India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు దోబూచులాడుతున్నాయి. <<19036694>>ఇవాళ ఉదయం<<>> రూ.20వేలు తగ్గి రూ.2.8లక్షలకు చేరుకున్న కేజీ సిల్వర్ ధర సాయంత్రానికి రూ.20వేలు పెరిగింది. దీంతో యథాతథంగా రూ.3 లక్షలకు చేరింది. కాగా కొన్ని వారాలుగా విపరీతంగా పెరుగుతూ వచ్చిన ధరలు గత 4 రోజుల్లోనే రూ.1.25 లక్షలు తగ్గిన విషయం తెలిసిందే. అటు <<19038369>>బంగారం<<>> ధరల్లోనూ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత్లో సామాన్యుల జీవితాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల టెక్స్టైల్స్, ఇంజినీరింగ్, జెమ్స్-జువెలరీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చమురు, గ్యాస్ దిగుమతులు చౌకగా మారితే ఇంధన ధరలు తగ్గొచ్చు. రూపాయి బలపడి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. వ్యవసాయ రంగంపై క్లారిటీ రావాల్సి ఉంది.

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ను అమ్మాయిలు తమ 12-45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గర్భం దాల్చకముందే దీన్ని తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. 9- 17 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.

<

TG: దేశంలో సుస్థిరమైన అభివృద్ధి కావాలనే ఆకాంక్షకు రెక్కలు తొడిగేలా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ‘TG పురోగతికి వీలుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. PM ఆవాస్ యోజన-అర్బన్ కింద ఇంటికి ₹లక్షన్నర చొప్పున 1.30L ఇళ్లకు ₹2,190Cr, రూరల్ పథకం కింద ఇంటికి ₹72K చొప్పున 3 లక్షల ఇళ్లకు ₹2,160Cr కేంద్రం ఇవ్వనుంది. 5,000KM NHలను నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2072 పాయింట్ల లాభంతో 83,739కు చేరగా నిఫ్టీ 639 పాయింట్లు ఎగసి 25,727 వద్ద సెటిల్ అయింది. భారత్-US ట్రేడ్ డీల్పై ట్రంప్ ప్రకటన, US టారిఫ్స్ ఇప్పుడు పొరుగు దేశాలకంటే భారత్పై తక్కువ ఉండటం, రూపీ విలువ మెరుగవడం, ఆసియా మార్కెట్ల జోరు, ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లలో జోష్ నింపాయి. SENSEX 30లో అదానీపోర్ట్స్ టాప్ గెయినర్గా నిలిచింది.

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో ఉన్న దీన్ని దుండగులు కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2021లో భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన 426 కిలోల బరువున్న బాపూజీ స్టాచ్యూను అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు.

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.

వివాహితలు నిత్య దీపారాధనకై రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. పాపటలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. స్త్రీల పాపటలో గంగాదేవి ఉంటుందని, అక్కడ కుంకుమ ధరిస్తే పవిత్రతను ఇస్తుందని నమ్మకం. అయితే వ్రతాలు, పూజలు, దీక్షల సమయంలో మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే దీపారాధన చేస్తే ఎవరికీ ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.

AP: TTD నెయ్యి కల్తీలో తెర వెనుక ఎవరున్నారో తేల్చాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో సిట్ ఛార్జ్షీట్పై మంత్రులు చర్చించారు. కల్తీ నెయ్యి ఎక్కడ తయారైంది? దాన్ని ఎలా గుర్తించారు? దీనిలో భాగస్వాములెవరు? ఇలా విచారణలో వెలుగు చూసిన వాస్తవాలన్నిటినీ ప్రజలకు వివరించాల్సిన అవసరముందని మంత్రులు అభిప్రాయపడ్డారు. SCకి సిట్ అందించిన నివేదిక బహిర్గతం అయ్యాక మరోసారి చర్చించనున్నారు.
Sorry, no posts matched your criteria.