News November 18, 2024

స్కూళ్ల టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే..

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం ఉ.9 గం. నుంచి సా.4 గం. వరకు స్కూళ్లు నడుస్తుండగా దాన్ని సా.5 గం. వరకు విద్యాశాఖ పొడిగించింది. ఈనెల 25-30 వరకు కొత్త టైమ్‌టేబుల్‌ను తొలుత ప్రతి మండలంలోని 2 బడుల్లో అమలు చేయనుంది. దీని ప్రకారం ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ సమయాన్ని 5 ని. చొప్పున, భోజన విరామాన్ని 15ని. పెంచారు. ఉ. తొలి పీరియడ్ 5ని. పెంచి 50ని. చేశారు. తర్వాతి 3 పీరియడ్లను కూడా 5ని. చొప్పున పెంచి 45ని. చేశారు.

News November 18, 2024

22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు.. ఉత్తర్వులు జారీ

image

TG: మహిళా సంఘాల బలోపేతం కోసం మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల్లో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగతా జిల్లాల్లోనూ నిర్మించనుంది. ఒక్కో భవనానికి రూ.5కోట్లు చొప్పున మొత్తం రూ.110కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు హనుమకొండలో జరగనున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

News November 18, 2024

నేను పారిపోలేదు: నటి కస్తూరి

image

తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరిని హైదరాబాద్‌లోని సినీ నిర్మాత హరికృష్ణన్ బంగ్లాలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఎలాంటి భయం లేదని, ఎక్కడికీ పారిపోలేదన్నారు. షూటింగ్ కోసమే HYD వచ్చానని, తన ఫోన్ న్యాయవాదికి ఇచ్చినట్లు చెప్పారు. కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని కస్తూరి తెలిపారు.

News November 18, 2024

మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 23న అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ తుఫానుగా మారే ఛాన్సుందని, ఈనెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాయలసీమలోని అన్ని జిల్లాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News November 18, 2024

ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా

image

AP: ఇవాళ జరగాల్సిన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఎల్లుండికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిన్న నారావారిపల్లెలో జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకూ సీఎం అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.

News November 18, 2024

టెట్ అభ్యర్థులకు అలర్ట్

image

TG: టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు పాఠశాల విద్యాశాఖ <>సైట్‌లో<<>> అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. మరోవైపు దరఖాస్తు గడువు ఈనెల 20తో ముగియనుంది. ఇప్పటివరకూ సుమారు లక్షన్నర దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏవైనా టెక్నికల్ సమస్యలు వస్తే 7032901383, 9000756178 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

News November 18, 2024

‘వార్-2’ స్పెషల్ సాంగ్‌లో ఆ హీరోయిన్?

image

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్-2’లో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆమె షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2025 AUG 14న రిలీజ్ కానుంది.

News November 18, 2024

సమగ్ర కులగణన సర్వే 58.3% పూర్తి

image

TG: సమగ్ర కులగణన సర్వేను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఇప్పటివరకూ 58.3% ఇళ్లలో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.16కోట్ల ఇళ్లను గుర్తించగా, ఇప్పటివరకూ 67.72 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 87.1%, నల్గొండలో 81.4%, జనసాంద్రత ఎక్కువగా ఉన్న HYDలో కేవలం 38.3% పూర్తయింది.

News November 18, 2024

టీ అమ్ముకునే వాడంటూ మోదీని అవమానించారు: పవన్

image

టీ అమ్ముకునే వాడు ప్రధాని అవ్వడమేంటని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేశారని పుణే కంటోన్మెంట్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. ‘కొట్టు పెట్టి ఇస్తాం వచ్చి టీ అమ్ముకో’ అని అవమానించారని, అవన్నీ తట్టుకుని ఆయన 3 సార్లు PM అయ్యారని గుర్తుచేశారు. మోదీ మళ్లీ PM అవ్వకూడదని విపక్షాలు ప్రయత్నాలు చేస్తుంటే తాను పట్టుబట్టి APలో BJP, TDPతో కూటమిగా పోటీ చేసి 93% స్ట్రైకింగ్ రేట్‌తో విజయం సాధించామని తెలిపారు.

News November 18, 2024

ఆ వివరాలు వెల్లడించకపోతే ₹10లక్షల ఫైన్: IT

image

ITR ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించాలని IT శాఖ తెలిపింది. ఒకవేళ ఆ వివరాలు వెల్లడించకపోతే బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015 కింద రూ.10లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, బీమా ఒప్పందాలు, ట్రస్టులు, ఇతర ఆస్తుల వివరాలను తెలపాలని సూచించింది. సవరించిన ITR ఫైల్ చేసేందుకు గడువు DEC 31తో ముగియనుంది.