News November 18, 2024

నిద్రపోకుండా వ్యాయామం చేస్తున్నారా?

image

రోజూ ఉదయమే నిద్రలేచి వ్యాయామం, వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే దీనికోసం ఉదయం 4/5 గంటలకే లేచి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. డా. సుధీర్ కుమార్ రిప్లై ఇచ్చారు. ‘అందరికీ 7-9 గంటలు నిద్ర అవసరం. నిత్యం తక్కువ నిద్రపోయి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదికాదు. వ్యాయామం చేసేముందు వాంఛనీయ నిద్ర ఉండేలా చూసుకోండి’ అని ఆయన సూచించారు. మీరు రోజూ ఎంతసేపు నిద్రపోతారు?

News November 18, 2024

హెజ్బొల్లా కీలక నేత హతం

image

హెజ్బొల్లా మీడియా రిలేషన్స్ చీఫ్‌ మహ్మద్ అఫీఫ్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. బీరుట్‌లో జరిపిన ఐడీఎఫ్ వైమానిక దాడిలో అఫీఫ్ మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోనూ దాడులు చేస్తోంది. ఇవాళ జరిపిన దాడుల్లో 12 మంది పౌరులు మరణించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

News November 17, 2024

రేపు ఢిల్లీకి కేటీఆర్!

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. వికారాబాద్(D) లగచర్ల గిరిజనులతో కలిసి జాతీయ ST కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లగచర్లలో ఫార్మా భూసేకరణపై చర్చించే క్రమంలో కలెక్టర్‌పై పలువురు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

News November 17, 2024

గ్రూప్-3 పరీక్షకు హాజరైంది 50శాతం మందే

image

తెలంగాణ వ్యాప్తంగా 1401 ఎగ్జామ్ సెంటర్లలో ఇవాళ జరిగిన గ్రూప్-3 పరీక్ష రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు. 5.36 లక్షల మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 76.4శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఉదయం పేపర్-1కు 2,73,847 మంది, పేపర్-2కు 2,72,173 మంది మాత్రమే హాజరైనట్లు TGPSC ప్రకటించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 64శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.

News November 17, 2024

వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం

image

TG: వరంగల్ మాస్టర్‌ప్లాన్-2041కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్‌ను ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై 2018లో కుడా స్వీకరించిన అభ్యంతరాలు, భూ వినియోగ జోన్లు, ఇతర నియంత్రణలపై రేపు గెజిట్ విడుదల చేయనుంది. 2041 నాటికి వరంగల్ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు సమాచారం.

News November 17, 2024

‘పుష్ప’ నటుడి ఎంగేజ్మెంట్

image

కన్నడ నటుడు డాలీ ధనంజయ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ధన్యత అనే డాక్టర్‌తో ఇవాళ ఆయన నిశ్చితార్థం జరిగింది. కర్ణాటక హసన్ జిల్లాలోని ఆయన ఇంట్లో ఎలాంటి ఆడంబరాలు లేకుండా కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న మైసూర్‌లో వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా, ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డిగా ధనంజయ నటించిన విషయం తెలిసిందే.

News November 17, 2024

నిరుద్యోగులకు మంత్రి కీలక సూచనలు

image

TG: ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజీ లేదని తెలిపారు. ఆరోగ్య శాఖలో 11 నెలల్లోనే 7వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు. దళారుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News November 17, 2024

రేపు అసెంబ్లీలో కీలక తీర్మానాలు

image

AP అసెంబ్లీలో రేపు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో 8 డివిజనల్, 4 రైల్వే జోనల్ కమిటీలు, యూజర్ కన్సల్టింగ్ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను రెండేళ్ల కాలానికి సభ్యులుగా ఎన్నుకునేలా తీర్మానం ప్రవేశపెడతారు.
రేపు అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీటిని ప్రవేశపెట్టనున్నారు. అలాగే బడ్జెట్ సహా పలు అంశాలపై రేపు చర్చలు జరగనున్నాయి.

News November 17, 2024

గొర్రెలు కాస్తున్న స్టార్ హీరో కుమారుడు..!

image

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ స్టార్ డమ్‌ను కాదనుకుని చిన్నాచితక జీవితం గడిపేస్తున్నారు. స్పెయిన్‌లోని ఓ ఫామ్‌లో గొర్రెలు కాస్తున్నారు. యజమాని పెట్టేదే తింటూ అక్కడే నిద్రపోతున్నారు. డబ్బు, హోదా కంటే చిరకాల అనుభవాలకే ఆయన విలువిస్తారు. కాగా ప్రణవ్ ‘పునర్జని’ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఉత్తమ బాలనటుడి అవార్డు అందుకున్నారు. ‘ఆది’ చిత్రంతో హీరోగా రీఎంట్రీ ఇచ్చారు.

News November 17, 2024

షమీపై సంచలన ఆరోపణలు!

image

భారత బౌలర్ మహ్మద్ షమీ వయసుపై మోహన్ కృష్ణ అనే నెటిజన్ సంచలన ఆరోపణలు చేశారు. అతడి వయసు ప్రస్తుతం 42 ఏళ్లు కాగా, 34 ఏళ్లంటూ బోర్డును మోసగిస్తున్నారని ఆరోపించారు. షమీకి చెందినదిగా చెబుతున్న ఓ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోను ట్విటర్‌లో అప్‌లోడ్ చేశారు. బీసీసీఐ దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ బోర్డును ట్యాగ్ చేశారు. అయితే అది ఫేక్ కావొచ్చంటూ షమీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తుండటం గమనార్హం.