News November 17, 2024

గ్రూప్-3లో సినిమాలపై ప్రశ్నలు.. జవాబులు చెప్పండి చూద్దాం!

image

1.2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది?
A.బ్రహ్మాస్త్ర B.కాంతార C.ముర్‌ముర్స్ ఆఫ్ ది జంగల్ D.ఆట్టం
2.ఆస్కార్ అవార్డు 2024కి నామినేట్ అయిన డాక్యుమెంటరీ చలనచిత్రం ‘టు కిల్ ఎ టైగర్’ దర్శకుడు ఎవరు?
A.కార్తికి గొన్సాల్వ్స్ B.నిషా పహుజా C.ఆర్.మహదేవన్ D.నిఖిల్ మహాజన్
**సరైన సమాధానాలు సా.5 గంటలకు ఇక్కడే పోస్ట్ చేస్తాం.

News November 17, 2024

అవకతవకలు జరుగుతున్నాయ్: కైలాష్ గహ్లోత్

image

ఆతిశీ ప్ర‌భుత్వంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆప్‌కు <<14635089>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గ‌హ్లోత్‌ ఆరోపించారు. పార్టీ స‌వాళ్లు ఎదుర్కొంటోంద‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను విస్మ‌రించింద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లపై పార్టీ నిబ‌ద్ధ‌త‌ను వ్యక్తిగత రాజ‌కీయ ఆశయాలు అధిగ‌మించాయ‌న్నారు. అధికారిక నివాసానికి భారీగా ఖర్చు చేయడం వంటి అంశాలు సామాన్యులుగా ఉండాల‌నుకొనే పార్టీ వైఖ‌రిపై అనుమానాల‌కు తావిస్తోంద‌ని తప్పుబట్టారు.

News November 17, 2024

చనిపోయాడనుకొని అంత్యక్రియలు.. తీరా చూస్తే.!

image

గుజరాత్‌కు చెందిన బ్రిజేశ్ OCT 27న అదృశ్యమవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. NOV 10న వారు సబర్మతి బ్రిడ్జి కింద కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. వారు డెడ్‌బాడీ బ్రిజేశ్‌దేనని కన్ఫర్మ్ చేసి అంత్యక్రియలు చేశారు. శుక్రవారం ఇంటివద్ద ప్రేయర్ మీట్‌ నిర్వహించగా దానికి బ్రిజేశ్ రావడంతో అంతా షాక్ అయ్యారు. డెడ్‌బాడీని నిర్ధారించడంలో కుటుంబీకులు పొరబడ్డట్లు తేలింది.

News November 17, 2024

ప్రధాని మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం

image

ప్రధాని మోదీకి నైజీరియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్’ను ఆయనకు ప్రకటించింది. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డు పొందిన విదేశీ ప్రముఖుడు మోదీ మాత్రమే కావడం విశేషం. ఇది ఆయనకు అందిన 17వ విదేశీ పురస్కారం. కాగా మోదీ నైజీరియా నుంచి జీ20 లీడర్స్ సమ్మిట్ కోసం బ్రెజిల్ వెళ్తారు. ఆ తర్వాత గయానాలో పర్యటిస్తారు.

News November 17, 2024

ఢిల్లీ మంత్రి రాజీనామా

image

ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్. అరవింద్ కేజ్రీవాల్ తరువాత ముఖ్యమంత్రి పదవి ఈయనకే వస్తుందనే ప్రచారం కూడా జరిగింది.

News November 17, 2024

తొలి అరగంట మినహా ‘కంగువా’ అద్భుతం: జ్యోతిక

image

‘కంగువా’కు మిక్స్‌డ్ టాక్ వస్తున్న వేళ సూర్య భార్య జ్యోతిక తన అభిప్రాయాన్ని SMలో వెల్లడించారు. ‘మూవీ తొలి అర గంట నిజంగానే బాలేదు. సౌండ్ ఇబ్బందికరంగా ఉంది. అది మినహాయిస్తే ఈ సినిమా అద్భుతం. సూర్య నటన, కెమెరా వర్క్ గొప్పగా ఉంది. నెగటివ్ రివ్యూస్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. రొటీన్ స్టోరీస్, అమ్మాయిల వెంట పడటం, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ను దాటి వారి మెదడు ఎదగలేదని అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు.

News November 17, 2024

‘మైసూర్ పాక్’ పేరెలా వచ్చిందో తెలుసా?

image

1902 నుంచి 1940 వరకు మైసూర్‌ను పాలించిన 24వ మహారాజు 4వ కృష్ణరాజ వడయార్ మంచి భోజనప్రియుడు. కాకాసుర మడప్ప అనే ప్రధాన వంటగాడు రాజుకు కొత్త రకం రుచి చూపిద్దామని చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు కలిపి ఓ స్వీట్ చేశాడు. దాని రుచి రాజుకు నచ్చడంతో పేరేంటని అడిగారు. పంచదార పాకంలో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి తన రాజ్యం పేరు వచ్చేలా ‘మైసూరు పాక’ అని చెప్పాడు. తర్వాతి కాలంలో అదే ‘మైసూర్ పాక్’గా మారింది.

News November 17, 2024

కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డుస్థాయిలో ధాన్యం: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని CM రేవంత్ తెలిపారు. 2024లో 66.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగైందని, 153 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందనే వార్తను ట్వీట్ చేశారు. ‘కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న BRS తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా రైతులు ఈ ఘనత సాధించారు’ అని తెలిపారు.

News November 17, 2024

కన్నడ నేర్చుకోవాల్సిందే: ZOHO CEO

image

బెంగళూరులో నివ‌సించే ఇత‌ర రాష్ట్రాల వారు క‌చ్చితంగా క‌న్న‌డ నేర్చుకోవాల‌ని ZOHO CEO శ్రీధర్ వేంబు వ్యాఖ్యానించారు. భాష నేర్చుకోక‌పోతే అది స్థానికత‌ను అగౌర‌వ‌ప‌ర‌చ‌డ‌మే అవుతుంద‌న్నారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. రోజూ వెయ్యి ప‌నులు చేయాల్సిన ప‌రిస్థితిలో ఏదైనా కొత్త‌గా నేర్చుకొనే విధానం ఆర్గానిక్‌గా ఉండాల‌ని ఒక‌రు, చుట్టూ 90% ఇతర రాష్ట్రాల వారే ఉంటే కొత్త భాష ఎలా సాధ్యమంటూ మరొకరు పేర్కొన్నారు.

News November 17, 2024

వృద్ధులు, వికలాంగులకే ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు’!

image

AP: ప్రజలు ఎక్కడి నుంచైనా తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తీసుకొచ్చిన ‘ఎనీవేర్’ విధానంపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. దీనిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ విధానాన్ని 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకోసం మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మేరకు అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదిస్తే వెంటనే అమల్లోకి రానున్నాయి.