News November 17, 2024

‘మట్కా’ సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే?

image

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. రూ.42కోట్లతో ఈ మూవీని రూపొందించగా, నెట్‌ఫ్లిక్స్ రూ.15కోట్లు చెల్లించినట్లు సమాచారం. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఈనెల 14 రిలీజైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

News November 17, 2024

నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబు దాడి

image

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబుల దాడి కలకలం రేపింది. రెండు బాంబులు ఆయన ఇంటి గార్డెన్‌లో పడ్డట్లు రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని వెల్లడించారు. దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా ఈ అటాక్ పని ఇరాన్‌దేనని భావిస్తున్నారు.

News November 17, 2024

డిసెంబర్‌లో హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి?

image

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన సంబంధం కీర్తికి నచ్చిందని, దీంతో డిసెంబర్‌లోనే వీరిద్దరికీ వివాహం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని పింక్‌విల్లా తెలిపింది. కాగా, పెళ్లి కొడుకు బంధువేనని, గోవాలో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో మ్యారేజ్ జరుగుతుందని వెల్లడించింది. దీనిపై కీర్తి టీమ్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.

News November 17, 2024

డయాబెటిస్.. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?

image

మధుమేహం ఉన్నవారు ఉదయం అల్పాహారం మానేయడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం & రాత్రి మాత్రమే భోజనం చేయడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. దీంతోపాటు అధిక HbA1C, ఇన్సులిన్ ప్రతిస్పందన బలహీనపడటం వంటివి జరుగుతాయన్నారు. కాబట్టి అల్పాహారం మానేయొద్దని సూచించారు. SHARE IT

News November 17, 2024

ఆధార్‌లో DOB మార్పులపై కీలక ప్రకటన

image

AP: ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీచేసే ధ్రువీకరణ పత్రాలనూ అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే సర్టిఫికెట్ల మాదిరే GOVT ఆస్పత్రులు ఇచ్చే క్యూఆర్ కోడ్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అన్ని జిల్లాల సిబ్బందికి సూచించింది.

News November 17, 2024

తెలంగాణ స్టేట్ పోలీస్ ఇకపై తెలంగాణ పోలీస్

image

TG: రాష్ట్ర పోలీస్ యూనిఫాంలో కీలక మార్పులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు యూనిఫాంలోని బ్యాడ్జీలో తెలంగాణ స్టేట్ పోలీస్(TSP) అనే అక్షరాలు ఉండేవి. ఇకపై తెలంగాణ పోలీస్(TGP)గా మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పోలీసులకు సంబంధించిన TSSP స్థానంలో TGSPతో పాటు TSPSకు బదులు TGPS అనే అక్షరాల బ్యాడ్జీలు వాడాలని ఆదేశించారు.

News November 17, 2024

అంచనాలను తలకిందులు చేసి.. ENGపై విండీస్ విజయం

image

ఇంగ్లండ్‌పై నాలుగో టీ20లో విండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది. టీ20ల్లో ఆ జట్టుకు ఇది రెండో అత్యధిక రన్ ఛేజ్. విండీస్ 2 ఓవర్లకు 5/0 స్కోర్ వద్ద విన్నింగ్ పర్సెంటేజ్ కేవలం 8.37 శాతమే ఉంది. విన్ లూయిస్(68), షై హోప్(54) విజృంభణతో అంచనాలను తలకిందులు చేసి భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. కాగా 5 టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1తో కైవసం చేసుకుంది.

News November 17, 2024

GET READY: సాయంత్రం 6.03 గంటలకు

image

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. బిహార్ పట్నాలో జరగనున్న ఈవెంట్‌లో సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. పుష్ప-1 బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో పుష్ప-2పై భారీ అంచనాలున్నాయి. మరి మీరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారా?

News November 17, 2024

TG SET ఫలితాలు విడుదల

image

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET-2024) ఫలితాలు విడుదలయ్యాయి. <>http://telanganaset.org/<<>> వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం 26,294 మంది పరీక్షలు రాయగా, 1884 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణత 7.17%గా నమోదైంది. క్వాలిఫై అయిన వారిలో 49.79%మంది మహిళలు, 50.21% మంది పురుష అభ్యర్థులున్నారు. త్వరలోనే వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

News November 17, 2024

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి కొమరిన్ తీరం వరకు ద్రోణి విస్తరించింది. అలాగే బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కోస్తా వైపు తూర్పుగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో చలి పెరుగుతోంది. నిన్న కళింగపట్నంలో 20.6డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.