News February 15, 2025

శుభ ముహూర్తం (15-02-2025)

image

✒ తిథి: బహుళ తదియ రా.10.28 వరకు
✒ నక్షత్రం: ఉత్తర రా.12.33 వరకు
✒ శుభ సమయం: ఉ.11.38 నుంచి మ.12.14, సా.4.38-సా.5.26
✒ రాహుకాలం: ఉ.9.00 నుంచి ఉ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: ఉ.6.35 నుంచి ఉ.8.17 వరకు
✒ అమృత ఘడియలు: సా.4.31 నుంచి సా.6.33 వరకు

News February 15, 2025

ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

image

ఫ్రాన్స్, యూఎస్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈనెల 10న ఫ్రాన్స్ వెళ్లిన ఆయన అక్కడ రెండు రోజులు పర్యటించారు. అనంతరం USలో 12, 13 తేదీల్లో పర్యటించి అధ్యక్షుడు ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్డ్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులతో భేటీ అయ్యారు.

News February 15, 2025

HEADLINES TODAY

image

అక్రమ వలసదారుల్ని వెనక్కి తీసుకొస్తాం: పీఎం మోదీ
భారత్‌కు ఎఫ్-35 విమానాలిచ్చేందుకు సిద్ధం: ట్రంప్
TG: మోదీ జన్మత: బీసీ కాదు: సీఎం రేవంత్
TG: కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదు: సీఎం రేవంత్
TG: కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం
AP: మేం ప్రజాస్వామ్యవాదులం: సీఎం చంద్రబాబు
AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి
కుంభమేళాలో 50 కోట్లు దాటిన భక్తుల సంఖ్య

News February 15, 2025

వాలంటైన్స్ డే.. ఎక్కువగా అమ్ముడైనవి ఇవే

image

వాలంటైన్స్ వీక్ సందర్భంగా ఆన్‌లైన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇవాళ ప్రేమికుల రోజున రోజెస్, చాక్లెట్స్, టెడ్డీ బేర్స్, జువెల్లరీ, బుక్స్, డి-టాన్ కిట్స్ ఎక్కువగా అమ్ముడైనట్లు ఈకామర్స్ సంస్థలు వెల్లడించాయి. నిమిషానికి 581 చాక్లెట్లు, 324 రోజెస్ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. తాము ఢిల్లీ, ముంబై, బెంగళూరులో హోమ్ డేట్ నైట్ ఆఫర్లు ప్రకటించగా రెస్పాన్స్ బాగుందని జొమాటో ప్రకటించింది.

News February 15, 2025

ప్రేమికుల రోజున వారు స్త్రీలను హింసించేవారు!

image

నేడంటే ‘ప్రేమికుల రోజు’న ప్రేమిస్తున్నారు కానీ ప్రాచీన రోమన్లు ఫిబ్రవరి 13 నుంచి 15 మధ్య రోజుల్లో స్త్రీలను దారుణంగా హింసించేవారు. ఈ 3రోజుల్ని సంతానోత్పత్తి పండుగగా వారు భావించేవారు. జంతువుల్ని బలి ఇవ్వడంతో పాటు స్త్రీలను తోలు ఊడిపోయేలా కొరడాలతో కొట్టడం వల్ల సంతాన సామర్థ్యం పెరుగుతుందని మూఢంగా నమ్మేవారు. దీంతో మహిళలు నరకం చవిచూసేవారు. కాలక్రమేణా ఆ దురాచారం అంతరించింది.

News February 15, 2025

గురుదక్షిణగా నాకు ప్రియురాలుగా ఉండు.. టీచర్ ఒత్తిడి

image

బిహార్ కిసాన్‌గంజ్(D)లో వికాస్ అనే టీచర్ 12వ తరగతి విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడు. ఏకలవ్యుడు గురువుకు బొటన వేలును కోసి ఇచ్చినట్లుగా తనకు గురుదక్షిణగా ప్రియురాలిగా ఉండాలని కోరాడు. బాలిక మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె పేరెంట్స్, గ్రామస్థులు స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.

News February 15, 2025

ప్రేమలో పడ్డారా? ఇలా తెలుసుకోండి!

image

మొబైల్‌లో చాట్ చేస్తూ నవ్వుకుంటున్నామంటే చాలు వీడు ప్రేమలో ఉన్నాడు అని మన పెద్దవాళ్లు డిసైడ్ చేసేస్తుంటారు. మీరు మీమ్స్ చూసి నవ్వుకుంటున్నారన్న విషయం వారికి తెలియదు. కానీ, ప్రేమలో పడినవారి శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని BBC ఓ కథనంలో పేర్కొంది. బుగ్గలు ఎరుపెక్కితే, గుండె వేగంగా కొట్టుకుంటే, చేతులు జిగురులా అతుక్కుంటే.. అవి ప్రేమలో పడ్డారనడానికి సంకేతం అని పేర్కొంది.

News February 14, 2025

స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

image

AP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ వేస్ట్ కలక్షన్స్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, క్లీన్ విలేజ్, సహా పలు అంశాలకు పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. 200 పాయింట్లకు 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో, 81 పాయింట్లతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచాయి.

News February 14, 2025

ఏ జిల్లాకు ఏ ర్యాంక్ వచ్చింది?

image

AP: ఎన్టీఆర్-1, విశాఖ-2, ఈస్ట్ గోదావరి-3, అనంతపురం-4, అన్నమయ్య-5, శ్రీకాకుళం-6, కడప-7, గుంటూరు-8, బాపట్ల-9, నెల్లూరు-10లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ గోదావరి, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, కోనసీమ, మన్యం, శ్రీ సత్యసాయి, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, విజయనగరం, చిత్తూరు, అల్లూరి జిల్లాలు ఉన్నాయి.

News February 14, 2025

TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

image

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.