India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్నాడీఎంకేతో పొత్తు వార్తలను దళపతి విజయ్ TVK పార్టీ ఖండించింది. ఓ తమిళ పత్రికలో ప్రచురితమైన కథనాలు పూర్తి నిరాధారమైనవని పేర్కొంది. TVKను అడ్డుకొనేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. TNలో DMK తమ ప్రధాన ప్రత్యర్థి అని, BJP తమ సైద్ధాంతిక విరోధి అని గతంలో విజయ్ వ్యాఖ్యానించారు. అయితే ఇరు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోకపోవడంతో పొత్తు ప్రచారం ప్రారంభమైంది.
వివాదాల్లో చిక్కుకున్న నటి కంగన చిత్రం ‘ఎమర్జెన్సీ’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. JAN 17న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. దేశ అత్యంత శక్తిమంతమైన మహిళ గాథ, భారత భవితవ్యాన్ని మార్చిన సందర్భం ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమైనట్టు తెలిపారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై సిక్కులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సెన్సార్ కట్స్ అనంతరం చిత్రం విడుదలవుతోంది.
* మొబైల్ ఫోన్ అతిగా వాడటం
* ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం
* కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని తిరస్కరించడం
* పోషకాహారం కాకుండా నచ్చిన ఫుడ్ తినడం
* శరీరానికి సరిపడా నిద్ర, విశ్రాంతి లేకపోవడం
* నిరంతరం రకరకాల పనులు చేయడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ దాటేశారు. అత్యధిక పరుగుల జాబితాలో 4,192 రన్స్తో రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో రోహిత్ శర్మ(4,231-159 మ్యాచులు) ఉన్నారు. కోహ్లీ 125 మ్యాచుల్లో 4,188 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా రోహిత్, కోహ్లీ T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
AP: మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా, ఆ పార్టీ నాయకులు తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడాలని, వైసీపీపై ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు, పేదలు, ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వం ఫెయిలైందని TG సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. MH ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తరఫున మంత్రిని లేదా అధికారిని పంపిస్తే తెలంగాణలో తాము నెరవేర్చిన హామీల వివరాలు ఇస్తామని చెప్పారు. పేద మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును మోదీ ధరలు పెంచి దోచుకున్నారని మండిపడ్డారు. తమ పార్టీవి కచ్చితమైన వాగ్దానాలని, జూటా పార్టీ హామీలు కావని సెటైర్లు వేశారు.
APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సంస్థలో 1,275 డ్రైవర్లు, 789 మంది కండక్టర్ల కొరత ఉందని తెలిపారు. ఉద్యోగులకు EHS ద్వారా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని బస్టాండులను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. YCP హయాంలో నిధులు ఇవ్వకపోవడంతో బస్టాండుల నిర్వహణ కష్టతరమైందని ఆరోపించారు.
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను కొడంగల్ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 25న విచారిస్తామని తెలిపింది. అటు అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ చేపట్టనుంది.
TG: రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్పై CJ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజలు రోడ్డు సమస్యలు తెలిపేలా మొబైల్ యాప్ రూపొందించి R&B, HMDA అధికారులు దాన్ని నిర్వహించాలని గతంలో ఆదేశించినట్లు హైకోర్టు అధికారులకు గుర్తు చేసింది. మరో నెలలో యాప్ అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. ఆపై విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది.
భారత ఎగుమతులపై అమెరికా అధిక టారిఫ్లు విధిస్తే అది ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్కు దారి తీస్తుందని US కాంగ్రెస్కు ఎన్నికైన సుహాస్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. అందుకే భారత్పై టారిఫ్లను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. US వాణిజ్య లోటును తగ్గించేలా భారత్, చైనాల ఎగుమతులపై Reciprocal Tax విధిస్తామని ఎన్నికల వేళ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుహాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Sorry, no posts matched your criteria.