News November 11, 2025

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది.
* వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
* కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది.
* అన్నం మెతుకులు విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి.
* చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.

News November 11, 2025

పుట్టగొడుగులు, కూరగాయలతో ఏటా రూ.7.50 కోట్ల వ్యాపారం

image

కూరగాయలు, ఆర్గానిక్ విధానంలో పుట్టగొడుగుల పెంపకంతో నెలకు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఆగ్రాకు చెందిన అన్నదమ్ములు ఆయుష్, రిషబ్ గుప్తా. వీరు ఆగ్రాలో 2021లో కూరగాయల సాగు, 2022లో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. నేడు నెలకు 40 టన్నుల పుట్టగొడుగులు, 45 టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. వీరి వార్షిక టర్నోవర్ రూ.7.5 కోట్లు. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 11, 2025

మల్లోజుల, తక్కళ్లపల్లి రాజకీయ ద్రోహులు: అభయ్

image

TG: ఇటీవల లొంగిపోయిన సీనియర్ మావోలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావును ‘రాజకీయ ద్రోహులు’గా పేర్కొంటూ మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. వీరిద్దరూ MH, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారని, వారికి మావోయిస్టు పంథాను తప్పుబట్టే హక్కులేదని మండిపడ్డారు. దివంగత మావోయిస్టు నేత నంబాల కేశవరావు ఆయుధాలు విడిచిపెట్టాలని ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు.

News November 11, 2025

కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

image

కరోనా లాక్‌డౌన్‌ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

News November 11, 2025

ఇతిహాసాలు క్విజ్ – 63

image

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడిని గురువైన పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 11, 2025

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు.. అప్లై చేశారా?

image

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్‌ల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.100. ST,SC, దివ్యాంగులకు మినహాయింపు కలదు. https://ner.indianrailways.gov.in/

News November 11, 2025

పోలింగ్ ప్రారంభం

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ స్టేషన్ల వద్ద 2,060 మంది పోలీసులు, CRPF సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అటు బిహార్‌లో చివరి విడతగా 122 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.

News November 11, 2025

అమరావతిలో MSK క్రికెట్ అకాడమీ

image

AP: అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి BCCI మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ భూమిపూజ నిర్వహించారు. పిచుకలపాలెం రెవెన్యూ పరిధిలో 12 ఎకరాల్లో ఈ అకాడమీ నిర్మిస్తున్నారు. ఇందులో క్రికెట్ గ్రౌండ్, ఇండోర్, అవుట్ డోర్ ట్రైనింగ్ జోన్స్, 400 మంది ప్లేయర్ల సామర్థ్యంతో ట్రైనింగ్ సెంటర్, 1000 మంది ఉండేలా స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్స్, జిమ్, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలు ఉండనున్నాయి.

News November 11, 2025

డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

image

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.

News November 11, 2025

‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటే అర్థం తెలుసా?

image

ప్రతి మంత్రాన్ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని ముగిస్తుంటాం. అంటే సమస్త దుఃఖాల నుంచి విముక్తి ప్రసాదించమని ఈశ్వరుడిని వేడుకోవడం. ఇందులో మూడు సార్లు ‘శాంతిః’ అని పలకడం ద్వారా మానవులను పీడించే త్రివిధ తాపాల నుంచి ఉపశమనం కోరడం. ఈ మూడు రకాల బాధలను దాటినప్పుడే మనకు మోక్షం, శాంతి లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ☞ మరి ఆ మూడు రకాల తాపాలేంటి?, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.