India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్, అతని అనుచరులపై కేసు నమోదైంది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా, కోనసీమ జిల్లా మలికిపురం స్టేషన్లో కేసు నమోదైంది. మార్ఫింగ్పై ఫేస్బుక్ నుంచి వివరాలు కోరామని, స్పష్టత రాగానే చర్యలుంటాయని పోలీసులు చెప్పారు. రాజేశ్ మాట్లాడుతూ.. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారనన్నారు. ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెప్పారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్లు రూ.25 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. FIR ప్రకారం.. డిప్యూటీ SPగా పనిచేసి రిటైరైన జగదీశ్కు UP ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇప్పిస్తామని నమ్మబలికి కొంతమంది రూ.25 లక్షలు తీసుకున్నారు. పని అవ్వకపోవడంతో డబ్బు తిరిగివ్వమని అడగ్గా చంపేస్తామని బెదిరించారు. నిందితుల్ని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
AP: సెప్టెంబర్లో సంభవించిన వరదలతో విజయవాడ అతలాకుతలమైందని CM చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలిపారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర GSTపై తాత్కాలికంగా 1% సర్ఛార్జీని విధించే వెసులుబాటు కల్పించాలని కోరారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు ₹60వేల కోట్లకుపైగా వ్యయమవుతుందని, త్వరలోనే DPRను కేంద్రానికి పంపుతామని పేర్కొన్నారు.
TG: రాష్ట్రవ్యాప్తంగా 1.16 కోట్ల ఇళ్లకుగాను 51.24 లక్షల(44.1శాతం) నివాసాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సర్వేలో 87,807 మంది సిబ్బంది పాల్గొంటున్నారని, 8,788 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సర్వే తీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రజల అభ్యున్నతి కోసమే సర్వే చేస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవాలి’ అని సూచించారు.
✒ SAపై నాలుగో టీ20లో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా పలు రికార్డులను సొంతం చేసుకుంది.
✒ మెన్స్ T20Iలో 3 సార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టు.
✒ సంజూ-తిలక్ నమోదు చేసిన 210* భాగస్వామ్యం ఏ వికెట్కైనా భారత్ తరఫున ఇదే అత్యధికం.
✒ ICC ఫుల్ టైమ్ టీమ్స్లో ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు(సంజూ-109*, తిలక్-120*) సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
✒ ఒక సిరీస్లో 4 సెంచరీలు నమోదవడం ఇదే తొలిసారి.
బరోడా మహారాణి కోసం నెహ్రూ ఆర్డర్ చేసిన 1951 మోడల్ రోల్స్ రాయిస్ కారు ఓ కాపురంలో చిచ్చు రేపింది. ప్రస్తుతం దాని విలువ రూ.2.5కోట్లుగా ఉంది. అయితే తన తండ్రికి వారసత్వంగా వచ్చిన ఈ కారును కట్నంగా ఇవ్వాలని తన భర్త వేధిస్తున్నట్లు ఓ మహిళ గ్వాలియర్ కోర్టు, ఆపై సుప్రీంను ఆశ్రయించారు. తమది నిజమైన పెళ్లి కాదని, గ్రహదోషం కోసం తనను ఆమె పెళ్లి చేసుకున్నట్లు భర్త చెప్పారు. కట్నంగా కారు అడగలేదని తెలిపారు.
TG: KTR అరెస్ట్ని BJP అడ్డుకుంటోందన్న విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన KTR కేంద్ర మంత్రులెవరినీ కలవలేదని స్పష్టం చేశారు. గవర్నర్ ఏ ఫైల్పై సంతకం పెడుతున్నారనేది కేంద్రం పర్యవేక్షించదని వెల్లడించారు. మాజీ సీఎం KCR తరహాలోనే CM రేవంత్ రెడ్డి కూడా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అబద్ధపు, అరాచక పాలన కొనసాగిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల CMలు అక్కడ వేర్వేరుగా పర్యటించనున్నారు. చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వెళ్లి ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం10గంటలకు చంద్రాపూర్ వెళ్లే రేవంత్ నేడు, రేపు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారసభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కూడా 16, 17తేదీల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
TG: వివిధ శాఖల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలను TGPSC సిద్ధం చేసింది. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-3 ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని TGPSC సూచించింది.
దక్షిణాఫ్రికాపై నిన్న సాధించిన టీ20 సిరీస్ విజయం తనతో ఎప్పటికీ నిలిచిపోతుందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ గెలవడం అంత సులువు కాదని గుర్తుచేశారు. ‘సౌతాఫ్రికా పర్యటన ఎప్పుడైనా సవాలే. యువ జట్టుతో ఇక్కడికొచ్చి ఇలా గెలుపొందడం అద్భుతం. ఫలితం గురించి ఆలోచించకుండా ఆడాం’ అని తెలిపారు. భారత్ ఈ ఏడాది ఆడిన 26 టీ20ల్లో 24 మ్యాచుల్లో గెలవడం విశేషం.
Sorry, no posts matched your criteria.