India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* AP: సోషల్ మీడియాలో హద్దులు మీరితే వదిలే ప్రసక్తి లేదు: CBN
* వాలంటీర్లు వ్యవస్థలోనే లేరు: పవన్
* వైసీపీ పాలనలో వెంటిలేటర్పై ఏపీ: అనిత
* కూటమి పాలనలో రాష్ట్రానికి చీకటి రోజులు: జగన్
* నేను YSRకు పుట్టలేదని అవమానించారు: షర్మిల
* TG: నేను ఎవ్వరి కాళ్లు పట్టుకోను: మంత్రి పొంగులేటి
* బీఆర్ఎస్, కాంగ్రెస్ను ఖతం చేస్తాం: కిషన్రెడ్డి
* జైలుకు పంపితే యోగా చేసుకుంటా: KTR
J&K కిష్త్వార్లోని ఓహ్లీ కుంట్వారాకు చెందిన ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను (VDG) జైష్-ఏ-మహ్మద్కు చెందిన కశ్మీర్ టైగర్స్ ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీనిపై ప్రకటన విడుదల చేసిన కశ్మీర్ టైగర్స్ VDG క్రియాశీలక సభ్యులు కుల్దీప్ కుమార్, నజీర్ అహ్మద్ గురువారం ఉదయం ఆక్రమిత కశ్మీర్లోని అటవీ ప్రాంతంలో ఇస్లాం ముజాహిదీన్లను వెంబడిస్తూ వచ్చినట్టు తెలిపింది. దీంతో కాల్చిచంపినట్టు ప్రకటించింది.
సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా రాజస్థాన్లో నిరుపేదలతో సమయాన్ని గడిపారు. పోషణ అందని చిన్నారులకు ఆహారాన్ని అందించడంతో పాటు కలిసి ఆడుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో సారా వెల్లడించారు. అన్ని కష్టాల్లోనూ అక్కడి మహిళలు చూపిస్తున్న సంకల్ప బలం తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె వెల్లడించారు.
TG: రేపు రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, మెస్ ఛార్జీలు పెంచిన సందర్భంగా హాస్టళ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సెలబ్రేషన్స్ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డిని ఆశీర్వదించేలా ప్రజలంతా పూజలు చేయాలని కోరారు. రుణమాఫీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ లాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
TG: ఆర్టీసీ GHMC పరిధిలో హోం డెలివరీ సర్వీస్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. పార్సిల్స్ 1KG – ₹50, 5KG – ₹60, 10KG – ₹65, 20KG – ₹70, 30KG – ₹75, 30KGలకు పైనుంటే ₹75కు అదనంగా పైనున్న స్లాబ్ల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు 9030134242 లేదా 9030135252కి కాల్ చేయవచ్చు. GHMC పరిధిలో 31 ప్రాంతాల్లో ఈ సర్వీస్ ఉంటుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 హైబ్రిడ్ మోడల్లో జరిగే అవకాశం ఉందని PTI తెలిపింది. భారత్ తన మ్యాచులను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో ఆడనుందని పేర్కొంది. నవంబర్ 11న ఆ టోర్నీ షెడ్యూల్ అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. కాగా, తొలుత ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ నో చెప్పడంతో తాజాగా మార్పులు చేసినట్లు సమాచారం.
సునీతా <<14549029>>విలియమ్స్<<>> ఆరోగ్యంగా ఉన్నట్టు నాసా స్పష్టత ఇచ్చింది. ISSలో ఉన్న వ్యోమగాములందరూ ఆరోగ్యంగా ఉన్నారని, వీరికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నాసా ప్రతినిధి జిమి రస్సెల్ తెలిపారు. ఫ్లైట్ సర్జన్లు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. అయితే కేలరీల లోటు వల్ల కొంచెం బరువు తగ్గడంతో సునీత బుగ్గలు లోపలికి అణిగినట్టు గుర్తించానని రస్సెల్ పేర్కొన్నారు.
తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో ఓ వ్యక్తి <<14545604>>బాలయ్యకు<<>> ఓటు వేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీనిపై విమర్శలొస్తున్నాయి. ఎంతో విలువైన ఓటును ఇలా దుర్వినియోగం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఆ ఓటు వేసిన వ్యక్తిపై కేసు వేసి US పౌరసత్వం రద్దు చేస్తే అప్పుడు ఓటు విలువ తెలుస్తుందని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
7వేలమందికి పైగా నార్త్ కొరియా సైనికులు రష్యా కోసం యుద్ధం చేసేందుకు ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ లభించడంతో వారు నీలిచిత్రాలకు బానిసల్లా మారినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తెలిపింది. రేయింబవళ్లూ అవే చూస్తున్నారని పేర్కొంది. ఉత్తర కొరియాలో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. ఇంటర్నెట్లోనూ ప్రభుత్వం అనుమతించిన వెబ్సైట్స్నే వారు చూడాల్సి ఉంటుంది.
పాక్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో పాకిస్థాన్ పిచ్లు సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంటూ ఐసీసీ తాజాగా రేటింగ్ ఇచ్చింది. తొలి మ్యాచ్లో ముల్తాన్ పిచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. పాక్ 556, ఇంగ్లండ్ 823 రన్స్ చేశాయి. రెండో మ్యాచ్లో అదే పిచ్పై, మూడో మ్యాచ్లో రావల్పిండి పిచ్పై బంతి తొలి రోజు నుంచే స్పిన్ అయింది. దీంతో ఇంగ్లండ్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
Sorry, no posts matched your criteria.