India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: BRSలో గెలిచి కాంగ్రెస్లో చేరిన MLAలపై అనర్హత అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఫిర్యాదు చేసిన 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని BRS వాదనలు వినిపించింది. దీనిపై విచారణను ధర్మాసనం ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా ఫిరాయింపు MLAపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి న్యాయస్థానంలో అప్పీల్ చేశారు.
AP: అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత HYDలోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకు కేటాయించడంతో AP కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. నిబంధనల మేరకు 10 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ ESI కార్పొరేషన్కు అప్పగిస్తే రాష్ట్రంపై భారం ఉండదు. తప్పదనుకుంటే ఒప్పంద వ్యయంలో 1/8 వంతు భరించాలి.
TG: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాన్నీ రెండో శనివారమైనా ఇవాళ పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. బదులుగా నవంబర్ 9న రెండో శనివారం సెలవు రద్దు చేసింది. దీంతో ఇవాళ ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయి.
TG: ఇది మూసీ పరీవాహక ప్రాంత ప్రజల దుస్థితి. కళ్లెదుటే నది వెళ్తున్నా దాహం తీర్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. నిన్న యాదాద్రి(D) వలిగొండ(మ) సంగెంలో మూసీ నీటిని CM రేవంత్ బాటిల్లో తీసుకుని, మంచినీటితో పోల్చారు. మూసీ నీరు చాలా మురికిగా ఉంది. అటు ఇక్కడి కల్లు అడిగేవారే కరువయ్యారని, మూసీ మట్టితో చేసే మట్టికుండలు ఎవరూ కొనడం లేదని, నదిని ప్రక్షాళన చేయాలని పలువురు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచేందుకు అనుమతించాలని ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. ఈ మేరకు DGP ద్వారకా తిరుమలరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు గతంలో సానుకూలంగా స్పందించారని తెలిపారు. పోలీసులకు కూడా ఆదేశాలివ్వాలని కోరారు.
టీ20ల్లో ఫామ్ కొనసాగిస్తూ వరుసగా 2 సెంచరీలు చేయడం ఆనందంగా ఉందని సంజూ శాంసన్ అన్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత మాట్లాడిన ఆయన ‘ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూశా. చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తే నేను ఎమోషనల్ అవుతానేమో. కానీ ఈ ఆనంద క్షణాలను ఎంతో ఎంజాయ్ చేస్తున్నా’ అని తెలిపారు. ఈ మ్యాచ్లో 50 బంతుల్లోనే 107 రన్స్ చేసిన సంజూకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.
AP: రాష్ట్రంలో కొనసాగుతున్న YCP సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులపై హైకోర్టు మండిపడింది. చట్ట నిబంధనలు పాటించకుంటే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని, పౌరుల స్వేచ్ఛను తేలికగా తీసుకోవద్దని పోలీసులను హెచ్చరించింది. పలు బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. రెండు పోలీస్ స్టేషన్లలోని సీసీ ఫుటేజీని స్థానిక మేజిస్ట్రేట్లకు అందజేయాలని ఆదేశించింది.
TG: సన్నాలకు బోనస్గా క్వింటాకు ప్రకటించిన రూ.500 చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిన్నటి వరకు 46 వేల టన్నులకు పైగా సన్నధాన్యం కొనుగోళ్లు జరిగాయి. క్వింటాకు ₹500 చొప్పున రైతులకు ₹2445 కోట్ల బోనస్ను చెల్లించాలని అధికారులు అంచనా వేశారు. దీంతో తొలివిడతగా ప్రభుత్వం రూ.1000 కోట్లను విడుదల చేయగా, తొలుత మద్దతు ధర, ఆ తర్వాత బోనస్ చెల్లింపులు చేస్తారు. ఇవాళ లేదా రేపటి నుంచి చెల్లించే అవకాశం ఉంది.
TG: యాసంగి సీజన్ కోసం రైతులకు నేటి నుంచి శనగ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. క్వింటాలు ధర రూ.9,000 ఉండగా, ప్రభుత్వం రూ.300 రాయితీ ఇస్తోంది. జేజీ 11, జాకీ రకాల విత్తనాలను 20వేల క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉంచారు. కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048, జేజీఎల్ 24423 రకాలు 50వేల క్వింటాళ్ల వరకు విక్రయించనున్నారు. కరోనాకు ముందు 33% రాయితీతో విక్రయించగా, ఇప్పుడు 3.3% సబ్సిడీనే ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు.
AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. పశ్చిమ దిశగా కదులుతూ ఇది తమిళనాడు/ శ్రీలంక తీరాలకు సమీపంగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో APలోని ప్రకాశం, NLR, TPTY, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం నుంచి 3 రోజులు భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. సముద్రం అలజడిగా ఉంటుందని, వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.