India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: నవంబర్ 17, ఆదివారం
విదియ: రా.9.06 గంటలకు
రోహిణి: సా.5.22 గంటలకు
వర్జ్యం: ఉ.10.04-11.31 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.4.01-4.46 గంటల వరకు
రాహుకాలం: సా.4.30-6.30 గంటల వరకు
* సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
* సనాతన ధర్మాన్ని రక్షించేందుకే జనసేన, శివసేన: పవన్
* ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్
* రేవంత్ను బండి సంజయ్ కాపాడుతున్నారు: కేటీఆర్
* బైడెన్ లాగే మోదీకి మతిపోయింది: రాహుల్ గాంధీ
* సినీ నటి కస్తూరి అరెస్ట్
* హీరో ధనుష్పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు
* పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్లు
* మరోసారి తండ్రైన రోహిత్ శర్మ
ఇండియాలో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులున్నాయి. అయితే, వాటిలో సురక్షితమైనవేవో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్లు దేశంలో సురక్షితమైనవి. ఈ మూడింటిని ముఖ్యమైన డొమెస్టిక్ బ్యాంకులుగా RBI గుర్తించింది. మరి మీకు ఏ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంఛ్ రేపు పట్నాలో జరగనుంది. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటంతో వాటిని ఫినిష్ చేసేందుకు ఆయన హైదరాబాద్లోనే ఉంటారని సమాచారం. మరోవైపు రేపటి ఈవెంట్లో బిగ్ బాస్ ఫేమ్ అక్షర్ సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వచ్చే నెల 5న మూవీ రిలీజ్ కానుంది.
హార్మోన్ లోపం వల్ల కొందరు ట్రాన్స్గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆడపిల్లగా పుట్టి, లింగమార్పిడి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చాడనే విషయం మీకు తెలుసా? USకు చెందిన తామస్ బీటీ తన భాగస్వామి నాన్సీని వివాహం చేసుకునేందుకు లింగమార్పిడి చేసుకుంది. ఆ తర్వాత గర్భం దాల్చగా 2008 జూన్లో సహజ ప్రసవం జరిగింది. తాను పాలు ఇవ్వలేనని ఆయన చెప్పారు. 2009లో బీటీ మరో బిడ్డకు జన్మనిచ్చారు.
ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే BGT సిరీస్ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ జోస్యం చెప్పారు. కోహ్లీ, స్మిత్ వారి జట్లకు కీలకంగా మారతారని చెప్పారు. కమిన్స్, బుమ్రా బౌలింగ్ సిరీస్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా ఆస్ట్రేలియాలో ఆడిన చివరి రెండు సిరీస్లను భారత్ గెలుచుకోవడం గమనార్హం.
అందరూ అనుకుంటున్నట్లు హీరో ధనుష్ అంత మంచివాడు కాదని హీరోయిన్ నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అన్నారు. ఆయనకు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని చెప్పారు. ‘నయనతారకు లీగల్ నోటీసులు పంపడం దుర్మార్గం. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికీ తప్పే. అభిమానులు ఆయన అసలు ముఖం ఏంటో తెలుసుకోవాలి’ అని ఆయన ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.
AP: సీఎం చంద్రబాబును ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫోన్లో పరామర్శించారు. సీఎం సోదరుడి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు.
Infosys నారాయణ మూర్తి మరోసారి వార్తల్లో నిలిచారు. IAS, IPS లాంటి సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయడానికి UPSC పరీక్షల మీదే ఆధారపడకుండా మేనేజ్మెంట్ స్కూళ్ల నుంచి ఎంపిక చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. UPSCకి ఎంపికైన వారికి ముస్సోరీలో శిక్షణ ఇచ్చినట్టే వీరికీ వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. 1858 నుంచి అమలులో ఉన్న నియామక విధానాన్ని సంస్కరించాలని ప్రధాని మోదీని కోరారు.
ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి జరగాల్సిన BGT తొలి టెస్టుకు శుభ్మన్ గిల్ దూరమయ్యారు. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా క్యాచ్ పడుతుండగా అతడి వేలికి గాయమైంది. దీంతో తొలి టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చిన BCCI రెండో టెస్టు నాటికి కోలుకుంటారని భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.