News November 8, 2024

ఆ రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ

image

AP: చిలకలూరిపేట, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి విడదల రజిని, తాడికొండకు వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)ను నియమించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

News November 8, 2024

‘పుష్ప-2’ ఐటమ్ సాంగ్ ఫొటో లీక్?

image

‘పుష్ప-2’ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. ప్రస్తుతం ఐటం సాంగ్ చిత్రీకరిస్తుండగా దానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సెట్‌లో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల స్టెప్పులేస్తున్నట్లుగా ఇందులో కనిపించింది. బన్నీ డిఫరెంట్ కాస్ట్యూమ్‌తో కనిపిస్తున్నారు. ఈ సాంగ్ వీడియో కూడా లీకైందని కొందరు పోస్టులు చేస్తున్నారు. మరికొందరేమో ఇలా లీక్ చేయడం కరెక్ట్ కాదని, ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు.

News November 8, 2024

అక్రమంగా 20.95 ఎకరాల్లో రెడ్ గ్రావెల్ తవ్వకం

image

AP: ఏలూరు(D) ఐ.ఎస్.జగన్నాథపురంలో 20.95 ఎకరాల్లో అక్రమంగా రెడ్ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. Dy.CM పవన్ ఆదేశాలతో రెవెన్యూ, గనుల శాఖ విచారణ చేపట్టగా, బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ అనుమతులు లేకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన అధికారులకు, ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

News November 8, 2024

మొసళ్ల మధ్యలో పడిన క్రికెట్ దిగ్గజం.. త్రుటిలో ఎస్కేప్!

image

ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెర్వ్ హ్యూస్‌తో కలిసి ఆయన ఇటీవల ఆ దేశంలో పర్యటించారు. మొసళ్లతో కూడిన చెరువులో పడవ మీద వెళ్తుండగా జారి నీటిలో పడిపోయారు. వెంటనే హ్యూస్ ఆయన్ను బయటికి లాగారు. ఈ క్రమంలో బోథమ్‌కు గాయాలయ్యాయి. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

News November 8, 2024

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. అదీ ₹10 స్టాంప్ పేప‌ర్‌‌తో

image

పై ఫొటోలో కనిపిస్తున్న ₹500 నోటు చూడటానికి ఒరిజినల్‌గా క‌నిపిస్తున్నా ఇది న‌కిలీది. అది కూడా ₹10 స్టాంప్ పేప‌ర్‌ను ఉప‌యోగించి త‌యారు చేశారు. యూపీలోని సోన్‌భ‌ద్రా జిల్లాకు చెందిన స‌తీశ్ రాయ్‌, ప్ర‌మోద్ మిశ్రా యాడ్స్ ప్రింటింగ్ రంగంలో ప‌నిచేస్తున్నారు. వీరు యూట్యూబ్‌లో నోట్ల త‌యారీ నేర్చుకున్నారు. న‌కిలీ నోట్ల ప్రింటింగ్ ప్రారంభించి ఫర్జీ సిరీస్‌ను రియల్‌గా చూపించారు. చివరికి పోలీసులకు చిక్కారు.

News November 8, 2024

మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు: హరీశ్

image

KCR కాలిగోటికి కూడా సరిపోని రేవంత్ <<14562919>>CM<<>> స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు. ‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి పద్యం CMకు సరిగ్గా సరిపోతుంది. KCRపై నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ దొంగబుద్ధిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తాం. ప్రగల్భాలు మాని పరిపాలనపై దృష్టి పెట్టు’ అని ట్వీట్ చేశారు.

News November 8, 2024

SAvsIND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

image

భారత్‌తో డర్బన్‌లో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్, సంజూ, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా జట్టు: ర్యాన్ రికెల్‌టన్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రూగర్, జాన్సెన్, సైమ్‌లేన్, కొయెట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్

News November 8, 2024

నో మోర్ మీడియా ట్ర‌య‌ల్స్‌: కేర‌ళ హైకోర్టు

image

విచార‌ణ‌లో ఉన్న కేసుల విష‌యంలో ద‌ర్యాప్తు/న్యాయాధికారి పాత్ర పోషించ‌కుండా మీడియా స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని కేరళ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. భావ ప్ర‌క‌ట‌నా, వాక్ స్వాతంత్య్రం ప్రాథమికాంశాలే అయినా తప్పొప్పులను నిర్ధారించేందుకు అది లైసెన్స్ కాద‌ని వ్యాఖ్యానించింది. మీడియా ట్ర‌య‌ల్స్ వ‌ల్ల ప్ర‌జ‌ల్లో ముందస్తు అభిప్రాయాలు ఏర్పడే అవకాశముందని, అది న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై అప‌న‌మ్మకానికి దారితీస్తుంద‌ంది.

News November 8, 2024

అద్వానీకి మోదీ బర్త్ డే విషెస్

image

బీజేపీ సహా వ్యవస్థాపకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ 97వ పుట్టిన రోజున ప్రధాని మోదీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. కాగా వృద్ధాప్య కారణాలతో అద్వానీ కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

News November 8, 2024

పోలీసులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

image

AP: సోషల్ మీడియాలో పోస్టులు, అరెస్టులపై చర్చించేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.