News November 10, 2024

సీఎంవోను ముట్టడిస్తాం: వాలంటీర్ల హెచ్చరిక

image

AP: ఎన్నికల హామీ మేరకు తమను కొనసాగించడంతోపాటు రూ.10వేలకు జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ అనుబంధ AIYF హెచ్చరించింది. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు లేరని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు.

News November 10, 2024

ఎండీ ఆయుర్వేద ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: ఎండీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో మొదటి దశ ప్రవేశాలకు కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇవాళ్టి నుంచి రేపు సా.4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. అలాగే మెడికల్ పీజీ, డిప్లొమా కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/

News November 10, 2024

BREAKING: నటుడు ఢిల్లీ గణేశ్ మృతి

image

ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన తన ఇంట్లోనే అర్ధరాత్రి మృతి చెందారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా గణేశ్ 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్2, కాంచన3, అభిమన్యుడు వంటి అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనూ అలరించారు.

News November 10, 2024

సాల్ట్ సెంచరీ.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ గెలుపు

image

5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20ఓవర్లలో 182/9 స్కోర్ చేసింది. చేధనకు దిగిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 54 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 రన్స్‌తో మెరుపు శతకం బాదారు. జాకబ్ బెథెల్(58)రాణించారు.

News November 10, 2024

వైట్‌హౌస్‌కు దూరంగా ట్రంప్ కుమార్తె, అల్లుడు!

image

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక, కుష్నర్ వైట్‌హౌస్‌లో పని చేశారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు అడ్మినిస్ట్రేషన్‌లో పాలుపంచుకునేలా కనిపించడం లేదు. వాళ్లిద్దరూ ట్రంప్ రాజకీయ ప్రచారాల్లోనూ పాల్గొనలేదు.

News November 10, 2024

దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 10, 2024

రాష్ట్రంలో 243 కులాలు: ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన నేపథ్యంలో కులాలకు కోడ్‌లను కేటాయించింది. కులం, మతం లేదన్న వారికీ ఓ కోడ్‌ను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా కోడ్‌లతో డేటా సేకరిస్తోంది. భూసమస్యలపైనా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది.

News November 10, 2024

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సమావేశాల తొలిరోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ వెంటనే సభను స్పీకర్ వాయిదా వేస్తారు. ఈ సమావేశాలు 11న ప్రారంభమై 11రోజులు కొనసాగే అవకాశం ఉంది.

News November 10, 2024

నేడు సౌతాఫ్రికాతో భారత్ రెండో టీ20

image

భారత్, సౌతాఫ్రికా మధ్య 4 టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు జరగనుంది. సెయింట్ పార్క్ వేదికగా రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా 61రన్స్ తేడాతో సఫారీ జట్టును మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2-0తో సిరీస్‌పై పట్టుబిగించాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. అటు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్‌ బరిలో నిలవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.

News November 10, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌ రద్దు

image

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి Nov 11న జరగాల్సిన ఒక కీలక ఈవెంట్‌ను ICC రద్దు చేసింది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఇదే ఈవెంట్ రద్దుకు కారణం. ఈ ఈవెంట్‌లో టోర్నీలో పాల్గొనే జట్ల జెండాలను ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. అయితే పాకిస్థాన్‌కు వెళ్లడం ససేమిరా కుదరదంటోంది భారత్.