India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెలరేగారు. తొలి ఓవర్లోనే 3 ఫోర్లు బాది లంక బౌలర్లకు హెచ్చరికలు పంపారు. ఎడాపెడా బౌండరీలు బాది 40 బంతుల్లోనే 57(10 ఫోర్లు, ఒక సిక్స్) రన్స్ చేసి ఔట్ అయ్యారు. దీంతో వన్డే, టీ20, టెస్ట్.. ఇలా ఫార్మాట్ ఏదైనా హెడ్ తగ్గడని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అటు ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 145 రన్స్.

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై Dy.CM పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవులను ధ్వంసం చేసి భూములు ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ సూచించారు.

TG: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వచ్చే నెల 7న ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కంటే కాంగ్రెస్ హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని చెప్పారు.

KTR <<15289834>>విమర్శలపై<<>> మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహించారు. KTR, హరీశ్ తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. KCR అల్లుడిగా, కొడుకుగా వాళ్లిద్దరూ నాయకులు అయ్యారని వ్యాఖ్యానించారు. గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. తెలంగాణ కోసం, అణగారిన వర్గాల కోసం గద్దర్ పోరాటం చేశారని అన్నారు. బండి సంజయ్ కంటే ముందు నుంచే గద్దర్ ఉద్యమంలో ఉన్నారని పేర్కొన్నారు.

ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకొనేందుకు స్థానిక పాలకబృందం పనిచేస్తోందని తెలిపారు. యూపీ సీఎం యోగితో నిరంతరం మాట్లాడుతున్నానని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.

అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లను తీసుకురావడంలో బైడెన్ విఫలమయ్యారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ‘2024 జూన్లో వెళ్లిన వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురాలేకపోయారు. వెంటనే వారిని సురక్షితంగా తీసుకురావాలని స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ను ఆదేశిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. మస్క్ దీనికి సానుకూలంగా స్పందించారు.

బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.920 పెరిగి రూ.82,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.850 పెరిగి రూ.75,950గా నమోదైంది. అటు కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

భారత స్టాక్మార్కెట్లలో రివర్సల్కు టైమొచ్చిందని మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు పేర్కొంది. చాలా అంశాలు పటిష్ఠ రికవరీని సూచిస్తున్నాయంది. ‘గ్రోత్ తగ్గడం మార్కెట్లపై ప్రభావం చూపింది. త్వరలోనే గ్రోత్ పెరుగుతుందని మా విశ్వాసం. ఫోర్స్ఫుల్ సెల్లింగ్ తగ్గింది. పడిపోతున్న ట్రేడింగ్ వాల్యూమ్స్ దీనినే సూచిస్తున్నాయి. ప్రైవేటు ఫైనాన్షియల్ కంపెనీల షేర్లు బెస్ట్ రిస్క్ రివార్డు ఆఫర్ చేస్తున్నాయి’ అని పేర్కొంది.

అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వల్లే మూడో టీ20లో ఓడిపోయామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయనీయలేదని, అందుకే ఆయన వరల్డ్ బెస్ట్ స్పిన్నర్గా మారారని కితాబిచ్చారు. కాగా రెండో టీ20లో అద్భుతంగా ఆడి భారత్ను గెలిపించిన తిలక్ వర్మను నిన్నటి మ్యాచ్లో రషీద్ క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ను వారి వైపు తిప్పారు. చివరికి భారత్ 26 రన్స్ తేడాతో ఓడిపోయింది.

సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో షరీఫుల్ ఫకీర్ దోషి అని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలన్నీ ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దాడికి సంబంధించిన వివరాలు అతడే చెప్పాడని తెలిపారు. సైఫ్ ఇంట్లో సేకరించిన వేలి ముద్రలు నిందితుడితో మ్యాచ్ అవ్వలేదన్న వార్తలపై స్పందించారు. CID నుంచి తమకు ఇంకా ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ రాలేదని, దాడి ఘటనలో కచ్చితంగా ఫకీర్ ప్రమేయం ఉందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.