India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రేపు విడుదలకానున్న పవన్ OG మూవీ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు GOను <<17815121>>TG హైకోర్టు<<>> సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న తలెత్తింది. రేపటికి దాదాపుగా అన్ని షోలకు టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షో టికెట్ల డబ్బులు, అన్ని టికెట్లకు పెంచిన ధరలను రిఫండ్ చేస్తారా? లేదా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.

TG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో తెరకెక్కిన OG చిత్రానికి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గం.కు ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధం నెలకొంది.

AP: జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం’ అని తాడేపల్లిలో తెలిపారు. కాగా జగన్ అధ్యక్షతన ఇవాళ తాడేపల్లిలో YCP విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది.

అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగడం చూస్తుంటాం. అయితే కోడళ్లను కూతురిలా చూసుకునే అత్తలు కూడా ఉన్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. యూపీలోని ఎటాలో ఓ అత్త తన కోడలి ప్రాణాలు కాపాడటానికి తన కిడ్నీని దానం చేసి మానవత్వం చాటారు. ఆమె సొంత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించారు. అత్త మాత్రం ‘ఆమె నాకు కోడలు కాదు, కన్న కూతురితో సమానం’ అంటూ కోడలికి కిడ్నీ ఇచ్చి కాపాడుకున్నారు.

సంప్రదాయ కట్టుబాట్లను దాటుకుని ఫ్యాషన్ డిజైనర్గా సత్తా చాటుతున్నారు కశ్మీర్కు చెందిన ఇక్రా అహ్మద్. ఆ రాష్ట్రంలో Tul Palav అనే తొలి ఆన్లైన్ స్టోర్ను నెలకొల్పి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కుర్తాలు, వెడ్డింగ్ డ్రెస్సులతో ఆకట్టుకుంటున్నారు. లోయలో అస్థిర పరిస్థితులను తట్టుకుని, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.

తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఓటుకునోటు కేసులో జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పలు అంశాలు పేర్కొన్నారు. CJI లేదా తెలంగాణేతర రాష్ట్ర HCతో కేసు పునర్విచారణ చేయాలన్నారు. నాడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి TDP మహానాడుకు పిలిపించి స్టీవెన్సన్ను ఒప్పించేలా తనతో నేరం చేయించారని ఆరోపించారు. లోకేశ్తో పాటు నాటి ఇంటెలిజెన్స్, ACB అధికారులు, లాయర్లు సహా అందరినీ నిందితులుగా చేర్చాలన్నారు.

అప్పటి TG సీఎం కేసీఆర్ పేర్కొన్న సాక్ష్యాలను విచారణలో మెన్షన్ చేయలేదని మత్తయ్య అన్నారు. ’రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారు. వారు విచారణను తప్పుదోవ పట్టించి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉంది. విచారణ ముగిసే వరకు వారిని తొలగించాలి‘ అని కోరారు. TDP, INC పార్టీల ప్రభుత్వాలనూ రద్దు చేయాలన్నారు. లోతైన విచారణ లేకుండా ఈ కేసును నాటి హైకోర్టు జడ్జి స్క్వాష్ చేశారని ఆరోపించారు.

జమ్మూకశ్మీర్, పంజాబ్లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్లో 4, పంజాబ్లో ఒక సీటు(ఉపఎన్నిక) ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుంది.

TG: అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో SEP 26న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం కావాలని తెలిపింది. పిల్లల చదువు, హాజరు, ప్రవర్తనపై చర్చించాలని సూచించింది. తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకోవాలంది. నాణ్యమైన విద్య, డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి నెలా ఈ సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది.
Sorry, no posts matched your criteria.