News September 20, 2025

బతుకమ్మ: ఏ రోజున ఏ నైవేద్యం? (1/2)

image

Day 1: ఎంగిలిపూల బతుకమ్మ – బియ్యం, నువ్వులు, బియ్యం పిండి
Day 2: అటుకుల బతుకమ్మ – బెల్లం, అటుకులు
Day 3: ముద్దపప్పు బతుకమ్మ – ముద్దపప్పు, పాలు, బెల్లం
Day 4: నానే బియ్యం బతుకమ్మ – నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం
Day 5: అట్ల బతుకమ్మ – గోధుమ అట్లు, దోశలు
Day 6: అలిగిన బతుకమ్మ – నైవేద్యం ఉండదు

News September 20, 2025

బతుకమ్మ: ఏ రోజున ఏ నైవేద్యం (2/2)

image

Day 7: వేపకాయల బతుకమ్మ – బియ్యం పిండిని వేప పండ్ల ఆకారంలో తయారు చేసి పెడతారు.
Day 8: వెన్న ముద్దల బతుకమ్మ – నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం
Day 9: సద్దుల బతుకమ్మ – చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, పెరుగు అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది

News September 20, 2025

బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్ (1/2)

image

సెప్టెంబర్ 21: వేయి స్తంభాల గుడిలో
సెప్టెంబర్ 22: శిల్పారామం(హైదరాబాద్), పిల్లలమర్రి(మహబూబ్‌నగర్)
సెప్టెంబర్ 23: నాగార్జున సాగర్ బుద్ధవనం
సెప్టెంబర్ 24: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం(జయశంకర్ భూపాలపల్లి), కరీంనగర్ ఐటీ సెంటర్
సెప్టెంబర్ 25: భద్రాచలం ఆలయం, అలంపూర్‌
సెప్టెంబర్ 25: హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్(sep 29 వరకు)

News September 20, 2025

బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్ (2/2)

image

సెప్టెంబర్ 26: అలీసాగర్ రిజర్వాయర్(నిజమాబాద్)
సెప్టెంబర్ 27: ట్యాంక్ బండ్ వద్ద మహిళలతో బైక్ ర్యాలీ, ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నివాల్
సెప్టెంబర్ 28: ఎల్బీ స్టేడియంలో 10 వేలకుపైగా మహిళలతో సంబురాలు, 50 అడుగుల ఎత్తులో బతుకమ్మ
సెప్టెంబర్ 29: పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు
సెప్టెంబర్ 30: ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ముగింపు వేడుకలు, అలాగే వింటేజ్ కార్ ర్యాలీ, సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షో

News September 20, 2025

బీ12 అందాలంటే ఇవి తినాల్సిందే..

image

మెదడు పనితీరు, నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్‌ బి12 తగినంత ఉండాలి. ఇది ఎక్కువగా చేపలు, గుడ్లు, మాంసం నుంచి లభిస్తుంది. బీ12 లోపం ఉండకూడదంటే డైట్‌లో పాలు, పెరుగు, చీజ్, మజ్జిగ, పనీర్‌ చేర్చుకోవాలి. ఇప్పుడు బీ12 ఫోర్టిఫైడ్ ఆహారాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పాలు, పెరుగు తీసుకోనివారు బాదం, సోయా, టోఫు, ఓట్స్‌ పాలల్లో తీసుకుంటే విటమిన్‌ బి12 కావాల్సినంత అందుతుంది.

News September 20, 2025

NCRB డిప్యూటీ డైరెక్టర్‌గా రెమా రాజేశ్వరి

image

డీఐజీ రెమా రాజేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమెను నియమించనున్నారు. రాజేశ్వరి 2009 బ్యాచ్ IPS అధికారిణి, ప్రస్తుతం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా ఉన్నారు. 2021లో ‘సెల్ఫ్‌మేడ్‌ ఉమెన్‌’ గా ‘ఫోర్బ్స్‌’ ప్రచురించింది. గృహహింస, ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా రాజేశ్వరి పలు కార్యక్రమాలు చేపట్టారు. జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ ఎస్పీగా పనిచేశారు.

News September 20, 2025

TSR కంపెనీకి రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ!

image

మాజీ MP టి.సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని గాయత్రి ప్రాజెక్ట్స్ చెల్లించాల్సిన రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ అయ్యాయి. ఆ కంపెనీ రూ.8,100 కోట్లను కెనరా నేతృత్వంలోని బ్యాంకులకు చెల్లించడంలో విఫలమైంది. 2022లో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో దివాలా పిటిషన్ దాఖలైంది. ఏ కంపెనీ దాన్ని కొనుగోలు చేయకపోవడంతో TSR కుటుంబమే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.2,400 కోట్లు చెల్లిస్తామని చెప్పగా NCLT ఆమోదం తెలిపింది.

News September 20, 2025

ఉల్లి పంటలో బోల్డింగ్ అంటే ఏమిటి?

image

ఉల్లి మొక్కల్లో శాఖీయ పెరుగుదల పూర్తికాక ముందే పుష్పించడాన్ని బోల్డింగ్ అంటారు. జన్యుపరమైన లోపాలు, ఉష్ణోగ్రతల్లో అసమానతలు, నాణ్యతలేని విత్తనాల వినియోగం, నాటిన తొలిదశలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు దీనికి కారణం. ఈ సమస్య నివారణకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి. పొటాషియం ఎరువులను ఎకరానికి 30 కిలోలు వేసుకోవాలి. నీటి ఎద్దడి లేకుండా చూడాలి. 10 లీటర్ల నీటికి 2.5ml మాలిక్ హైడ్రోజైడ్ కలిపి పిచికారీ చేయాలి.

News September 20, 2025

కాలీఫ్లవర్‌‌పై గోధుమ రంగు మచ్చలకు కారణమేంటి?

image

కాలీఫ్లవర్‌పై గోధుమ రంగు మచ్చలు కనిపించడాన్ని ‘బ్రౌనింగ్’ అంటారు. సాధారణంగా క్షార నేలల్లో పెంచే పంటల్లో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడటమే కాకుండా కాండం గుల్లగా మారి నీరు కారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 కిలోల బోరాక్స్ వేసుకోవాలి. లీటరు నీటికి 1.5-2.0 గ్రాముల డైసోడియం ఆక్టాబోరెట్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.

News September 20, 2025

SCRలో 14 పోస్టులకు నోటిఫికేషన్

image

సౌత్ సెంట్రల్ రైల్వే(SCR)లో స్కౌట్స్& గైడ్స్ కోటా కింద 14 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. టెన్త్, ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు ఆయా విభాగాల్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18-33 ఏళ్లలోపు ఉండాలి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి OCT 19 వరకు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, నాందేడ్, గుంటూరు డివిజన్లలో రెండేసి చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: <>https://scr.indianrailways.gov.in/<<>>