India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ శతకం బాది రికార్డుల మోత మోగించారు. ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్గా సంజూ (10) నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (10) రికార్డును ఆయన సమం చేశారు. అలాగే టీ20ల్లో రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అందుకున్న తొలి భారత వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించారు. కాగా ఈ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం చెలరేగింది. నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ చెలరేగింది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ సిబ్బందిని ఏపీ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని అంటూ వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
TG: సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజలకు తలెత్తే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని Dy.CM భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సర్వేపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష చేశారు. ‘కలెక్టర్లు ఎన్యూమరేటర్లతో నిత్యం మాట్లాడాలి. మంత్రులు, MLAలకు సమాచారం ఇవ్వాలి. దేశం మొత్తం తెలంగాణను గమనిస్తోంది. అందరూ చూపించే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకండి’ అని కోరారు.
AP: మంత్రి నారా లోకేశ్పై అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 18న లోకేశ్పై వారం వారం పేకాట క్లబ్ ద్వారా లోకేశ్కు కమీషన్లు అందుతున్నాయని ఎక్స్లో చంద్రశేఖర్ పోస్టు చేశారు. దీనిపై పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారు.
AP: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2 ఏళ్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. కొండపల్లి, మూలపాడుతో పాటు రాజధాని ప్రాంతాల్లో కూడా స్థలాన్వేషణ చేస్తోంది. దీని బాధ్యతను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నికి అప్పగించింది. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.
లేఆఫ్స్ వేసే ప్రాఫిటబుల్ కంపెనీలను ఉద్యోగులెలా నమ్ముతారని ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రశ్నించారు. ‘ఆ కంపెనీ వద్ద $1BNS క్యాష్ ఉంది. వార్షిక ఆదాయం కన్నా ఇది 1.5 రెట్లు ఎక్కువ. 20% గ్రోత్రేటుతో లాభాల్ని ఆర్జిస్తోంది. అయినా $400 మిలియన్లతో షేర్లు బయ్బ్యాక్ చేసి, 12-13% ఉద్యోగుల్ని తొలగించి వారి విశ్వాసాన్ని ఆశించడం దురాశే’ అని అన్నారు. రీసెంటుగా 660 మందిపై వేటువేసిన ప్రెష్వర్క్స్ను విమర్శించారు.
తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నానని NC MLA కైజర్ జంషైద్ వెల్లడించారు. J&K అసెంబ్లీలో మాట్లాడుతూ ‘అప్పుడు నాతో సహా 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో చేరిన వ్యక్తి గురించి తెలియదనడంతో కొట్టారు. దీంతో తాను మిలిటెంట్ అవ్వాలనుకుంటున్నానని సీనియర్ ఆఫీసర్తో చెప్పా. ఆయన తన సహోద్యోగిని మందలించడంతో వ్యవస్థపై నమ్మకం వచ్చింది’ అని పేర్కొన్నారు.
TG: రెండు రోజులుగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన అధికారులు నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. వివిధ కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రస్తుతం ఎక్కడ ఉంటే అక్కడే వివారాలు నమోదు చేయించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్లో అడ్రస్తో సంబంధం లేదని పేర్కొంది. అయితే సిబ్బంది వచ్చినప్పుడు ఆధార్, రేషన్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ పాసుపుస్తకం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.
TG: కులగణనలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది 2 రోజులుగా రాష్ట్రంలోని ఇళ్లకు సర్వే స్టిక్కర్లు అంటించారు. ఇవాళ్టి నుంచి ఆ ఇళ్లకు వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. అయితే HYDతో సహా పలు పట్టణాలు, గ్రామాల్లో కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదు. దీంతో తమ వివరాలను నమోదు చేస్తారా? లేదా? అని ప్రజలు అయోమయంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరి మీ ఇంటికి స్టిక్కర్ అంటించారా? కామెంట్ చేయండి.
హమాస్ను బహిష్కరించాలని ఖతర్ నిర్ణయించింది. ఎన్నిసార్లు చర్చలు జరిపినా బందీల విడుదల, కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హమాస్ను బహిష్కరించాలని అమెరికా చేసిన ప్రతిపాదనలను ఈ మేరకు ఖతర్ అంగీకరించింది. తమ దేశం నుంచి వెళ్లిపోవాలని హమాస్ నాయకులకు స్పష్టం చేసింది. దీనిపై హమాస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.