India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇండియన్ రైల్వేలో కీలక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ఫ్రైట్ కమ్ ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కింది అంతస్తులో సరుకు, పైన ప్రయాణికులు వెళ్లేలా డబుల్ డెక్కర్ లాంటి రైళ్లను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. రోడ్డు రవాణాతో పోటీ పడేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ BSNL టారిఫ్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు అందులోకి పోర్ట్ అయ్యారు. ఆఫర్లు బాగున్నా సిగ్నల్ చాలా ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో BSNL కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65వేలకు పైగా 4G టవర్లు పని చేస్తున్నాయని పేర్కొంది. జూన్ వరకు వీటిని లక్షకు పెంచుతామని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితి ఇది. చాలా స్కూళ్లలో అవసరమైనన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఇలా ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఒకటే టాయిలెట్ ఉంటోంది. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. HYDలోని ఓ పాఠశాలలోని పరిస్థితి తెలియజేస్తూ ఓ జర్నలిస్టు తీసిన ఫొటో వైరలవుతోంది. దీనిపై మీ కామెంట్?

ఉద్యోగుల రాజీనామాలకు గల కారణాలను బిజినెస్మ్యాన్ హర్షా గోయెంకా తెలిపారు. రీజన్స్ ఇవేనంటూ ఓ ఫొటో షేర్ చేశారు. ‘సరైన మేనేజర్ లేకపోవడం, సమానంగా చూడకపోవడం, గుర్తింపు లేకపోవడం, తక్కువ జీతం ఇవ్వడం, విష సంస్కృతి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, ఎదిగేందుకు తక్కువ ఆప్షన్స్ ఉండటం, ఆఫీస్లో జరిగే రాజకీయాలకు బలవడం, జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, వర్క్ లోడ్ ఎక్కువ చేయడం వంటివి కారణాలు కావొచ్చు’ అని తెలిపారు.

భార్యను చంపి బాడీ పార్ట్లను <<15227723>>కుక్కర్లో ఉడికించిన కేసులో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన మొబైల్లో ఓ మహిళ ఫొటోలు గుర్తించినట్లు సమాచారం. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తుర్కియేకు చెందిన ఇబ్రహీం యూసీల్ అనే వ్యక్తి సిగరెట్ తాగడం మానేసేందుకు వింత నిర్ణయం తీసుకున్నారు. తలకు బంతి లాంటి హెల్మెట్ ధరించి, దానికి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇస్తున్నారు. 2013 నుంచి ఆయన ఇలాగే హెల్మెట్తో దర్శనమిస్తున్నారు. గతంలో ఇబ్రహీం రోజుకు రెండు పెట్టెల సిగరెట్లు తాగేవారు. పిల్లల బర్త్డే రోజు మానేయడం, మళ్లీ తాగడం చేస్తుండేవారు. దీంతో ఈ హెల్మెట్ ఆలోచన చేశారు.

TG: పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 6 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. రోజూ మ.1.15 గం. నుంచి సా.4.15 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.
*మార్చి 6- ఫస్ట్ లాంగ్వేజ్ *7- సెకండ్ లాంగ్వేజ్ *10- థర్డ్ లాంగ్వేజ్ *11- మ్యాథ్స్ *12- ఫిజికల్ సైన్స్ *13- బయోలాజికల్ సైన్స్ *15- సోషల్ స్టడీస్
>>ఇక టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు.

ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం రేట్లు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లకు మాత్రం ఉపయోగకరమేనని అంటున్నారు. ఓపెన్ మార్కెట్లో 24k గోల్డ్ 10gr ధర రూ.82వేలు దాటేసింది. ఇండియన్ బులియన్, జువెలరీ అసోసియేషన్ (IBJA) ప్రకారం తొలిసారి రూ.80,194 దాటింది. 2024, OCT 30నాటి రూ.79,681ని దాటేసింది.

అధికారంలోకి వచ్చిన తొలిరోజే US దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులు స్కూళ్లు, చర్చిలు, ఆస్పత్రులు, పెళ్లిళ్లు, దహన సంస్కారాలు లాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్నా అరెస్టు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2011లోని నిబంధనను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎత్తివేసింది. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలబోమంది.

TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో సుమారు 49,550 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల్లో ఇదే రికార్డు కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు మించాయి. కాగా రేపు ఉదయం సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది.
Sorry, no posts matched your criteria.