News November 10, 2024

వచ్చే నెలలో ఎర్రచందనం వేలం: పవన్ కళ్యాణ్

image

AP: వచ్చే నెలలో ఎర్ర చందనం వేలం వేస్తామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని చెప్పారు. గుంటూరులో పవన్ మీడియాతో మాట్లాడారు. ‘స్మగ్లర్ల బారి నుంచి అడవులను రక్షిస్తాం. ఈ విషయంలో అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. అటవీ శాఖకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలాగే రాష్ట్రంలో మహిళల సంరక్షణే మా మొదటి బాధ్యత. విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

News November 10, 2024

APPLY: భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

కోల్ ఇండియా లిమిటెడ్‌(CIL)లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&T, సిస్టమ్ విభాగాల్లో 60% మార్కులతో బీటెక్ పాసైన వారు అర్హులు. వయసు 30-09-2024 నాటికి 30ఏళ్లు మించకూడదు. గేట్-2024 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం ₹50,000-1,60,000 ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: www.coalindia.in

News November 10, 2024

మా జిల్లాను అభివృద్ధి చేసుకోనివ్వండి: సీఎం రేవంత్

image

పాలమూరు జిల్లాకు నిధుల వరద పారిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘నా జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. KCRను పార్లమెంట్‌కు పంపింది ఇక్కడి ప్రజలే. కానీ ఇక్కడి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తుంటే మేం అడ్డుపడలేదు. KCR పాలనలో పాలమూరుకు పరిశ్రమలు రాలేదు. త్వరలో మక్తల్-NRPT ప్రాజెక్టు చేపడతాం’ అని అమ్మాపురం సభలో ప్రకటించారు.

News November 10, 2024

షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా?

image

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్‌తో ఆమెకు సయోధ్య ఉండగా యూనస్‌కు విరోధం ఉంది. పైగా అతడిని చీఫ్ అడ్వైజర్‌గా ఎంపికచేసింది డెమోక్రాట్లు, డీప్‌స్టేట్ అన్న ఆరోపణలూ ఉన్నాయి. మొన్న బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్‌కు రావడం, యూనస్‌పై ICCలో ఫిర్యాదు, మైనార్టీలు, అవామీ లీగ్-విద్యార్థి ఉద్యమకారుల మధ్య పోటీ నిరసనలతో సందిగ్ధం నెలకొంది.

News November 10, 2024

బంగ్లాలో నరమేధం: యూనస్‌పై ICCలో ఫిర్యాదు

image

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC)లో అవామీ లీగ్ ఫిర్యాదు చేసింది. ఆయనతో పాటు క్యాబినెట్ మెంబర్స్, ADA స్టూడెంట్ లీడర్లు సహా 62 మంది పేర్లను చేర్చింది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక తమ పార్టీ వర్కర్స్, హిందువులు సహా మైనార్టీలపై నరమేధం జరిగిందని పేర్కొంది. సాక్ష్యాలుగా 800 పేజీల డాక్యుమెంట్‌ను సబ్మిట్ చేసింది. మరో 15000 ఫిర్యాదులకు సిద్ధమవుతోంది.

News November 10, 2024

ఆస్ట్రేలియా చెత్త రికార్డు

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. 53 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.

News November 10, 2024

కెనడాలో టీనేజర్‌కు బర్డ్ ఫ్లూ!

image

కెనడాలో ఓ టీనేజర్‌కు బర్డ్ ఫ్లూ సోకడం కలకలం రేపింది. రోగితో కాంటాక్ట్‌లో ఉన్న వారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. కాగా ఈ బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ, డైరీ ఫామ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల USలో పలువురు కార్మికులకు సోకింది. అయితే ఈ ఫ్లూ ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుందనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

News November 10, 2024

జస్ట్ 3 ఇయర్స్! కొత్తగా లక్ష మంది కోటీశ్వరులు

image

దేశంలో రూ.కోటికి పైగా ట్యాక్సబుల్ ఇన్‌కం దాటినవాళ్ల సంఖ్య 2.20 లక్షలు దాటేసింది. పదేళ్లలోనే వీరు 5 రెట్లు పెరిగారు. గత మూడేళ్లలోనే ఈ జాబితాలో లక్షమంది చేరడం విశేషం. కొవిడ్ తర్వాత పరిస్థితులు మారాయి. చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బు ఆర్జిస్తున్నారు. భారీగా డివిడెండ్స్ పొందుతున్నారు. ఇక ప్రతిభావంతులకు కంపెనీలు ఎంత ప్యాకేజీ ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు. మరోవైపు ITలో సంస్కరణలు రావడం ఇందుకు ఓ కారణం.

News November 10, 2024

కురుమూర్తిని దర్శించుకున్న సీఎం రేవంత్

image

TG: మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురంలో జరుగుతున్న కురుమూర్తి స్వామి జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. రూ.110 కోట్ల అంచనా వ్యయంతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగా ఓ సీఎం కురుమూర్తిని దర్శించుకోవడం ఇదే తొలిసారి. దాదాపు నెలరోజులపాటు జాతర వైభవంగా జరగనుంది.

News November 10, 2024

హౌతీలపై అమెరికా భీకర దాడులు

image

యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్‌పై అమెరికా విరుచుకుపడింది. హౌతీలకు చెందిన పలు ఆయుధ డిపోలను యూఎస్ యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్లు పెంటగాన్ తెలిపింది. అత్యాధునిక ఆయుధాలతో తాము పేల్చేసినట్లు వెల్లడించింది. కాగా ట్రంప్ అధ్యక్షుడయ్యాక హౌతీలపై ఇదే తొలి దాడి. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొల్పేందుకు F-15 ఫైటర్ జెట్‌తోపాటు బాంబర్స్, ట్యాంకర్, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డెస్ట్రాయర్స్‌ను పంపింది.