India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మలేషియాలో ఉన్న జెంటింగ్ హైలాండ్స్ అనే నగరం ఆకాశంలో ఉందా? అన్నట్లుగా పర్యాటకులను అబ్బురపరుస్తుంటుంది. ఈ ప్రాంతం ఏకంగా 1800 మీటర్ల ఎత్తులో, టిటివాంగ్సా పర్వతాలలో మౌంట్ ఉలు కాలీ శిఖరంపై ఉంది. ఈ హిల్ స్టేషన్ను 1965లో మలేషియా వ్యాపారవేత్త లిమ్ గో టోంగ్ స్థాపించినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు 25 °C (77 °F)కు మించవు. జెంటింగ్ హైలాండ్స్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 8.4 °C (47.1 °F).
* ముగిసిన రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు
* ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష
* కిషన్ రెడ్డి గుజరాత్ గులాం: సీఎం రేవంత్
* లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే మూసీ నిద్ర: కేటీఆర్
* ఈవీలు కొన్నవారికి ట్యాక్స్ ఫ్రీ: మంత్రి పొన్నం
* ప్రధాని మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం
* సెంట్రల్ జైలుకు నటి కస్తూరి
* పుష్ప 2 ట్రైలర్ విడుదల
* BGT తొలి టెస్టుకు భారత కెప్టెన్గా బుమ్రా!
భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ IPL 18వ సీజన్లో ఆడబోతున్నారు. కాగా కొందరు ధోనీ కెప్టెన్సీలో ఆడి రిటైర్మెంట్ పలికి తిరిగి మెంటార్లుగా IPLలో అడుగుపెడుతున్నారు. ఈ లిస్టులో ద్రవిడ్, పార్థివ్ పటేల్, జహీర్ ఖాన్, దినేశ్ కార్తీక్, బ్రావో ఉన్నారు. వీరంతా వివిధ జట్లకు కోచ్, మెంటార్లుగా నియమితులయ్యారు. ధోనీ మాత్రం ఇంకా IPLలో ఆటగాడిగా కొనసాగుతున్నారు. దీంతో అభిమానులు దటీజ్ తల అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొన్ని రకాల ఫుడ్స్ తింటే ముందుగానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర, పిండి పదార్థాలతో తయారుచేసే పిజ్జా, బర్గర్, పఫ్స్, స్వీట్లు తింటే అకాల వృద్ధాప్యం దరి చేరుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా చర్మంపై ముడతలు వచ్చి ముసలితనం కనిపిస్తుంది. టీ, కాఫీ, మద్యపానం ఎక్కువగా చేసినా త్వరగా ముసలివారు అయిపోతారు. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
ఇప్పుడంటే లైట్స్, కరెంట్ అందుబాటులో ఉండటంతో అర్ధరాత్రి వరకూ నిద్రపోకుండా ఉంటున్నాం. ఎడిసన్ బల్బును కనుగొనక ముందు ఎలా ఉండేదో తెలుసా? 20వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రతి ఒక్కరూ దాదాపు 10 నుంచి 12 గంటల వరకు నిద్రపోయేవారని నిపుణులు చెబుతున్నారు. ఇది వేసవిలో కాస్త తగ్గేదని అంటున్నారు. ప్రస్తుతం కృత్రిమ కాంతి వల్ల నిద్ర గురించి పూర్తిగా పట్టించుకోవట్లేదని గుర్తుచేస్తున్నారు.
TG: రేపు రాష్ట్రంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్లోని లగచర్లకు వెళ్లి రైతులు, గిరిజనులతో సమావేశం కానుంది. అనంతరం కలెక్టర్పై దాడి కేసులో సంగారెడ్డి జైలులో ఉన్న వారిని కలవనుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకొని అక్కడే బస చేయనుంది.
AP: లంచం తీసుకుంటూ <<14636570>>సీబీఐకి<<>> పట్టుబడిన విశాఖ వాల్తేరు DRM సౌరభ్ ప్రసాద్ ఆస్తుల చిట్టా బయటకొస్తోంది. ఇప్పటివరకు సౌరభ్కు చెందిన రూ.87.6 లక్షల ఆస్తులను సీబీఐ జప్తు చేసింది. రూ.72లక్షల విలువైన బంగారం, ఆస్తుల పత్రాలను సీజ్ చేసింది. ముంబైలోని అపార్ట్మెంట్లో లాకర్ను సీబీఐ అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవడంతో సీఎం ఆతిశీ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్టేజ్-4 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు తప్పా మిగతా వారికి ఫిజికల్ క్లాసులు నిర్వహించవద్దని ట్వీట్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో పాటు నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది.
సూర్య, దిశా పటానీ కాంబినేషన్లో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.127.64 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
AP: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కొత్త విధానం రూపొందించామని నెల్లూరులో అధికారులతో సమీక్షలో మంత్రి చెప్పారు. ప్రజలు తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.