News November 10, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

☛ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్.. సచివాలయంలో ప్రార్థనల అనంతరం బాధ్యతలు
☛ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్.. పాల్గొన్న హరీశ్ రావు, తలసాని
☛ వరద ప్రవాహంతో నిలిచిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం దర్శనాలు పునఃప్రారంభం

News November 10, 2025

రష్యా భయంతో రక్షణ వ్యయాన్ని పెంచుతున్న EU దేశాలు

image

రష్యా దాడి భయంతో యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. తాజాగా జర్మనీ $1.2Bతో ఎయిర్ బస్ నుంచి 20 మిలటరీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్డరిచ్చింది. 2027 నాటికి ఇవి అందనున్నాయి. ఇప్పటికే అది 62 H145M హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. కాగా సాయుధ దళాల అత్యవసర ఆధునీకరణ కోసం జర్మనీ ఈ ఏడాదిలో ప్రత్యేక నిధినీ ఏర్పాటు చేసింది. ఈ ఆర్డర్లతో అనేక ఆయుధ తయారీ సంస్థలు ప్రయోజనాలు పొందుతున్నాయి.

News November 10, 2025

అత్యాచార బాధితురాలిపై లాయర్ ఘాతుకం

image

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అత్యాచారం చేశాడో లాయర్. UPలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2022లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసును కోర్టు బయట సెటిల్ చేస్తానని నిందితుల్లో ఒకరి లాయర్ జితేంద్ర సింగ్ యువతి(24)ని నమ్మించాడు. హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి నుంచి విడిపించుకుని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు ఇంటిపై నుంచి దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.

News November 10, 2025

NSUTలో 176 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (<>NSUT<<>>)లో 176 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్, BS, ME, ఎంటెక్, MS, PhDతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35- 50 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsut.ac.in/

News November 10, 2025

పిల్లలతో వ్యాయామం చేయిస్తున్నారా?

image

వ్యాయామం చేయడం పిల్లలకూ అవసరమేనంటున్నారు నిపుణులు. ఎదిగే వయసులో కండరాలు, ఎముకలు బలపడటానికి వ్యాయామం తోడ్పడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ వారానికి కనీసం మూడు రోజుల పాటైనా చేసేలా చూసుకోవాలి. 3-5 ఏళ్ల పిల్లలనైతే రోజంతా చురుకుగా కదిలేలా, రకరకాల ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 10, 2025

డ్రాగన్ ఫ్రూట్ సాగు.. అనువైన నేలలు, నాటే సమయం

image

డ్రాగన్ ప్రూట్ పంట ఏ నేలలోనైనా పండుతుంది. అయితే రాళ్ల భూమి, ఎర్ర భూములు ఎక్కువ అనుకూలం. పంటను బెడ్ పద్ధతిలో వేసుకుంటే మంచిది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పంటను నాటుకోవడం శ్రేయస్కరం. ఈ నెలల్లో కాయను కత్తిరించిన మొక్క నుంచి కొమ్మను మనం స్వయంగా చూసి తెచ్చుకొని నాటితే అది 6 నుంచి 9 నెలల్లో కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటే మొక్కలు బతికే అవకాశం ఎక్కువ.

News November 10, 2025

సివిల్స్‌లో పెరగని మహిళల భాగస్వామ్యం

image

సివిల్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగడం లేదు. పురుషులతో పోలిస్తే వారు 40% కూడా పోటీలో ఉండడం లేదని UPSC నివేదిక పేర్కొంటోంది. ప్రిలిమ్స్‌లో 2010లో మొత్తం 2,80,901కి గాను ఫీమేల్ 65,738(23.40%) ఉన్నారు. అదే 2021లో 5,10,438 మందికి గాను 1,68,352(32.98%) స్త్రీలు రాశారు. వీరిలో మెయిన్స్‌కు 14.75% మాత్రమే అర్హత సాధించారు. సామాజిక, ఆర్థిక, భద్రతా సమస్యలు, కుటుంబ సహకారం లేమే ఇందుకు కారణాలని విశ్లేషించింది.

News November 10, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* తిరుపతి(D)లో రాయలచెరువు కట్ట తెగి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 960 కుటుంబాలకు రూ.3వేల చొప్పున, మరణించిన 1,100 పశువులకు రూ.2.95 కోట్ల పరిహారం ఇవ్వనుంది.
* తిరుమల పరకామణి చోరీ కేసులో భాగంగా అప్పటి తిరుమల వన్‌టౌన్ పోలీసులు, TTD VGOగా పనిచేసిన గిరిధర్‌ను ఇవాళ CID విచారించింది.
* విశాఖ CII సమ్మిట్‌లో 400+ ఒప్పందాలు జరుగుతాయి. ₹లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి: విశాఖ MP శ్రీభరత్

News November 10, 2025

జడ్జిలపై ఆరోపణల ట్రెండ్ పెరుగుతోంది: సీజేఐ

image

ఒక పక్షానికి అనుకూలంగా ఆదేశాలివ్వకపోతే జడ్జిపై ఆరోపణలు చేసే ట్రెండ్ పెరుగుతోందని సుప్రీంకోర్టు CJI గవాయ్ అన్నారు. TG హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన N.పెద్దిరాజు కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాజు చెప్పిన క్షమాపణలను జడ్జి అంగీకరించారని అడ్వకేట్ సంజయ్ హెగ్డే తెలిపారు. దీంతో విచారణను ముగిస్తున్నట్లు CJI ప్రకటించారు.

News November 10, 2025

SIGMA: దళపతి విజయ్ కొడుకు దర్శకత్వంలో సందీప్ కిషన్

image

తమిళ స్టార్ దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా సందీప్ కిషన్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘SIGMA’ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో సందీప్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.