India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్ పాలనపై BRS నేత KTR ఫైరయ్యారు. CAG తాజా నివేదిక ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నారు. ‘6 గ్యారంటీలకు బదులు ఫెయిల్డ్ ఎకానమీని ఇచ్చారు. కాంగ్రెస్ చేతకానితనంతో రాష్ట్ర ఎకానమీ పతనమవుతోంది. తొలి క్వార్టర్లోనే రూ.10,583 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఒక్క రోడ్డు వేయకుండా, ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా, స్టూడెంట్స్కు సరైన తిండి పెట్టకుండానే రూ.20,266 కోట్ల అప్పు చేశారు’ అని Xలో దుయ్యబట్టారు.
లోకేశ్ కనగరాజ్ సినిమాలు అనగానే యాక్షన్తో పాటు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రజినీకాంత్ హీరోగా తెరకెక్కించిన ‘కూలీ’లోనూ ఇలాంటి సర్ప్రైజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రజినీ యంగ్ రోల్లో ‘అమరన్’ ఫేమ్ శివకార్తీకేయన్ కనిపిస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. లోకీ స్టైల్లో మాస్ రోల్లో ఈ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ఈ నెల 14న సినిమా విడుదలయ్యాకే దీనిపై క్లారిటీ రానుంది.
గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. దీంతో హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.760 తగ్గి రూ.1,02,280కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.700 పతనమై రూ.93,750 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
ఎయిర్ ఇండియా విమానంలో ఎదురైన భీతావహ అనుభవంపై INC MP KC వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ‘నేను, ఇతర MPలు త్రివేండ్రం నుంచి ఢిల్లీ వెళ్తుండగా సాంకేతిక సమస్యతో పైలట్ విమానాన్ని చెన్నైకి మళ్లించారు. 2hrs గాల్లోనే ఎయిర్పోర్ట్ చుట్టూ తిరిగాం. ల్యాండింగ్ సమయంలో రన్వేపై మరో ఫ్లైట్ ఉండటం చూసి పైలట్ రెప్పపాటులో అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత లక్పై ఆధారపడకూడదు. దీనిపై విచారణ చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు.
AP: మెగా డీఎస్సీ-2025 ఫలితాలపై ఇవాళ లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశముంది. ఇటీవల ఫైనల్ కీ విడుదల కాగా.. అందులో తప్పులున్నాయని పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిపై విద్యాశాఖ అధికారులు నిపుణుల కమిటీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ నెల 25లోపు ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది.
IAF లెజెండ్ DK పరుల్కర్(రిటైర్డ్) <<17366693>>కన్నుమూసిన<<>> విషయం తెలిసిందే. ఆయన తెగువపై ‘ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్’ అని చిత్రం కూడా వచ్చింది. 1971 ఇండో-పాక్ యుద్ధం టైంలో పరుల్కర్ను పాక్ సైన్యం బంధించి రావల్పిండిలో ఖైదీగా ఉంచింది. శత్రుదేశంలో ఉన్నా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి తనతోపాటు మరో ఇద్దరు పైలట్స్నూ తప్పించారు. దేశానికి చేసిన సేవలకు గానూ ఆయన వాయుసేన, విశిష్ఠ్ సేవా మెడల్స్ అందుకున్నారు.
ISRO అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు అమెరికా దానం చేసిన చిన్న రాకెట్తోనే 1963లో ఇస్రో అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించింది. ఇప్పుడు అదే దేశం స్పేస్ ప్రోగ్రామ్స్కు మన సాయం కోరుతోంది. ప్రపంచంలోనే ఖరీదైన శాటిలైట్ NISARను డెవలప్ చేయడానికి, లాంచ్ చేయడానికి NASA ఇస్రోపైనే ఆధారపడింది. ఇప్పుడు మరో భారీ <<17366188>>శాటిలైట్<<>> లాంచ్ బాధ్యతనూ ISROకే అప్పగించింది. తక్కువ ఖర్చు, సక్సెస్ రేటే ఇందుకు కారణం.
AP: ప్రాజెక్ట్ 17ఏలో తయారైన ఉదయగిరి(F35), హిమగిరి(F34) ఈ నెల 26న విశాఖలో జలప్రవేశం చేయనున్నాయి. వైజాగ్ నుంచి రెండు ప్రధాన యుద్ధ నౌకలు జలాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారని నేవీ అధికారులు తెలిపారు. ఉదయగిరిని ముంబైకి చెందిన MDL, హిమగిరిని కోల్కతాకు చెందిన GRSE రూపొందించాయి. వీటి రాకతో నౌకాదళం మరింత బలోపేతం కానుంది. ఉదయగిరి నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ DK పరుల్కర్(రిటైర్డ్) ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు IAF వెల్లడించింది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో ప్రత్యర్థులు ఆయన విమానంపై కాల్పులు జరిపారు. ఫ్లైట్ వదిలేసి ప్రాణాలు కాపాడుకోమని ఉన్నతాధికారులు చెప్పారు. కానీ, ధైర్యంగా విమానాన్ని తిరిగి బేస్కు చేర్చారు. 1971 ఇండో-పాక్ వార్ టైంలో యుద్ధ ఖైదీగా ఉన్న ఆయన.. అదే సమయంలో వారి కళ్లుగప్పి తప్పించుకుని భారత్ చేరుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎయిర్ ఇండియా ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ తీసుకొచ్చింది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి టికెట్ ధరలు రూ.1,279, విదేశాలకు సంబంధించి రూ.4,279 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. చెక్ ఇన్ బ్యాగేజీకి రూ.200 అదనంగా చెల్లించాలని వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 15వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయంది. ఈ నెల 19 నుంచి 2026 మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.