News May 7, 2025

టీడీపీ జెండా అంటే అంత చిన్న చూపా?: వర్మ

image

AP: రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా <<16215262>>పోలీస్<<>> అధికారి ఉన్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్నచూపా అని నిలదీశారు. అయినా క్రమశిక్షణతో భరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ పవన్ పిఠాపురం పర్యటనలో వర్మ ఎస్పీ బిందు మాధవ్ వద్ద అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఉద్దేశించే వర్మ ట్వీట్ చేసినట్లు సమాచారం.

News May 7, 2025

ప్రభాస్ నార్మల్ యాక్టర్: మంచు విష్ణు

image

స్టార్ హీరో ప్రభాస్ తన దృష్టిలో నార్మల్ యాక్టర్ అని, లెజెండ్ కాదని నటుడు మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశారు. అతను లెజెండ్ కావడానికి టైం పడుతుందన్నారు. ఇదే సమయంలో మోహన్‌లాల్ లెజెండరీ యాక్టర్ అని, కాలం ఆయనకు ఆ హోదా తెచ్చిందన్నారు. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు ఆయన్ను తప్పకుండా లెజెండ్‌ను చేస్తాయనే నమ్మకం తనకుందని విష్ణు చెప్పారు. ‘కన్నప్ప’లో ప్రభాస్, విష్ణు నటించిన విషయం తెలిసిందే.

News May 7, 2025

ఖాతాదారులకు EPFO గుడ్‌న్యూస్

image

ఖాతాదారులు తమ PF అకౌంట్లను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుగా EPFO కీలక నిర్ణయం తీసుకుంది. రివాంప్డ్ 13 సాఫ్ట్‌వేర్ ఫంక్షనాలిటీని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. అంటే గతంలో లాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే రెండు కంపెనీలూ ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. పాత కంపెనీ ఆమోదం తెలపగానే ఆటోమేటిక్‌గా ప్రస్తుత కంపెనీ ఖాతాకు బదిలీ అవుతుందని స్పష్టం చేసింది.

News May 7, 2025

మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నారు: KTR

image

TG: సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్- రాహుల్ ట్యాక్స్ వసూలవుతోందని, ఢిల్లీకి డబ్బుల సంచులు వెళ్తున్నాయని ఆరోపించారు. 100 శాతం రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.40వేల కోట్లు అప్పు చేస్తే, రేవంత్ ఒక్క ఏడాదిలోనే రూ.1.60లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు.

News May 7, 2025

హామీలు అమలు చేయకుండా మాపై విమర్శలా?: KTR

image

TG: కాంగ్రెస్ హయాంలో ఆరోపణలు తప్ప ఆధారాలున్నాయా? అని KTR ప్రశ్నించారు. ‘17నెలల్లో కొత్తగా ఒక్క ప్రాజెక్టైనా కట్టారా? హామీలు అమలు చేయకుండా మాపై విమర్శలా? TGకు విఘాతం కల్గితే స్పందించే వ్యక్తి KCR. అవసరమైతే రాష్ట్రం కోసం ఆయన గర్జించేవారు. కేంద్రం పంపిన ఒక దూత <<16212293>>NDSA<<>>. NDSA నిపుణులు ఇప్పటి వరకూ ప్రాజెక్టును చూడలేదు. బిహార్‌లో బ్రిడ్జిలు కూలుతుంటే NDSA ఏమైంది’ అని KTR ప్రశ్నించారు.

News May 7, 2025

మెగాస్టార్‌కు విలన్‌గా కార్తికేయ?

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించనున్నారని, విలన్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అలాగే అతిథి పాత్రలో దగ్గుబాటి వెంకటేశ్ కూడా మెరుస్తారని టాక్. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

News May 7, 2025

ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు పోనివ్వం: కేంద్రమంత్రి

image

సింధు నదీజలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్థాన్‌కు పోనివ్వమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటిల్ స్పష్టం చేశారు. అమిత్‌షాతో జరిగిన భేటీలో రోడ్ మ్యాప్ తయారు చేసినట్లు తెలిపారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సింధు జలాలను మళ్లించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే సింధు, దాని ఉపనదులపై ఉన్న డ్యాం గేట్లను మూసివేశారు.

News May 7, 2025

రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు

image

AP: ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. అలాగే రాష్ట్రంలో 169 ప్రాంతాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా గాజులపల్లె, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేపు రాష్ట్రంలోని 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.

News May 7, 2025

ఉగ్రమూక వేటలో భారత్‌కు మద్దతు: తులసీ గబ్బార్డ్

image

పహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఖండించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రధాని మోదీ, భారతీయులకు అమెరికా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 26 మంది హిందువులను చంపిన టెర్రరిస్టులను వేటాడేందుకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని వెల్లడించారు.

News May 7, 2025

రాయలసీమ అభివృద్ధిపై PMతో చంద్రబాబు ప్రత్యేక చర్చ

image

AP: PM మోదీతో ఢిల్లీలో గంటన్నర పాటు భేటీ అయిన CM చంద్రబాబు ప్రత్యేకంగా రాయలసీమ అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది. సీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరినట్లు సమాచారం. అలాగే, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడర్ల ఏర్పాటుకూ సహకారం కోరినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇదే సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలనూ ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు.