News November 7, 2024

హ్యూమన్ ట్రాఫికింగ్‌.. ఆరుగురికి జీవితఖైదు

image

TG: మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి ఎన్‌ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితులు యూసఫ్ ఖాన్, బీతీ బేగం, రాహుల్, అబ్దుల్ సలాం, షీలా, సోజీబ్‌లు ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు కోర్టు తేల్చింది. 2019లో ఓల్డ్ సిటీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవడంతో NIA మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

News November 7, 2024

జగన్.. ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావ్?: అనిత

image

AP: గత పాలనలో అనేక మంది మానప్రాణాలు పోతుంటే పట్టించుకోని జగన్ ఇప్పుడు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. గత వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని అన్నారు. వైసీపీ హయాంలోనే డ్రగ్స్, గంజాయి వాడకం పెరిగిందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే వైసీపీ పాలనలో యువతిని హత్య చేశారని గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెడుతుందని చెప్పారు.

News November 7, 2024

వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టుకు చేరిన నివేదిక

image

ఆస్ప‌త్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది భ‌ద్ర‌తకు అనుస‌రించాల్సిన ప్రొటోకాల్‌ సిఫార్సుల‌కు ఏర్పాటైన నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్ త‌న నివేదిక‌ను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది. దీన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌తో పంచుకోవాల‌ని టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. నివేదికలోని అంశాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు బదిలీ అభ్యర్థనను SC తిరస్కరించింది.

News November 7, 2024

రాష్ట్రాన్ని వైసీపీనే అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మార్చింది: అనిత

image

AP: గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అత్యాచారాంధ్ర ప్రదేశ్‌గా మార్చిందని హోంమంత్రి అనిత దుయ్యబట్టారు. ఐదు నెలల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ హయాంలో ఏమి జరిగిందో ప్రజలు మర్చిపోలేరని చెప్పారు. తాము చేసిన తప్పులతోనే 11 సీట్లు వచ్చాయని నిన్న మాజీ మంత్రి అన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి 10 గంటలకో అత్యాచారం జరిగిందని తెలిపారు.

News November 7, 2024

పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ

image

AP: రాష్ట్ర సచివాలయంలో Dy.CM పవన్‌తో సమావేశమైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ట్వీట్ చేశారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారని పేర్కొన్నారు.

News November 7, 2024

యూరప్ పవర్‌హౌస్ జర్మనీలో రాజకీయ సంక్షోభం

image

జర్మనీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ట్రాఫిక్ లైట్ సంకీర్ణంగా పిలిచే SDP, గ్రీన్స్, FDP కూటమి చీలిపోయింది. ఆర్థిక విధానాల పరంగా సహకరించడం లేదని FM క్రిస్టియన్ లిండ్నర్‌ను ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ (SDP) డిస్మిస్ చేశారు. దీంతో FDPకి చెందిన రవాణా, న్యాయ, విద్యా మంత్రులు స్వచ్ఛందంగా రిజైన్ చేశారు. మైనారిటీలో పడ్డ SDP, గ్రీన్స్ కూటమి జనవరిలో విశ్వాస తీర్మానం నెగ్గాలి. ప్రజలైతే ఎన్నికలు కోరుకుంటున్నారు.

News November 7, 2024

ఇక జర్మనీ ఎకానమీ పనైపోయినట్టే!

image

జర్మనీ ఎకానమీ పతనం అంచున నిలబడింది. మానుఫ్యాక్చరింగ్ గ్రోత్ నెగటివ్‌లోకి వెళ్లింది. అప్పులు పెరిగాయి. పడిపోయిన GDP పుంజుకొనే అవకాశమే కనిపించడం లేదు. బడ్జెట్ లేనప్పటికీ ఉక్రెయిన్‌కు సాయం చేస్తోంది. తానే ఆంక్షలు పెట్టి రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ను చీప్‌గా కొనలేక ఇబ్బంది పడుతోంది. పెరిగిన పవర్, ఫుడ్ ఛార్జీలు, ద్రవ్యోల్బణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారు.

News November 7, 2024

విరాట్ 2027 వరకు ఆడతారు: జ్యోతిషుడు

image

గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవంగా ఆడుతుండటంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారికి ఆందోళన అవసరం లేదని జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్ లోబో జోస్యం చెప్పారు. ‘విరాట్ గురించి ఆయన ఫ్యాన్స్ నన్ను తరచూ అడుగుతుంటారు. ఆయన కనీసం 2027 వరకు ఆడతారు. కోహ్లీ బ్యాట్ పరుగుల వరద పారించే సమయం రానుంది. సచిన్‌ రికార్డుల్ని దాటలేకపోవచ్చు కానీ గవాస్కర్, ద్రవిడ్‌ను దాటుతారు’ అని అంచనా వేశారు.

News November 7, 2024

గోవాకు విదేశీయుల తాకిడి త‌గ్గుతోంది!

image

విహారం, విడిది కోసం గోవాకు వచ్చే విదేశీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా ప్యాండమిక్ త‌రువాత ఈ ట్రెండ్ పెరిగింది. 2019లో గోవాకు 9.4 ల‌క్ష‌ల మంది విదేశీయులు విచ్చేశారు. అయితే 2023లో ఆ సంఖ్య 4.03 ల‌క్ష‌లకు తగ్గింది. ఇది 60 శాతం త‌గ్గుద‌ల‌ను సూచిస్తోంది. గోవాలో ట్యాక్సీ మాఫియా వ‌ల్ల కొంద‌రు విదేశీయులు దోపిడీకి గుర‌య్యామ‌ని భావించడం, ఇత‌ర‌త్రా అసౌక‌ర్యాల వ‌ల్ల గోవా రావడం తగ్గించినట్టు తెలుస్తోంది.

News November 7, 2024

పోటీ చేయలేక పారిపోయిన జగన్ ముఠా: TDP

image

AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ నేత <<14551662>>పేర్ని నాని ప్రకటించడంపై<<>> టీడీపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి జగన్ రెడ్డి ముఠా పారిపోయిందని ట్వీట్ చేసింది. ఈవీఎంలపై నమ్మకం లేదని చెప్పి, బ్యాలెట్ ద్వారా జరుగుతున్నా పారిపోతున్నారని దుయ్యబట్టింది. ఎలాగూ ఓట్లు రావనే జగన్ రెడ్డి డిసైడ్ అయ్యి పోటీ చేయట్లేదని పేర్కొంది.