News September 23, 2025

నవరాత్రుల్లో చేయాల్సిన దానాలు – ఫలితాలు (1/2)

image

1. బాలాత్రిపుర సుందరీ దేవి: వస్త్రాలు దానం చేస్తే సద్బుద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది.
2. గాయత్రీ దేవి: ఎర్రటి గాజులు దానం చేస్తే తేజస్సు పెరుగుతుంది.
3. అన్నపూర్ణా దేవి: అన్నదానం చేస్తే మీకు ధనధాన్యములకు లోటు ఉండదు.
4. లలితా త్రిపుర సుందరీ దేవి: సహస్ర నామ పుస్తకాలు దానం చేస్తే అఖండ కీర్తి లభిస్తుంది.
5. మహాలక్ష్మీ దేవి: దానం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్యం వరిస్తుంది.

News September 23, 2025

నవరాత్రుల్లో చేయాల్సిన దానాలు – ఫలితాలు (2/2)

image

6. సరస్వతీ దేవి: విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుంది.
7. దుర్గాదేవి: ఎర్ర చీర దానం చేస్తే విజయం లభిస్తుంది.
8. మహిషాసుర మర్దని: స్వయం పాకం దానం చేయడం వల్ల ధైర్యం పెరుగుతుంది. విజయం లభిస్తుంది.
9. రాజరాజేశ్వరీ దేవి: పూల మాలలు దానం చేయాలి. ఫలితంగా శక్తి, సౌభాగ్యం పెరుగుతుంది.

News September 23, 2025

బీటెక్, డిప్లొమా అర్హతతో 54 పోస్టులు

image

<>DRDO<<>> పరిధిలోని ఛాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌ 54 ఇంజినీరింగ్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 20వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నెలకు రూ.9వేల చొప్పున, డిప్లొమా విద్యార్థులకు రూ.8వేల చొప్పున స్టైపండ్ అందిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News September 23, 2025

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి: CM

image

TG: మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని CM రేవంత్ కోరారు. మేడారంలో మొక్కులు చెల్లించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః నిర్మాణం చేపట్టడం మాకు దక్కిన గొప్ప అవకాశం. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం. రామప్ప ఆలయం స్ఫూర్తిగా రాతి కట్టడాలు నిర్మిస్తాం. కుంభమేళాకు ₹వేల కోట్లు కేటాయించిన కేంద్రానికి మేడారం జాతరపై వివక్ష ఎందుకు’ అని ప్రశ్నించారు.

News September 23, 2025

ఈ ఆహారంతో క్యాన్సర్ దరిచేరదు: వైద్యులు

image

పీచు పదార్థాలు నిండిన ఆహార పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘పప్పులు, బీన్స్, చిరుధాన్యాలు, నట్స్, ఆకుకూరల్లో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పేగు బ్యాక్టీరియాను పోషిస్తాయి. శరీరంలో వాపును తగ్గించే సమ్మేళనాలను ఇవి ఉత్పత్తి చేస్తాయి. పీచు పేగులోని వ్యర్థాలను తొలగించి హానికర క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. బరువు, రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి’ అని సూచించారు.

News September 23, 2025

పల్లెల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?

image

ఒకప్పుడు గ్రామాల్లో కూరగాయలు ఎక్కువగా లభించేవి. కానీ ఇప్పుడు గ్రామీణులే పట్టణాల నుంచి కూరగాయలను కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. గతంలో మన పెద్దలు కూరగాయలు అందుబాటులో లేకపోతే పొలానికి వెళ్లి గట్ల వెంబడి ఆకుకూరలు సేకరించి కూరలు చేసేవారు. ఇప్పుడు వరి, ఇతర వాణిజ్య పంటల సాగువైపు పల్లె రైతులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆకుకూరలు, కూరగాయలను పట్టణ మార్కెట్‌లో అధిక ధరకు కొని తెచ్చుకుంటున్నారు.

News September 23, 2025

‘OG’లో అకీరానందన్?

image

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ఆయన కుమారుడు అకీరానందన్ నటించినట్లు చర్చ జరుగుతోంది. కత్తిపై ఓ కుర్రాడి కళ్లు కనిపించగా.. అవి అకీరావేనని ఫ్యాన్స్ అంటున్నారు. కచ్చితంగా ఎంట్రీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ పక్కన రాహుల్ రవీంద్రన్ నటించగా ఎడిటింగ్‌లో ఆ పాత్రను తొలగించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అది దర్శకుడి నిర్ణయమని ఓ ఫ్యాన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

News September 23, 2025

కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా వెనక్కి తగ్గం: ఉత్తమ్

image

TG: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేదే లేదని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. నీటి హక్కులు సాధించడంలో ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు.

News September 23, 2025

దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లల్లో కస్టమ్స్ సోదాలు

image

హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లింగ్ ఆరోపణలపై ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ పేరుతో కేరళ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో వాహనాల పత్రాలు పరిశీలించారు. పన్ను తప్పించుకునేందుకు భూటాన్ నుంచి లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కేరళ తెచ్చారన్న సమాచారంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 23, 2025

GSTతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల నష్టం: పొన్నం

image

TG: ప్రజలను దోచుకునేందుకు GSTని కేంద్రం ఆయుధంగా వాడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ‘GST అంటే గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. శవపేటికలపై కూడా కేంద్రం ట్యాక్స్ విధించింది. 8 ఏళ్లు ప్రజలను దోచుకుంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి GST తగ్గించింది. దీంతో రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దాన్ని కేంద్రమే పూడ్చాలి’ అని డిమాండ్ చేశారు.