News October 9, 2025

గ్రూప్1 నియామకాలపై జోక్యానికి సుప్రీం నో

image

తెలంగాణలో గ్రూప్1 నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఇదే అంశంపై ఈనెల 15న హైకోర్టులో విచారణ ఉన్న సమయంలో తాము ఇందులో జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. కాగా హైకోర్టు తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యర్థులను సెలక్ట్ చేసింది.

News October 9, 2025

భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..

image

<<17948949>>నోబెల్<<>> పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్(1913-సాహిత్యం) నిలిచారు. 1930లో సి.వి.రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరిసా(శాంతి), 1998లో అమర్త్యసేన్(అర్థశాస్త్రం), 2014లో కైలాశ్ సత్యార్థి(శాంతి) ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతి వారిలో హరగోవింద్ ఖొరానా(వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్(ఖగోళ భౌతిక), వెంకట్రామన్ రామకృష్ణన్(రసాయన), అభిజిత్ బెనర్జీ(అర్థశాస్త్రం) ఉన్నారు.

News October 9, 2025

మ్యాగజైన్ కంటెంట్.. ఇక ప్రతిరోజూ..

image

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. భక్తి, జాబ్స్, పాడిపంట, వసుధ.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్ కోసం వారం రోజులు వేచి చూడకుండా ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు క్లిక్ చేసి నేరుగా నచ్చిన కంటెంట్ పొందండి. కేటగిరీలు కన్పించలేదంటే <>యాప్ అప్డేట్<<>> చేసుకోండి.

News October 9, 2025

‘స్థానిక’ ఎన్నికలు.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. MPTC, జడ్పీటీసీ తొలి దశ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి దశలో 292 ZPTC, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. కొన్ని చోట్ల నామినేషన్ల స్వీకరణ మొదలైంది.

News October 9, 2025

సెలక్షన్ నా చేతుల్లో ఉండదు: షమీ

image

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు. ‘సెలక్షన్ అనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ల నిర్ణయం. నేను జట్టులో ఉండాలనుకుంటే సెలక్ట్ చేస్తారు. లేదంటే లేదు. నేను ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాను. దులీప్ ట్రోఫీలో 35 ఓవర్లు వేశాను’ అని చెప్పారు. కెప్టెన్సీ మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని, గిల్‌కు అనుభవం ఉందని తెలిపారు.

News October 9, 2025

APPLY NOW: IPRCLలో 28 ఉద్యోగాలు

image

ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్(IPRCL)లో 28 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). వీటిలో 18 ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులు, 10 అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iprcl.in/

News October 9, 2025

కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు

image

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.

News October 9, 2025

సఖి సురక్ష పథకం ఎందుకంటే?

image

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం సఖి సురక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 35 ఏళ్లు పైబడిన మహిళలకు బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనతతో పాటు గర్భాశయ సమస్యలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. పట్టణ మహిళల ఆరోగ్యస్థితిని పర్యవేక్షించేందుకు డిజిటల్‌ హెల్త్ రికార్డులు ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆరోగ్యపరంగా చైతన్యం పొందుతారని అధికారులు వెల్లడిస్తున్నారు.

News October 9, 2025

ఘోరం.. ఔషధమే విషమై చంపేసింది!

image

పిల్లలకు జలుబు, దగ్గు తగ్గేందుకు తాగించిన సిరపే వారి పాలిట విషమైంది. మధ్యప్రదేశ్‌లో ప్రమాదకర కెమికల్ ‘డైథిలిన్ గ్లైకోల్’ కలిసిన సిరప్ తాగి 20 మంది పిల్లలు చనిపోయారు. అందులో ఆరేళ్ల దివ్యాంశ్ ఒకడు. జ్వరం రావడంతో తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ సూచనతో కోల్డ్రిఫ్ సిరప్ రోజుకు 4 సార్లు తాగించగా ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. మృతుల లిస్టులో అతడి పేరు చేర్చకపోవడంతో రూ.4 లక్షల పరిహారమూ అందలేదు.

News October 9, 2025

6 రోజుల్లోనే రూ.5,620 పెరిగిన గోల్డ్ రేట్

image

బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి రూ.1,24,150కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,620 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,13,800 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,71,000కి చేరుకుంది. 6 రోజుల్లోనే రూ.9వేలు పెరగడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.