News October 30, 2025

US కీలక నిర్ణయం.. ఇండియన్స్‌కు భారీ నష్టం!

image

ఎంప్లాయిమెంట్ ఆటోమేటిక్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తూ US నిర్ణయం తీసుకుంది. గతంలో వర్క్ పర్మిట్ రెన్యూవల్‌కు అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నా 540 రోజులు వర్క్ చేసే వీలుండేది. ఇప్పుడు గడువు ముగిసేలోగా రెన్యూవల్ కాకపోతే మైగ్రెంట్స్ వర్క్ పర్మిట్ ఆథరైజేషన్ కోల్పోతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ స్పౌజెస్(H4), H1Bs వీసా, STEM వర్క్ ఎక్స్‌టెన్షన్స్‌పై ఉన్న విద్యార్థులు, ఇండియన్ మైగ్రెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంది.

News October 30, 2025

PPPపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ

image

AP: రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా హాస్పిటల్స్‌ను PPP విధానంలో నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. ‘ప్రారంభ దశలోనే ఉన్న టెండర్ ప్రక్రియను ఆపలేం. ప్రభుత్వం పిలవగానే ఇన్వెస్టర్స్ డబ్బు సంచులతో పరిగెత్తుకురారు కదా’ అని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సమయమిస్తూ.. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

News October 30, 2025

ఇవి తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడినిస్తాయి

image

☛ టమాటలో బాక్టీరియా ఎండుతెగులు, ఆకుముడత వైరస్ తెగులు తట్టుకొనే రకాలు: అర్కా అనన్య, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్ ☛ వంగలో బాక్టీరియా ఎండు తెగులును తట్టుకునేవి: అర్కా ఆనంద్, అర్కా నిధి, అర్కా కేశవ ☛ బెండలో వైరస్‌ను తట్టుకునేవి: అర్కా అనామికా, అర్కా అభయ్, పర్బానీ కాంతి
☛ మిరపలో వైరస్ తెగుళ్లను అర్కా మేఘన, వైరస్, బూడిద తెగుళ్లను అర్కా హరిత తట్టుకుంటుంది. ☛ వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 30, 2025

బంధాలకు మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌ ముప్పు

image

నలభైఏళ్లు దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.

News October 30, 2025

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

image

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం 7 క్యూరేటర్-B ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ/బీఈ/బీటెక్/MS/ఎంటెక్/పీహెచ్‌డీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsm.gov.in/

News October 30, 2025

పశువులకు మేలు చేసే సూపర్ నేపియర్ గడ్డి

image

పచ్చి గడ్డిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.

News October 30, 2025

ఇతిహాసాలు క్విజ్ – 51

image

1. బ్రహ్మ ఆవలింత నుంచి పుట్టిన వానరుడు ఎవరు?
2. ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఇచ్చిన గురుదక్షిణ ఏంటి?
3. కృష్ణుడి భార్య అయిన రుక్మిణికి తండ్రి ఎవరు?
4. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుని నుదుటి నుంచి జన్మించిన వీరుడు ఎవరు?
5. గరుత్మంతుడి తల్లి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 30, 2025

తొలి మ్యాచులో 69కే ఆలౌట్.. చివరికి

image

ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అద్భుతమైన ఆటతో ఫైనల్ చేరింది. నిన్న సెమీస్‌లో ఇంగ్లండ్‌ను 125రన్స్‌తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే అదే SA జట్టు టోర్నీ తొలి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి మూటగట్టుకోవడం గమనార్హం. ఆ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన SA కేవలం 69 రన్స్‌కే ఆలౌట్ కాగా ENG 10 వికెట్లతో గెలిచింది. ఇప్పుడు సెమీస్‌లో అదే జట్టుపై నెగ్గిన SA టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

News October 30, 2025

500 గిగావాట్ల విద్యుదుత్పత్తి.. భారత్ రికార్డ్

image

దేశంలోని అన్ని వనరుల నుంచి కలిపి విద్యుదుత్పత్తి తొలిసారి 500 గిగావాట్లను దాటింది. ఇది సరికొత్త రికార్డని కేంద్రం తెలిపింది. 2014 మార్చి 31 నాటికి 249 గిగావాట్ల ఉత్పత్తి ఉండగా ఈ ఏడాది SEP 30 నాటికి రెట్టింపు ఉత్పత్తి జరిగినట్లు పేర్కొంది. ఇందులో జల, అణు, సౌర, పవన విద్యుత్ వాటా 256 గిగావాట్లు, శిలాజ వనరుల వాటా 244.80 గిగావాట్లుగా ఉందని వెల్లడించింది.