News November 18, 2024

BREAKING: పోసానిపై సీఐడీ కేసు

image

AP: తెలుగు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోసాని మాట్లాడారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో ఆయనపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) BNS సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

News November 18, 2024

కిరణ్.. ‘క’ మూవీ చూసి కాల్ చేస్తా: అల్లు అర్జున్

image

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్‌ను అభినందించారు. ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల సినిమాను చూడలేకపోతున్నా అని, కానీ తప్పకుండా మూవీ చూసి హీరో కిరణ్‌కు ఫోన్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. ‘పుష్ప-2’ ట్రైలర్ బాగుందని కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్‌కు ఐకాన్ స్టార్ ఇలా స్పందించారు.

News November 18, 2024

రేవంత్ పాలనలో 15 ఏళ్లు వెనక్కి: హరీశ్ రావు

image

TG: రేవంత్ పాలనలో తెలంగాణ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీలు బంద్ చేసి మూసీ దుకాణం తెరిచారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను నం.1గా మార్చారని చెప్పారు. పేదోళ్లతో పెట్టుకుని రేవంత్ హిట్ వికెట్ చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారని, బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News November 18, 2024

వేములవాడ అభివృద్ధికి భారీగా నిధుల విడుదల

image

TG: ఎల్లుండి సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో వేములవాడకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఆలయ అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు ఆధునాతన సదుపాయాల కోసం రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూల వాగు బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణకు రూ.47.85 కోట్లు, స్థానికంగా మేజర్ డ్రైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంది.

News November 18, 2024

అప్పట్లో గంభీర్ వార్నింగ్.. ఇప్పుడు గంగూలీ మద్దతు

image

BGT సిరీసులో రవిచంద్రన్ అశ్విన్‌ను తొలి టెస్టు నుంచే ఆడించాలని BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నారు. అతడిని బెంచ్‌పై కూర్చోబెట్టొద్దని సూచించారు. ‘చర్చే లేదు. టెస్టు క్రికెట్లో స్పెషలిస్టులే కీలకం. అందుకే టీమ్ బెస్ట్ స్పిన్నర్ అశ్విన్ ఆడాల్సిందే. ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న ఆసీస్‌పై అతడే ప్రభావం చూపగలడు’ అని అన్నారు. గతంలో కొన్ని మ్యాచులకు యాష్‌ను తప్పించడంపై గంభీర్ హెచ్చరించడం తెలిసిందే.

News November 18, 2024

వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా సజ్జల

image

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ చీఫ్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఆయనను నియమించారు.

News November 18, 2024

‘పుష్ప-2’ ట్రైలర్‌పై వార్నర్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్

image

మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ ‘పుష్ప’ మేనరిజంతో ప్రతి ఇండియన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. నిన్న ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజవడంతో ‘చాలా బాగుంది బ్రదర్’ అని అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. దీనికి అల్లు అర్జున్ సైతం స్పందిస్తూ ‘ఎంతో ప్రేమతో.. మీకు ధన్యవాదాలు ’ అని రిప్లై ఇచ్చారు. దీంతో డిసెంబర్ 5న FDFS చూసేందుకు HYDకి రావాలని నెటిజన్లు వార్నర్‌ను కోరుతున్నారు.

News November 18, 2024

నేడు కడప దర్గాకు రామ్ చరణ్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు కడపలోని అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరుకానున్నారు. దర్గాలో నేడు జరగనున్న ముషాయిరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట మేరకు ఆయన మాలలో ఉన్నప్పటికీ దర్గాకు వెళ్తున్నారు. చరణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రార్థనల అనంతరం చరణ్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

News November 18, 2024

నేను భారతీయులకు గులాంను: కిషన్ రెడ్డి

image

TG: తనను గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని, తాను భారతీయులకు గులాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటలీకి, నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులామ్‌ను కాదని దుయ్యబట్టారు. అదానీ పేరు చెప్పి కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం అదానీతో రేవంత్ చర్చలు జరపడం లేదా అని ప్రశ్నించారు.

News November 18, 2024

అంగన్‌వాడీలకు గ్రాట్యుటీపై పరిశీలన: మంత్రి సంధ్యారాణి

image

AP: అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని వెల్లడించారు. వారికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు. వారి సమ్మె వల్ల గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో వారు ఆందోళనలను విరమించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.