News February 1, 2025

మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్?

image

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ బెంగళూరుకు చెందిన ఓ మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల తన కుటుంబసభ్యులకు ఆమెను పరిచయం చేశారని, వీరి పెళ్లికి కూడా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే 59 ఏళ్ల ఆమిర్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కుతారని సమాచారం. కాగా గతంలో రీనా దత్తా, కిరణ్ రావును ఆయన పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. ఆమిర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

News February 1, 2025

దూబే బదులు రాణా కరెక్టేనా? నిబంధనలేమంటున్నాయంటే…

image

నిన్న IND-ENG మ్యాచ్‌లో శివమ్ దూబే గాయపడటంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణా బరిలోకి దిగారు. ఇది అన్యాయమని ఇంగ్లండ్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనల ప్రకారం.. ఓ ఆటగాడు కంకషన్‌కు గురైనప్పుడు రీప్లేస్‌మెంట్‌గా అతడిలాంటి ఆటగాడినే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిన్న రాణా పూర్తి బౌలర్ కాగా దూబే అప్పుడప్పుడూ బౌలింగ్ చేసే బ్యాటర్ కావడంతో దుమారానికి దారి తీసింది.

News February 1, 2025

రాష్ట్రపతి భవన్‌లో తొలి వివాహం

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్ పీఎస్ఓ, CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా, మరో CRPF అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్‌ల పెళ్లి జరగనుంది. ఈ గౌరవప్రదమైన వేదికపై ఒక అధికారి వివాహాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. భవన్‌లోని మదర్ థెరెసా క్రౌన్ కాంప్లెక్స్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. వీరి పెళ్లికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక అనుమతి మంజూరు చేశారు.

News February 1, 2025

బీజేపీకి మంత్రి సీతక్క కౌంటర్

image

సోనియా గాంధీ రాష్ట్రపతిని అవమానించారన్న BJP <<15320224>>విమర్శలపై<<>> మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ‘అసలు సమస్యలను దారి మళ్లించడం, కృత్రిమ వివాదాలను సృష్టించడమే BJP ఎజెండా. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా సోనియా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రామమందిరం, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతిని పక్కన పెట్టిన వారికి ఆదివాసీల గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ట్వీట్ చేశారు.

News February 1, 2025

చరిత్ర సృష్టించనున్న నిర్మల

image

2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. ఇక మొత్తంగా ఎక్కువ బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ పీఎం మొరార్జీ దేశాయ్(10సార్లు) పేరిట ఉంది. ప్రస్తుత కేంద్ర సర్కారుకు ఇంకో నాలుగేళ్ల గడువు ఉండటంతో ఆ రికార్డునూ నిర్మల దాటేందుకు మున్ముందు అవకాశం ఉంది.

News February 1, 2025

వారికి టెన్త్ విద్యార్హతతో ప్రమోషన్లు

image

TG: అంగన్‌వాడీల్లో ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 2022, AUG 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారు 10th అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల సర్వీస్‌తో పాటు 45 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇది వర్తించనుంది.

News February 1, 2025

అవును.. చైనా ల్యాబ్ నుంచే కొవిడ్ వచ్చింది: అమెరికా

image

చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటికి వచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని అమెరికా అధ్యక్ష కార్యాలయ కార్యదర్శి కరోలిన్ లెవిట్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ‘కొవిడ్ వైరస్ చైనా ల్యాబ్ నుంచి వచ్చిందని చాలా ఏళ్ల క్రితమే ట్రంప్ అన్నారు. అప్పట్లో అందరూ ఆయన్ను వెక్కిరించారు. కానీ ఆయన చెప్పింది వాస్తవం. దానికి సంబంధించిన సాక్ష్యాలు బైడెన్ హయాంలోనే లభించాయి. గత సర్కారు ఎందుకో వాటిని బయటపెట్టలేదు’ అని పేర్కొన్నారు.

News February 1, 2025

పన్ను వసూళ్లలో నంబర్‌వన్‌గా తెలంగాణ

image

TG: పన్ను వసూళ్లలో సొంత పన్నుల సొమ్ములు సగానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో సొంత పన్ను వసూళ్లు 88 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే జల్ జీవన్ మిషన్‌ను వంద శాతం అమలు చేస్తున్న 8 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నట్లు తెలిపింది. ఐటీ సేవలతో దేశంలో కర్ణాటక, తెలంగాణ ముందున్నాయని పేర్కొంది.

News February 1, 2025

‘స్వచ్ఛంద మరణం’ హక్కును అమలు చేయనున్న కర్ణాటక

image

కారుణ్య మరణాలపై SC ఆదేశాల అమలుకు KA సిద్ధమైంది. ఎప్పటికీ నయమవ్వని, బాధను భరించలేక, నరకం అనుభవిస్తూ లైఫ్ సపోర్టుతో ఆస్పత్రిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న వారికి గౌరవంగా మరణించే హక్కును అమలు చేయనుంది. మొదట ముగ్గురు డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షిస్తారు. తర్వాత Govt నియమించిన డాక్టర్, మరో ముగ్గురు డాక్టర్ల బృందం సమీక్షించి రిపోర్టును కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే ఇంజెక్షన్లు ఇస్తారు.

News February 1, 2025

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ‘పుష్ప 2’

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. టాప్-10 మూవీస్‌లో ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీ గత నెల 30న ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. కాగా ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ.1,900 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.