News October 30, 2025

LIC AAO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

ఎల్ఐసీలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AAO)- జనరలిస్ట్ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి జాబితా <>https://licindia.in/<<>>లో పొందుపరిచారు. వీరికి మెయిన్ ఎగ్జామినేషన్ నవంబర్ 8న జరగనుంది. కాగా 81 అసిస్టెంట్ ఇంజినీర్స్, 410 AAO స్పెషలిస్టు పోస్టుల ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా రేపు రిలీజ్ కానున్నాయి.

News October 30, 2025

మార్గదర్శి కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదు: AP ప్రభుత్వం

image

మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును సుప్రీం విచారించింది. మాజీ MP ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా వాదనలు వినిపిస్తూ సంస్థ RBI నిబంధనల ఉల్లంఘనపై విచారించాలన్నారు. అయితే ప్రధాన పిటిషన్‌పై విచారణలో వాటిని హైకోర్టుకు చెప్పాలని SC సూచించింది. ₹2300 CR డిపాజిట్లలో చాలా వరకు చెల్లించామని సంస్థ తరఫున సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. అటు కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదని AP ప్రభుత్వ న్యాయవాది SCకి తెలిపారు.

News October 30, 2025

ఇంజినీరింగ్ అర్హతతో 30 పోస్టులు

image

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NEEPCO) 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు GATE-2025 అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్య‌ర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గేట్ స్కోరు , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in

News October 30, 2025

గినీ కోళ్లను పెంచడం వల్ల రైతులకు లాభమేంటి?

image

కొందరు రైతులు పొలం దగ్గర గినీ కోళ్లను పెంచుతుంటారు. ఇవి చాలా చురుగ్గా ఉండి చిన్న అలికిడి అయినా వెంటనే స్పందిస్తాయి. కొత్త వ్యక్తులు, జంతువులు వస్తే ఇవి గట్టిగా అరుస్తూ రైతులను అలర్ట్ చేస్తాయి. ఇవి బాగా పరిగెత్తగలవు. పొలం చుట్టుపక్కల ఉన్న పాములను గుర్తించి చంపుతాయి. ఈ కారణంగానే పొలాలు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పాములు, పురుగులు, ఇతర చిన్న కీటకాల నివారణకు ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతుంటారు.

News October 30, 2025

GST ఎత్తివేత.. హెల్త్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్

image

లైఫ్&హెల్త్ ఇన్సూరెన్స్‌పై GSTని ఎత్తేయడంతో ఆయా పాలసీల కోసం డిమాండ్ 38% వరకు పెరిగిందని పాలసీబజార్ రిపోర్టు వెల్లడించింది. ‘₹15L-₹25L కవరేజీపై 45శాతం, ₹15L-₹25L ప్లాన్లపై 24 శాతం, ₹10L కంటే తక్కువ ప్లాన్లపై 18 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా సగటు హెల్త్ కవరేజ్ ₹13L నుంచి ₹18Lకు పెరిగింది. 61+ ఏళ్ల కేటగిరీలో ఇన్సూరెన్సులు 11.5 శాతం పెరిగాయి’ అని పేర్కొంది.

News October 30, 2025

కూతురు మృతి: అడుగడుగునా లంచం ఇవ్వలేక..

image

ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. BPCL మాజీ CFO శివకుమార్ కూతురు ఇటీవల మరణించారు. అయితే అంబులెన్స్ మొదలుకుని FIR, పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు, డెత్ సర్టిఫికెట్ వరకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను SMలో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. సిస్టమ్‌లోని కరప్షన్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు.

News October 30, 2025

ఈ డివైజ్‌తో అందమైన పాదాలు మీ సొంతం

image

పాదాల సంరక్షణ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్‌ కాలస్‌ రిమూవర్‌. ఈ మల్టీఫంక్షనల్‌ పెడిక్యూర్‌ కిట్‌‌లో డెడ్‌ స్కిన్‌ రిమూవల్‌ హెడ్‌తో పాటు, నెయిల్‌ బఫర్‌ హెడ్, పాలిషింగ్‌ హెడ్ వస్తాయి. దీనికి ముందువైపు పవర్‌ బటన్‌ ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్‌తో పెడిక్యూర్‌ చేసుకోవడం చాలా సులభం. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.

News October 30, 2025

12NHలపై EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

image

TG: రాష్ట్రంలోని 12 నేషనల్ హైవేస్‌పై ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. PM e-డ్రైవ్ పథకం కింద NHA 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా కేంద్రం 12 స్టేషన్లను ఆమోదించింది. NH44(ఆదిలాబాద్-మహబూబ్ నగర్), NH65 (జహీరాబాద్-కోదాడ), NH163 (వికారాబాద్-ములుగు), NH765 (హైదరాబాద్-దిండి) ఇందులో ఉన్నాయి. NH150 (సంగారెడ్డి)ని మినహాయించారు. స్టేషన్లు ఏర్పాటుపై రాయితీలు ఇస్తారు.

News October 30, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

image

తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం తగ్గలేదు. దీంతో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News October 30, 2025

నేడు ఈ చెట్టు కింద భోజనం చేస్తే..

image

నేడు కార్తీక శుద్ధ నవమి. విష్ణువు కూష్మాండుడు అనే రాక్షసుడిని ఇదే రోజు సంహరించాడని పురాణాల వాక్కు. అందుకే కూష్మాండ నవమి అని కూడా అంటారు. ఈ రోజున లక్ష్మీనారాయణులను ఉసిరి చెట్టు వద్ద ఆవాహన చేసి పూజిస్తారు. ఉసిరి చెట్టు కింద జగద్ధాత్రి పూజ చేసి, విష్ణు సహస్ర నామం, కనకధారా స్తోత్రం వంటివి పఠించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. దీని వలన కీర్తి, జ్ఞానం, సంపదలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.