India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైక్ టైసన్-జేక్ పాల్ బాక్సింగ్ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయిందంటూ నెట్టింట ఓ పోస్టు వైరల్ అవుతోంది. మొదట్లో టైసన్ ఆధిక్యం ఉంటుందని, నాలుగో రౌండ్ తర్వాత మెల్లగా నీరసించి ఓడిపోతారని.. జేక్ పాల్ విజయం సాధిస్తారని అందులో పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత రింగ్లోకి వచ్చిన బాక్సింగ్ దిగ్గజం అలా అవమానకరంగా ఓడిపోయేందుకు ఒప్పుకోరని, ఇది ఫేక్ పోస్టని టైసన్ ఫ్యాన్స్ ఆ పోస్టుపై కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన రివేంజ్ డ్రామా ‘మహారాజ’ ఈ నెల 29న చైనాలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ నిథిలన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 14న విడుదలై సంచలన విజయం సాధించింది. రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. నెట్ఫ్లిక్స్లోనూ రికార్డుస్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.
AP: సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు HYDకి బయల్దేరారు. మంత్రి లోకేశ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు.
ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్ను ప్రారంభించాలనేది తన కల అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంగీత పాఠశాల నా కల. ఆర్థికంగా వెనుకబడిన వారికి అందులో ఉచితంగా సంగీతం నేర్పిస్తాను. సంగీతం ఉన్నచోట నేరాలు తక్కువగా ఉంటాయి. మరో మూడేళ్లలో మన వద్దే నిర్మిస్తాను. స్థలం ఇవ్వమని కాకుండా ప్రభుత్వాలు సాయమేమైనా చేస్తాయేమో అడుగుతాను’ అని పేర్కొన్నారు.
TG: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ కేకలు వేశాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని, విమానంలో తనిఖీలు చేశారు. బాంబు లేదని తేల్చారు.
SAపై నాలుగో T20లో సెంచరీ చేసిన అనంతరం సంజూ శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇన్నింగ్స్ బ్రేక్లో మాట్లాడుతూ ‘శ్వాస వేగంగా తీసుకుంటున్నా. మాట్లాడటం కష్టంగా ఉంది. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ను ఎదుర్కొన్నా. ఎంతో కష్టపడి ఇంత వరకు వచ్చా. ఈ సిరీస్లో ఓ సెంచరీ తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యా. దీంతో ఎన్నో విషయాలు నా తలలో తిరిగాయి. ఈ ఇన్నింగ్స్లో అభిషేక్, తిలక్ నాకు హెల్ప్ చేశారు’ అని పేర్కొన్నారు.
సౌతాఫ్రికాపై నిన్న జరిగిన టీ20తో సహా సిరీస్లో 2సెంచరీలు చేసిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నారు. ఇది తనకు గొప్ప అనుభూతి అని, గతేడాది ఇక్కడ తొలి బంతికే అవుట్ అయినట్లు చెప్పారు. సౌతాఫ్రికాలోని ఛాలెంజింగ్ కండీషన్లలో 2సెంచరీలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. మరోవైపు, ఓ టీ20 సిరీస్లో MOTM, MOTS అవార్డులు అందుకున్న యంగెస్ట్ క్రికెటర్గా నిలిచారు.
భారత్లో దొంగతనానికి గురై వివిధ మార్గాల ద్వారా తమ దేశానికి చేరిన 1,400కు పైగా కళాఖండాలు, వస్తువులను US తిరిగిచ్చింది. వీటి విలువ $10 మిలియన్లు ఉంటుందని తెలిపింది. ఇందులో ఖగోళ నర్తకి ఇసుక రాయి శిల్పం అరుదైనదని, ఇది ఇండియా నుంచి లండన్కు, అక్కడి నుంచి US మ్యూజియంకు చేరిందని వెల్లడించింది. అక్రమ రవాణాదారుల నెట్వర్క్పై ఫోకస్ చేశామని, దీని వెనుక తమిళనాడుకు చెందిన సుభాష్ కపూర్ హస్తం ఉందని పేర్కొంది.
టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు. సడన్గా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అంతా సర్ప్రైజ్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్లో ‘ఉండిపో’, ఆచార్య సినిమాలో ‘నీలాంబరి’ పాటలు పాడారు. వేర్వేరుగా ఎన్నో హిట్ సాంగ్స్తో ప్రేక్షకులను అలరించారు.
UPలోని మిర్జాపుర్లో BJP MP వినోద్ కుమార్ బింద్ కార్యాలయంలో ఓ కమ్యూనిటీ సమావేశం, విందు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది హాజరయ్యారు. విందుకు వచ్చిన అతిథుల్లో ఒక వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా కేవలం గ్రేవీ వేయడంతో రచ్చ మొదలైంది. తనకు ముక్కలు వేయలేదని వాగ్వాదానికి దిగిన సదరు అతిథి వడ్డించే వ్యక్తి చెంపపై కొట్టడం, తోపులాట జరిగి కొట్టుకున్నారు. ఆ తర్వాత కొందరు కవర్లలో మటన్ను నింపుకొని వెళ్లిపోయారు.
Sorry, no posts matched your criteria.