India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(AMMA) అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపడతారన్న వార్తలను హీరో మోహన్ లాల్ కొట్టిపారేశారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో నటీమణులపై వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన రిజైన్ చేశారు.
AP: వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి నిబంధనల అడ్డు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమచేస్తామని పునరుద్ఘాటించారు. రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని స్పష్టం చేశారు.
పంజాబ్ కింగ్స్ పర్సులో అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. దీంతో వేలంలో ఆ జట్టు ఏ ఆటగాడిని కొనడానికైనా వెనకాడదని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రిషభ్ పంత్ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమైనట్లు టాక్. అలాగే శ్రేయస్ అయ్యర్, అర్ష్దీప్ సింగ్, జితేశ్ శర్మ, కగిసో రబాడ, లియామ్ లివింగ్స్టోన్ కోసం భారీగా ఖర్చు చేస్తుందని సమాచారం. ఈ ఆరుగురు ఆటగాళ్లను కచ్చితంగా దక్కించుకుంటుందని తెలుస్తోంది.
క్వీన్ ఎలిజబెత్-2 వివాహం నాటి కేక్ ముక్కను వేలం వేయగా భారీ ధరకు అమ్ముడుపోయింది. వేలంలో స్కాట్లాండ్కు చెందిన మారియన్ పోల్సన్ దానిని రూ.2.40 లక్షలకు కొన్నాడు. కాగా ఎలిజబెత్-ఫిలిప్ పెళ్లి 1947లో జరిగింది. అప్పటి నుంచి ఆ కేక్ పీస్ను భద్రంగా ఫ్రిడ్జ్లో దాచారు. ఇప్పుడు దానిని వేలంలో ఉంచారు.
ప్రభాస్-సందీప్రెడ్డి కాంబోలో ‘స్పిరిట్’ పూర్తయిన తర్వాతే రణ్బీర్ కపూర్తో ‘యానిమల్ పార్క్’ ఉంటుందని Tసిరీస్ ఎండీ భూషణ్ కుమార్ వెల్లడించారు. స్పిరిట్ను 2026లో, యానిమల్-2ను 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది రైడ్-2, దే దే ప్యార్ దే-2(అజయ్ దేవగణ్)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఢమాల్-3, బోర్డర్-2 సినిమాలను 2026లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
TG: ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. నాగచైతన్య-శోభితల పెళ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహిళా కమిషన్ స్పందించింది. గతంలోనూ నోటీసులు ఇవ్వగా, కోర్టును ఆశ్రయించిన వేణుస్వామి విచారణ నుంచి తప్పించుకున్నారు. తాజాగా స్టే ఎత్తివేయడంతో మళ్లీ ఆయనకు నోటీసులు పంపింది.
దేశంలో ఏటా 1.50లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతోనే చాలామంది మరణిస్తున్నారు. అలా చనిపోయిన వారిలో దినేశ్ ఒకరు. తన మిత్రుడిలా ఎవరూ చనిపోవద్దని వివేక్ అనే వ్యక్తి ఓ పరికరం కనుగొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటో మెటిక్గా ట్రిగ్గర్ అయ్యే రక్షణ వ్యవస్థను తయారు చేశారు. ఇది ప్రమాద లోకేషన్ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలకు సమాచారం ఇస్తుంది. ఇదంతా 3ని.లలోపే జరుగుతుంది.
AP: ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 8 ఏళ్లు పూర్తవుతోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ‘ATMల వద్ద రూ.2వేల కోసం క్యూ కట్టేవాళ్లం. మా వరకు వచ్చేసరికి ATM ఖాళీ అయ్యేది. స్కూల్ ఫీజుల కోసం రెండు మూడు సార్లు లైన్లో నిల్చునేవాళ్లం’ అని ట్వీట్స్ చేస్తున్నారు.
కథ ఫర్వాలేదు అనుకున్నా, దర్శకుడు సుధీర్ వర్మ తెరపై ఆ స్థాయిలో చూపలేకపోయారు. ఫస్టాఫ్ బోరింగ్గా సాగితే సెకండాఫ్లో సస్పెన్స్ రివీల్లో తేడా కొట్టింది. పాత్రలనూ సరిగ్గా ప్లాన్ చేయలేదు. కొన్నిచోట్ల నవ్వుకోదగ్గ కామెడీ సీన్లుంటాయి. నిఖిల్ సహా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.
రేటింగ్: 1.5/5
Sorry, no posts matched your criteria.