India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫుడ్ ఐటమ్స్ డెలివరీ విషయంలో ఈకామర్స్ సంస్థలకు FSSAI కీలక ఆదేశాలిచ్చింది. డెలివరీ సమయానికి ఫుడ్ ఐటమ్స్ నిల్వకాలం మరో 30% ఉండేలా చూసుకోవాలని చెప్పింది. లేదా ఎక్స్పైరీ డేట్ కనీసం మరో 45రోజులుండాలని పేర్కొంది. లేబుల్స్పై లేని సమాచారాన్ని ప్రకటనల్లో చూపించవద్దని పేర్కొంది. ఆహార, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చెయ్యాలని, తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని చెప్పింది.
జనాభాను నియంత్రించిన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని CM రేవంత్ అన్నారు. ‘దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశానికి ఒక రూపాయి పోతే కేంద్రం నుంచి 40 పైసలు మాత్రమే వస్తుంది. బిహార్ ఒక రూపాయి ఇస్తే రూ.7.06 వస్తుంది. 2025 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు 800 ఎంపీ సీట్లు వస్తాయి. సౌత్లో 123కి తగ్గిపోతాయి. దీంతో కేంద్రంలో సౌత్ పాత్ర తగ్గిపోతుంది’ అని IE ప్రోగ్రాంలో చెప్పారు.
సుధీర్ బాబు హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 15 నుంచి జీ5లోకి వస్తుందని అనౌన్స్ చేసినా.. ఇవాళ్టి నుంచే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సాయాజీ షిండే, సుధీర్ బాబు తండ్రీకొడుకులుగా నటించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్ అంతగా రాబట్టలేకపోయింది.
ముంబై క్రికెటర్ ఆయుష్ మాత్రేను వేలంలో దక్కించుకుని ఓపెనర్గా ఆడించాలని CSK భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్ చూసి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంప్రెస్ అయ్యారని, ట్రయల్స్కు కూడా పిలిపించారని సమాచారం. ఇందుకు MCAను CSK అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఆయుష్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారని టాక్. 17 ఏళ్ల ఆయుష్ 5 మ్యాచుల్లోనే 321 పరుగులు బాదారు.
TG: తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం. సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును BRSకు ఆపాదించే కుట్ర జరుగుతోంది. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
బీటెక్ సీట్లలో AP, TG ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 14.90 లక్షల సీట్లు ఉండగా ఇరు రాష్ట్రాల్లో కలిపి 3.10 లక్షల సీట్లు ఉండటం విశేషం. ఏపీలో 1.83 లక్షల సీట్లు, తెలంగాణలో 1.45 లక్షల సీట్లు ఉన్నాయి. 3.08 లక్షల సీట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం సీట్లలో ఈ 3 దక్షిణాది రాష్ట్రాల్లోనే 42.80 శాతం సీట్లు ఉన్నాయి. AICTE పరిమితి ఎత్తివేయడంతో దక్షిణాదిలో వచ్చే ఏడాది సీట్లు మరింత పెరగొచ్చు.
2016 IPL ఫైనల్లో SRHతో సునాయాసంగా గెలిచే స్థితి నుంచి RCB ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ విషయంలో తాను, విరాట్ నేటికీ చింతిస్తుంటామని క్రికెటర్ KL రాహుల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా ఇద్దరిలో ఒకరు ఇంకొంచెం సేపు క్రీజులో ఉంటే ఫలితం వేరేలా ఉండేది. టేబుల్ అట్టడుగు నుంచి వరుసగా 7మ్యాచులు గెలిచి ఫైనల్స్కు వచ్చాం. బెంగళూరులో ఫైనల్. గెలిచి ఉంటే అదో కల నిజమైన సందర్భం అయ్యుండేది’ అని పేర్కొన్నారు.
TG: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 పరీక్షల్లో ఆలిండియా 131వ ర్యాంకు సాధించిన సాయి చైతన్య జాదవ్ను రాష్ట్ర అదనపు డీజీపీ మహేశ్ భగవత్ అభినందించారు. ‘సాయి చైతన్య పట్ల గర్వంగా ఉంది. 2022లో సివిల్స్ పరీక్షలకి, ఈ ఏడాది IFS ఇంటర్వ్యూకి అతడిని గైడ్ చేశాను. నేను ఆదిలాబాద్ SPగా ఉన్న సమయంలో సాయి తండ్రి గోవిందరావు నాతో కలిసి పనిచేశారు. ఆయన కుమారుడు ఇలా IFSకి సెలక్ట్ అవడం చాలా సంతోషం’ అని పేర్కొన్నారు.
TG: కొడంగల్ BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు <<14590479>>ఆరోపణలు<<>> ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న BRS నేత సురేశ్ ఆరోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. మట్కా సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. నిన్న విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న వరుణ్ అండ్ కో అనంతరం తిరుమలకు వెళ్లారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని వరుణ్, మట్కాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు.
Sorry, no posts matched your criteria.