దేశంపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ పలు నిర్ణయాలు తీసుకుంది.
* అట్టారీ- వాఘా బార్డర్ మూసివేత
* భారతీయులకు సార్క్ వీసాలు రద్దు
* భారత్‌తో అన్ని వ్యాపార సంబంధాలు తెగదెంపులు
* సింధూ జలాలను ఆపడం యుద్ధం ప్రకటించడమే అని ప్రకటన
* పాక్‌లోని భారతీయులు వెనక్కి వెళ్లాలని ఆదేశం

News April 24, 2025

కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది

image

ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. జూన్ 1న ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు SLPRB ప్రకటనలో పేర్కొంది. వైజాగ్, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతిలో ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. 6,100 పోస్టులకు మొత్తం 4,59,182 మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయగా 95,208 మంది ఫిజికల్ టెస్టుకు అర్హత సాధించారు. దేహ‌ధారుడ్య పరీక్షల్లో 38,910 మంది ఫైనల్ టెస్టుకు క్వాలిఫై అయ్యారు.

News April 24, 2025

సైన్యం సిద్ధంగా ఉండాలి: పాక్ ప్రభుత్వం

image

పహల్గాం దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తుండటంతో పాక్ అప్రమత్తమైంది. సైనికులకు సెలవులు రద్దు చేసిన పాక్ ప్రభుత్వం, ఇప్పటికే లీవ్‌లో ఉన్నవారు వెంటనే వెనక్కి రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక భారత్ దాడి చేస్తే తిప్పికొట్టేందుకు, దేనికైనా సిద్ధంగా ఉండాలని సైనికులకు స్పష్టం చేసిందట. అటు ఎయిర్ అటాక్స్ భయంతో భారత విమానాలకు తమ గగనతలం నుంచి ప్రయాణించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

News April 24, 2025

పాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వెబ్‌సైట్ క్లోజ్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ క్రమంలో స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వెబ్‌సైట్‌ను ఆ దేశం క్లోజ్ చేసింది. ఇవాళ ఉదయం నుంచే నష్టాల్లో ట్రేడ్ ప్రారంభించిన ఆ దేశ స్టాక్ మార్కెట్లు 2 శాతానికి పైగా షేర్లు కోల్పోయాయి. మున్ముందు మరింత పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News April 24, 2025

అర్జున్ టెండూల్కర్‌ను నా కొడుకు గేల్‌లా మారుస్తాడు: యోగ్‌రాజ్

image

అర్జున్ టెండూల్కర్‌ను తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు అప్పగిస్తే క్రిస్ గేల్‌లా తయారు చేస్తాడని ఆయన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘3 నెలలపాటు యువీ దగ్గర అర్జున్‌ శిక్షణ తీసుకోవాలి. బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించాలి. గిల్, అభిషేక్ శర్మలాగే అతడూ స్టార్‌గా ఎదుగుతాడు’ అని పేర్కొన్నారు. కాగా అర్జున్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News April 24, 2025

పాకిస్థానీల వీసాలన్నీ రద్దు

image

ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రజలకు ఇచ్చిన వీసాలన్నింటినీ భారత విదేశాంగ శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు ఈ APR 27 వరకు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేసింది. ఇక మెడికల్ వీసాలతో భారత్‌లో ఉన్నవారు ఏప్రిల్ 29 లోపు వెళ్లిపోవాలని పేర్కొంది. మరోవైపు భారతీయులెవరూ పాక్‌కు వెళ్లొద్దని చెప్పడంతో పాటు ఇప్పటికే ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా తిరిగి రావాలని సూచించింది.