India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హైదరాబాద్కు మరో రెండు ఐటీ పార్కులు రానున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న IT హబ్గా HYDను మరింత తీర్చిదిద్దేలా హైటెక్ సిటీలా మరో రెండు కొత్త ఐటీ పార్కులను డెవలప్ చేస్తామన్నారు. సరైన లోకేషన్ల కోసం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, అపరిమిత అవకాశాలతో ఈ ఐటీ పార్కులు హైదరాబాద్కు మైలురాయిగా నిలుస్తాయన్నారు.

రాజ్కోట్లో జరుగుతున్న మూడో T20లో ఇంగ్లండ్ టీమ్ఇండియా ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ENG 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ డకెట్(51) అర్ధసెంచరీ చేశారు. ఒకానొక దశలో ఇంగ్లండ్ 140 పరుగులే అందుకోవడం కష్టమనుకున్న సమయంలో లివింగ్ స్టోన్ (43) బిష్ణోయ్ ఓవర్లో మూడు సిక్సులు కొట్టి 19రన్స్ రాబట్టారు. వరుణ్ 5, హార్దిక్ 2, బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

తాను కుంభమేళాకు వెళ్లానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ కావడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తప్పుడు ప్రచారం చేసి పవిత్ర పూజలను కలుషితం చేయడమే పిరికి వాళ్ల పని అని దుయ్యబట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మిగతాది కోర్టులో చూసుకుందామని రాసుకొచ్చారు.

జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. జనవరి 31 నుంచి మే వరకు భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. FEB-2,3,7,13,14,15,18,19,20,21,23,25, MARలో-1,2,6,7,12, APRలో 14,16,18,19,20,21, 25,29,30, MAYలో 1,5,6,8,15,17,18, జూన్లో 1,2,4,7 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో చాలా జంటలు ఏకమయ్యే అవకాశం ఉంది.

TG: రిపబ్లిక్ డే రోజున హుస్సేన్ సాగర్లో బోట్లు దగ్ధమైన ఘటనలో గల్లంతైన అజయ్ మృతదేహం లభించింది. రెండు రోజుల గాలింపు తర్వాత డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. అజయ్ అచూకీ తెలియడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అంతకుముందు ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి మరణించాడు.

AP: రాష్ట్ర ప్రజలకు వైసీపీ కీలక విజ్ఞప్తి చేసింది. కూటమి ఫైల్స్ పేరుతో ఇవాళ రాత్రి 9 గంటలకు ఓ వీడియోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. బయటకు మాట్లాడలేని వారికి తాము ఓ స్వరంగా ఉంటామని పేర్కొంటూ #YSRCPSecondCampaign, #YSRCPForThePeople, #VoiceOfTheVoiceless హ్యాష్ట్యాగ్లను జత చేసింది.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ చిత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హిందీలో రణ్బీర్ కపూర్ ఇస్తారని తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే ‘బాద్ షా’ సినిమాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

AP: స్కూళ్లలో ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా పాటించాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. బ్యాగ్ లేకుండానే ఆరోజు స్కూలు జరిగేలా కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలన్నారు. టీచర్లకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రిలీజ్ చేస్తామని చెప్పారు. GO 117 ఉపసంహరణపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని తెలిపారు. టీచర్ల బదిలీ చట్టంపైనా అభిప్రాయాలు సేకరిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

U19 ఉమెన్స్ వరల్డ్ కప్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన భారత ప్లేయర్ త్రిషకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. భద్రాచలంకు చెందిన త్రిష భారత్ విజయంలో కీలక పాత్ర పోషించడం గర్వకారణమని సీఎం ట్వీట్ చేశారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు సంకల్పించామని పేర్కొన్నారు.

TG: హనుమకొండ జిల్లా గోపాల్పూర్లో దారుణం జరిగింది. భరత్ అనే యువకుడిపై ఓ యువతి(17) తండ్రి దాడి చేసి గొంతు కోశాడు. యువకుడు ఆ యువతితో కలిసి ఇంట్లో ఉండగా చూసిన ఆమె తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. దీన్ని అవమానంగా భావించిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో యువతిని కలిసేందుకు భరత్ వెళ్లినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.