News January 23, 2025

వారికి ఖాన్స్ కావాలి.. హిందూ నటులను పట్టించుకోరు: BJP నేత

image

బంగ్లాదేశీయుడు నిజంగానే సైఫ్‌ను కత్తితో పొడిచాడా లేక ఆయన యాక్ట్ చేస్తున్నారా అని MH మంత్రి నితేశ్ రాణె ప్రశ్నించారు. పరిస్థితుల్ని గమనిస్తే డౌట్ వస్తోందన్నారు. ‘చూస్తుంటే షరీఫుల్‌ను సైఫ్ స్వయంగా స్వాగతించినట్టు అనిపిస్తోంది. ఇక ప్రతిపక్షాలకేమో ఖాన్ యాక్టర్స్ తప్ప హిందూ నటులపై జాలి ఉండదు. సుశాంత్‌ గురించి సుప్రియా, జితేందర్ ఎప్పుడైనా అడిగారా? సైఫ్, షారుఖ్ కొడుకునైతే పట్టించుకుంటారు’ అని అన్నారు.

News January 23, 2025

సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు

image

AP: మాజీ సీఎం YS జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు చెందిన సరస్వతీ పవర్, ఇండస్ట్రీస్ కోసం పల్నాడు జిల్లాలో కొనుగోలు చేసిన భూముల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. మాచవరం(మ) వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాల దస్తావేజులను రద్దు చేస్తున్నట్లు తహశీల్దార్ ప్రకటించారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు భూముల్లో సర్వే చేసి GOVT భూములను గుర్తించారు.

News January 23, 2025

పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

image

TG: రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా మధ్యాహ్నం ఎండ దంచుతోంది. ఉదయం 9 గంటలైనా పొగమంచుతో కూడిన చలి ఉంటోంది. సాయంత్రం 6 అయితే చాలు ఉష్ణోగ్రతలు పడిపోయి గజగజ మొదలవుతోంది. చాలా జిల్లాల్లో 10 డిగ్రీలలోపు టెంపరేచర్ నమోదవుతోంది. ఇక మధ్యాహ్నం ఎండ సుర్రుమంటోంది. 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఈ భిన్న వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News January 23, 2025

హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్

image

TG: మార్చి 18 నుంచి హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్‌జెట్ సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు(మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్‌లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.

News January 23, 2025

పౌర విమానయానంలో 15% వృద్ధి: రామ్మోహన్

image

PM మోదీ నేతృత్వంలో భారత్ ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అత్యుత్తమ విధానాలే బలమైన దేశంగా మారడానికి కారణమని చెప్పారు. ‘ప్రపంచ దేశాలన్నీ అవకాశాల కోసం భారత్ వైపు చూస్తున్నాయి. పౌర విమానయాన రంగాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. ఏఐ, డీప్ టెక్ లాంటి సాంకేతికత ద్వారా సేవలు మరింత విస్తృత పరుస్తాం. పౌరవిమానయాన రంగం ప్రస్తుతం 15% వృద్ధి చెందుతోంది’ అని దావోస్‌లో రామ్మోహన్ తెలిపారు.

News January 23, 2025

తెలంగాణలో JSW రూ.800 కోట్ల పెట్టుబడులు

image

TGలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు JSW సంస్థ దావోస్‌లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. USకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.

News January 23, 2025

కాలేజీలు బంద్ చేస్తామని హెచ్చరిక

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీకి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. బకాయిలు విడుదల కాకపోతే కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి. ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు, భవనాల అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నామని యాజమాన్యాలు విన్నవించాయి. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఫీజు బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని కోరాయి.

News January 23, 2025

నూతన DGP ఈయనేనా?

image

AP: DGP ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో కొత్త DGP ఎవరనే చర్చ జరుగుతోంది. నూతన DGPగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. ఎన్నికలప్పుడు హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే. పదవీకాలం పొడిగింపు కోసం తిరుమలరావు, పోలీస్ బాస్ పోస్ట్ కోసం CID DG రవిశంకర్ పోటీలో ఉన్నట్లు సమాచారం.

News January 23, 2025

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ఉదయం అన్ని స్కూళ్లల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశించారు. HMలు, విద్యాసంస్థల ప్రధానాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. విద్యార్థులు ఉదయం జాతీయ గీతం ఆలపిస్తూ మార్చ్ పాస్ట్ నిర్వహించాలని సూచించారు.

News January 23, 2025

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మదగజరాజా’

image

విశాల్‌ నటించిన ‘మదగజరాజా’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సత్యకృష్ణన్‌ ప్రొడక్షన్‌ సిద్ధమైంది. సంక్రాంతికి తమిళనాట రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్‌ ప్రేక్షకులను అలరిస్తోందని మూవీ టీం తెలిపింది. 12ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో ఇంతకాలం విడుదల కాలేదు.