News November 1, 2025

OCT జీఎస్టీ వసూళ్లు ₹1.96L కోట్లు

image

ఈ ఏడాది అక్టోబర్‌లో ₹1.96L కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్(₹1.87L కోట్లు)తో పోలిస్తే 4.6 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. రిఫండ్ల తర్వాత నెట్ కలెక్షన్లు ₹1.69L కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇక 2024 ఏప్రిల్-అక్టోబర్ మధ్య ₹12.74L కోట్లు వసూలవ్వగా, ఈ ఏడాది అదే సమయంలో 9 శాతం వృద్ధితో ₹13.89L కోట్లు ఖజానాలో చేరినట్లు వివరించింది.

News November 1, 2025

తొక్కిసలాట ఘటనపై అధికారుల వివరణ

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. ఇవాళ ఆలయానికి 15వేల మంది వచ్చారని వెల్లడించారు. ఘటనాస్థలిలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో ఇద్దరు మృతిచెందినట్లు చెప్పారు. ఘటనలో 13 మందికి గాయాలయ్యాయని, వారికి పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

News November 1, 2025

ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

image

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.

News November 1, 2025

ఎల్లుండి నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పు

image

TG: మెట్రో రైలు సమయాల్లో మార్పు చోటు చేసుకోనుంది. తొలి ట్రైన్ ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి మొదలవుతాయని L&T హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు తొలి ట్రైన్ ఉదయం 6గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11:45గంటలకు మొదలైన సంగతి తెలిసిందే.

News November 1, 2025

ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

image

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్‌తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.

News November 1, 2025

కాశీబుగ్గ ఘటన.. మృతులు వీరే

image

AP: 1.ఏడూరి చిన్నమ్మి(50)-రామేశ్వరం(టెక్కలి), 2.రాపాక విజయ(48)-పిట్టలసరి(టెక్కలి), 3.మురిపింటి నీలమ్మ(60)-దుక్కవానిపేట-పల్లిఊరు(వజ్రపుకొత్తూరు), 4.దువ్వు రాజేశ్వరి(60)-బెలుపతియా(మందస), 5.చిన్ని యశోదమ్మ(56)-శివరాంపురం(నందిగం), 6.రూప-గుడ్డిభద్ర(మందస), 7.లోట్ల నిఖిల్(13)-బెంకిలి(సోంపేట), 8.డొక్కర అమ్ముదమ్మ-పలాస, 9.బోర బృందావతి(62)- మందస. మరో వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందగా వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

చంద్రబాబువి పిట్టలదొర మాటలు: జగన్

image

AP: తుఫాను నిర్వహణపై CM చంద్రబాబువి పిట్టలదొర మాటలని YCP చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. ‘వైపరీత్యాల వేళ రైతులకు శ్రీరామరక్షగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం బెటర్ మేనేజ్‌మెంట్ అవుతుందా? మొంథా తుఫాను వల్ల నష్టపోయిన బీమాలేని రైతులకు దిక్కెవరు? మీ 18నెలల కాలంలో 16సార్లు వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే రూ.600CR ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్కపైసా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు’ అని ఆరోపించారు.

News November 1, 2025

ఈ కోళ్లు రోజూ గుడ్లు పెడతాయని తెలుసా?

image

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 1, 2025

మహిళలకు నివాస హక్కు

image

ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఫ్రమ్‌ డొమెస్టిక్‌ వయొలెన్స్‌, 2005 ప్రకారం, ఒక మహిళ తన వైవాహిక లేదా ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కును కలిగి ఉంది. ఆమె సొంతం కాకపోయినా లేదా ఆమె పేరు రెంటల్‌ అగ్రిమెంట్‌లో లేకపోయినా ఆమె అక్కడ నివసించే హక్కు ఉంటుంది. ఆమె భర్త లేదా అత్తమామలు ఆమెను చట్టబద్ధంగా వెళ్ళగొట్టలేరు.

News November 1, 2025

ఈ వృక్షాన్ని పూజిస్తే.. కుబేరుడి అనుగ్రహం

image

పవిత్ర ప్రబోధిని ఏకాదశి రోజున కదంబ వృక్షాన్ని పూజిస్తే విష్ణువు కటాక్షం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ దేవతా వృక్షం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆయన ఈ చెట్టు కిందే వేణువు వాయించేవాడని పురాణాల వాక్కు. అందుకే ఈ చెట్టుకు ప్రభోధిని ఏకాదశి రోజున పూజ చేయాలని చెబుతారు. పసుపు, పువ్వులు సమర్పించి భక్తితో పూజిస్తే అదృష్టంతో పాటు కుబేరుడి అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.