News November 7, 2024

INDvsSA: టీ20 ట్రోఫీ ఇదే

image

సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా రేపు రాత్రి 8.30గంటలకు మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ ఆవిష్కరించారు. ఇద్దరూ కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ఈ టీ20 సిరీస్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News November 7, 2024

త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

image

AP: దేవాదయశాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. త్వరలోనే దేవాలయ ట్రస్టుబోర్డుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అన్నిరకాల ప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ సామగ్రినే వాడాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో వ్యాపార ధోరణి కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉండాలని సూచించారు. నిత్యం ఓంకారం, దేవతామూర్తుల మంత్రోచ్చారణ వినిపించాలని పేర్కొన్నారు.

News November 7, 2024

నేను ఎవ్వరి కాళ్లు పట్టుకోను: పొంగులేటి

image

TG: తాను ఎవ్వరి కాళ్లు పట్టుకోనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒకే ఒక్కసారి పార్టీ కార్యక్రమంలో పెద్దవాడని భావించి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకని, రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడుతుందని చెప్పారు. మరోవైపు కేటీఆర్ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తానన్నారు.

News November 7, 2024

SUPER PHOTO.. స్టార్ హీరోలంతా ఒకే చోట

image

సాధారణంగా హీరోలు చాలా అరుదుగా కలుస్తుంటారు. కానీ స్టార్ హీరోలంతా ఒకే చోట భోజనం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ రెస్టారెంట్లో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో ఉపాసన, నమ్రత కూడా ఉన్నారు. దీంతో స్టార్లంతా ఒకే చోట కలిశారని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా వీరంతా ఓ బర్త్ డే వేడుకలో కలిశారని సమాచారం.

News November 7, 2024

₹13వేల కోట్ల రుణమాఫీ బాకీ ఉందని ధైర్యంగా చెబుతున్నాం: మంత్రి పొంగులేటి

image

TG: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉన్నా ఎన్నో ఇబ్బందులు పడుతూ రైతును రాజును చేయాలనే సంకల్పంతో ₹18వేల కోట్ల పంట రుణం మాఫీ చేశాం. ఇంకా ₹13వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉందని ధైర్యంగా చెబుతున్నాం. Decలోపు మాఫీ చేస్తాం’ అని వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా మంత్రి అన్నారు.

News November 7, 2024

చికెన్ తిని యువతి మృతి.. వెలుగులోకి కొత్త విషయం

image

TG: నిర్మల్‌లోని గ్రిల్9 రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని యువతి <<14537109>>మరణించిన<<>> ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్ ఐటమ్స్‌పై మయోనైజ్ వేసుకుని తినడం వల్లే యువతి మరణించిందని, పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలయ్యారని అధికారులు తెలిపారు. ఇవాళ ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. కాగా TGలో మయోనైజ్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినా కొన్ని రెస్టారెంట్లలో దీన్ని వాడుతుండటం గమనార్హం.

News November 7, 2024

ఎల్లుండి సా.4:30 గంటలకు ‘గేమ్ ఛేంజర్’ టీజర్

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈనెల 9న సా.4:30కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లక్నోలోని ప్రతిభ థియేటర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సుదర్శన్, తిరుపతిలో PGR, విజయవాడలో శైలజ, బెంగళూరులో ఊర్వశితో పాటు మరో 5 థియేటర్ల పేర్లను ప్రకటించారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

News November 7, 2024

BRS, కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం: కిషన్‌రెడ్డి

image

TG: రాష్ట్రంలో BRS, కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని BJP నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు. కేటీఆర్ వైఖరి వల్ల BRS పైనా వ్యతిరేకత పోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనను తాము తప్పుబట్టడం లేదని ఆయన తెలిపారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ఇళ్లు కూల్చవద్దని, నదికి రక్షణ గోడ నిర్మించాలని సూచించారు.

News November 7, 2024

హోంమంత్రి అనిత వార్నింగ్

image

AP: భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఘటనలోనైనా 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంలో పోలీసులు తలెత్తుకునేలా, నేరస్థుడు భయపడేలా చేస్తామని చెప్పారు.

News November 7, 2024

నేను YSRకు పుట్టలేదని అవమానించారు: షర్మిల

image

AP: తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. ‘నేను వైఎస్ఆర్‌కు పుట్టలేదని అవమానించారు. ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. అసభ్యకర పోస్టులతో ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై కఠినంగా చర్యలు ఉండాలి’ అని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.