India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన కుమారుడు అగస్త్య కోసమే తానింకా ఇండియాలోనే ఉంటున్నట్లు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ తెలిపారు. అగస్త్యను వదిలి సెర్బియా వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ‘హార్దిక్, నేను విడిపోయినా అగస్త్య కోసం కుటుంబంగానే ఉంటున్నాం. అతడు మా ఇద్దరి ప్రేమ పొందాలనుకుంటున్నాడు. అగస్త్య నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఒక తల్లికి తనకొడుకు సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
TG: రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోకుండా CM, మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఉత్తమ్ సొంత జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జరగవు. బిల్లులు రాక పంచాయతీ ఆఫీస్ తాకట్టు పెడుతున్నా భట్టి పట్టించుకోరు. మద్దతు ధర లేక పత్తి రైతులు కన్నీళ్లు పెడుతున్నా సీతక్క కనికరించరు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా రేవంత్ నిద్ర వీడరు. ఇదేనా మీరు చెప్పిన మార్పు?’ అని ఫైరయ్యారు.
AP: వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై కేసుల నమోదుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసే కందిపప్పు కేజీకి బదులు 780 గ్రాములుందని పోస్టు పెట్టినందుకు 352(2) సెక్షన్ కింద వైసీపీ ప్రతినిధి బాబుల్రెడ్డిపై విచిత్ర కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వంలో కేసుకు కాదేదీ అనర్హం. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉంటుందా శాడిస్ట్ చంద్రబాబు?’ అని Xలో ప్రశ్నించింది.
ఏపీలో నాలుగు రూట్లలో సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ – శ్రీశైలం సీ ప్లేన్ సర్వీసుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా దీనిని నడుపుతామని పేర్కొన్నారు. మరో 3-4 నెలల్లో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాగా ఇందులో 14 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు.
సమాజంలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని హీరోయిన్ సమంత చెప్పారు. సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని, చిన్న రోల్స్కు దూరంగా ఉంటానని తెలిపారు. యాడ్స్ విషయంలోనూ చాలా కచ్చితంగా ఉంటానని ఓ ఈవెంట్లో వెల్లడించారు. ‘సిటాడెల్: హనీబన్నీ’ కోసం చాలా కష్టపడ్డానని పేర్కొన్నారు. కాగా <<14525111>>ఐటమ్ సాంగ్స్<<>> చేయబోనని ఆమె ఇటీవల ప్రకటించారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, అరెస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
దమ్ముంటే రాహుల్ గాంధీతో హిందుత్వ నేతలు వీర సావర్కర్, బాల్ఠాక్రేను పొగిడించాలని ఇండియా కూటమి నేతలకు PM మోదీ సవాల్ విసిరారు. వారు దేశానికి చేసిన సేవలపై మాట్లాడించాలన్నారు. సావర్కర్ తమకు స్ఫూర్తి అని, మరాఠీ చరిత్ర, సంస్కృతిని విశ్వసిస్తామని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ గౌరవించదన్నారు. ఎన్నికల వేళ సావర్కర్ను విమర్శించొద్దని కాంగ్రెస్ యువరాజుకు MVA సీనియర్ ఒకరు సలహా ఇచ్చినట్టు వివరించారు.
హెడ్ కోచ్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు హెడ్ కోచ్లను నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ ఓడిపోతే టెస్టులకు, టీ20, వన్డేలకు వేర్వేరుగా కోచ్లను నియమించాలని భావిస్తున్నట్లు టాక్. కాగా భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు వైట్ బాల్, రెడ్ బాల్ జట్లకు వేర్వేరు కోచ్లను BCCI నియమించలేదు.
పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని అర్థం చేసుకోవడం ముఖ్యమని, ఇందుకు సహజీవనం తనకు చాలా ఉపయోగపడిందని హీరో విక్రాంత్ మాస్సే చెప్పారు. అయితే తాను ఈ కాన్సెప్ట్ను ప్రచారం చేయట్లేదని, దీని గురించి మాట్లాడటానికీ భయమేస్తోందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ప్రేమ ముఖ్యం. నేను, నా భార్య పెళ్లికి ముందు డేటింగ్తో అర్థం చేసుకున్నాం. ఇది అందరికీ పనిచేస్తుందని చెప్పలేను’ అని పేర్కొన్నారు.
US సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ డొనాల్డ్ ట్రంప్ భద్రతను మరింత పెంచింది. ఫ్లోరిడాలోని ఆయన నివాసం వద్ద రోబో డాగ్స్ను మోహరించింది. వాటిపై ‘DO NOT PET’ అని వార్నింగ్ రాసుంది. రిమోట్తో ఆపరేట్ చేసే ఈ రోబోల్లో సర్వైలెన్స్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు ఉంటాయి. కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ సైతం చేపట్టగలవని సమాచారం. ట్రంప్పై 2 సార్లు హత్యాయత్నం జరగడం, ఇంకా ముప్పు ఉండటంతో ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.